రహదారి విస్తరణకు వేళాయే
మార్కెట్ యార్డు నుంచి బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల వరకు 216 జాతీయ రహదారిని వంద అడుగుల వెడల్పున నాలుగు వరుసలుగా విస్తరించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. విస్తరణ పనులకు అవసరమైన భూసేకరణకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. సీఎం వైఎస్ జగన్కు రోడ్డు విస్తరణ పనుల
బాపట్లలో భవనాల యజమానులతో అధికారుల చర్చలు
150 కట్టడాల తొలగింపునకు ప్రతిపాదన
విస్తరించనున్న రహదారి
బాపట్ల, న్యూస్టుడే మార్కెట్ యార్డు నుంచి బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల వరకు 216 జాతీయ రహదారిని వంద అడుగుల వెడల్పున నాలుగు వరుసలుగా విస్తరించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. విస్తరణ పనులకు అవసరమైన భూసేకరణకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. సీఎం వైఎస్ జగన్కు రోడ్డు విస్తరణ పనుల ఆవశ్యకత వివరించి ఉప సభాపతి రఘుపతి అనుమతి మంజూరు చేయించారు. ఈ మార్గంలో మార్కెట్ యార్డు నుంచి పాత బస్టాండ్ వరకు రహదారి 90 నుంచి 100 అడుగుల వెడల్పు ఉంది. పాత బస్టాండ్ నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు 36 అడుగుల నుంచి 58 అడుగుల వెడల్పు మాత్రమే ఉంది.
సిబ్బందితో సర్వే..: పాత బస్టాండ్ నుంచి గడియార స్తంభం, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వరకు 80 అడుగులు, మిగిలిన ప్రాంతంలో 100 అడుగుల వెడల్పున రోడ్డు విస్తరించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత రహదారి కొలతలు, విస్తరణకు కావాల్సిన భూమి సేకరణకు సర్వేయర్లు, సిబ్బందితో సర్వే చేయించారు. తొలి దశలో పాతబస్టాండ్ నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు 150 కట్టడాలు తొలగించాల్సి ఉంటుందని అంచనావేశారు. త్వరలో పోలేరమ్మ ఆలయం నుంచి శ్రీనివాస మహల్ వరకు భూసేకరణపై కొలతలు వేయనున్నారు.
బాపట్లలో 216-ఎ జాతీయ రహదారి విస్తరణ పనులకు వేగంగా అడుగులు పడుతున్నాయి. రోడ్డు విస్తరణకు చేపట్టాల్సిన భూసేకరణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మార్గం ఇరుకుగా ఉండే పాతబస్టాండ్ నుంచి గడియార స్తంభం వరకు 80 అడుగుల వెడల్పున విస్తరించటానికి 150 కట్టడాలు తొలగించాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. భవనాల యజమానులు ఉప సభాపతి కోన రఘుపతిని కలిసి రహదారి విస్తరణ అరవై అడుగులకే పరిమితం చేయాలని కోరారు. అంతకు మించి తొలగిస్తే తాము జీవనోపాధి కోల్పోతామని వాపోయారు. భూసేకరణ నష్ట పరిహారాన్ని టీడీఆర్ బాండ్ల రూపంలో కాకుండా నగదు రూపంలో చెల్లించాలని యజమానులు కోరుతున్నారు.
నష్టపరిహారంగా నగదు ఇవ్వాలని వినతి..
పట్టణంలో ఇప్పటి వరకు రైల్వేస్టేషన్- డీఎస్పీ కార్యాలయం మార్గం, రథంబజారు, సూర్యలంక రోడ్డు, శివాలయం బజారు విస్తరించారు. రహదారి విస్తరణలో స్థలాలు కోల్పోతున్నవారికి టీడీఆర్ బాండ్లను పురపాలక అధికారులు అందజేశారు. అదేవిధంగా, 216 జాతీయ రహదారి విస్తరణంలో కట్టడాలు, స్థలాలు కోల్పోయేవారికీ బాండ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇటీవల వ్యాపారులు, భవనాల యజమానులు క్యాంప్ కార్యాలయంలో ఉప సభాపతిని కలిశారు. రహదారిని 80 అడుగుల వెడల్పున విస్తరిస్తే తీవ్రంగా నష్టపోతామని తెలిపారు. విస్తరణను అరవై అడుగుల వరకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. స్థలాలు కోల్పోయేవారికి టీడీఆర్ బాండ్లు బదులు నష్టపరిహారంగా నగదు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. వారు చెప్పి విషయాలు సావధానంగా ఉన్న ఉప సభాపతి పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అధికారులతో ఆయన సోమవారం సమావేశమై భూసేకరణకు చేస్తున్న ప్రతిపాదనలపై చర్చించారు. వ్యాపారులు, యజమానులతో అధికారులు ఈ నెల 27న సమావేశం నిర్వహించి రహదారి విస్తరణ పనులు, భూసేకరణపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
పట్టణాభివృద్ధికి సహకరించాలి
పట్టణాభివృద్ధికి రహదారుల విస్తరణ తప్పనిసరి. బాపట్ల- చీరాల రోడ్డు విస్తరణకు భవన యజమానులు, వ్యాపారులు సహకరించాలి. ఆర్థిక వనరుల పరిమితి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు భవనాలు, స్థలాలు కోల్పోయేవారికి టీడీఆర్ బాండ్లు కేటాయిస్తున్నాం. గతంలో ఆస్తి విలువకు రెండు రెట్లు సమానమైన బాండ్ ఇచ్చాం. ప్రధాన మార్గం కావటంతో యజమానులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ఆస్తి మార్కెట్ విలువకు నాలుగు రెట్లు సమానమైన బాండ్లు అందజేయాలని నిర్ణయించాం. - భానుప్రతాప్, పురపాలక కమిషనర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు