ఆడాలంటే భారీగా చెల్లించాల్సిందే
ప్రభుత్వం క్రీడా మైదానాల వినియోగ రుసుములను భారీగా పెంచింది. ఈ మేరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నుంచి వెలువడిన ఉత్తర్వులు జిల్లాలోని గుంటూరు, తెనాలి, పొన్నూరు క్రీడా మైదానాల పర్యవేక్షక అధికారులకు చేరాయి. మే నెల నుంచి పెంచిన
క్రీడా మైదానాల వినియోగ రుసుముల పెంపు
తెనాలి టౌన్, న్యూస్టుడే
తెనాలి స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతున్న క్రీడాకారులు
ప్రభుత్వం క్రీడా మైదానాల వినియోగ రుసుములను భారీగా పెంచింది. ఈ మేరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నుంచి వెలువడిన ఉత్తర్వులు జిల్లాలోని గుంటూరు, తెనాలి, పొన్నూరు క్రీడా మైదానాల పర్యవేక్షక అధికారులకు చేరాయి. మే నెల నుంచి పెంచిన రుసుములు వసూలు చేయడానికి అధికారులు ప్రయత్నించగా క్రీడాకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గుంటూరు, తెనాలి స్టేడియంల వద్ద నిరసనలు కూడా జరిగాయి.
జిల్లాలోని స్టేడియాల్లో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, క్రికెట్, స్విమ్మింగ్, స్కేటింగ్ వంటి ఆటలను వసతులు అందుబాటులో ఉన్న చోట ఆసక్తి ఉన్న వారంతా వచ్చి అడుకునే వారు. ఇందుకుగాను శాశ్వత ప్రవేశ రుసుము కింద రూ.2 వేలు, నెలకు ఫీజు రూ.500 నుంచి రూ.800 వరకూ ఉండేవి. వాటిని ఇటీవల ఒక్కసారిగా అధికంగా పెంచారు. గతంలో లేనివిధంగా రద్దీ సమయాలు, రద్దీ తక్కువగా ఉండే వేళలంటూ విభజించారు. ఉదయం 5 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు రద్దీ సమయాలుగానూ, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు రద్దీ తక్కువగా ఉన్న సమయాలుగానూ నిర్ణయించారు. రద్దీ వేళల్లో ప్రవేశ రుసుమును రూ.3 వేలుగా, నెల వారీ ఫీజును రూ.1500కు, అలాగే రద్దీ తక్కువగా ఉండే వేళల్లో అయితే ప్రవేశ రుసుము రూ.2 వేలు, నెల వారీ ఫీˆజు రూ.1000గా పెంచేశారు.
యోగా సాధకులూ నెలకు రూ.1000 చెల్లించాల్సిందే
క్రీడా మైదానాల్లో యోగా చేసుకునేవారికి ఇప్పటివరకు ప్రత్యేకంగా ఎలాంటి రుసుము లేదు. స్టేడియం నిర్వహణ కమిటీలు కోరితే నెలకు రూ.100 చొప్పున నామమాత్రపు రుసుమును కొందరు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు వచ్చిన ఉత్తర్వుల్లో యోగా సాధకులు కూడా నెలకు రూ.1000 రుసుము చెల్లించాలని స్పష్టం చేశారు. మైదానాల పర్యవేక్షకుల నుంచి ఈ సమాచారం విన్న యోగా సాధకులు నివ్వెరపోతున్నారు. ఉదాహరణకు తెనాలి స్డేడియం తీసుకుంటే ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా 14 మంది యోగా సాధన చేస్తున్నారు. నెలకు రూ.1000 చెల్లించాలని చెప్పేసరికి వారు ఇకపై ఇళ్ల వద్దే సాధన చేసుకుంటామని స్పష్టం చేశారు. ఇదే తీరులో ఇక్కడ సుమారు 70 మందికి పైగా బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఇప్పటివరకూ నెలకు రూ.700 చెల్లించి ఉదయం సమయంలో ఆడుకునేవారు. నెలకు రూ.1500 చొప్పున కట్టాలని వారికి చెప్పడంతో తాము అంత చెల్లించలేమని విచారం వ్యక్తంచేశారు. వాస్తవానికి మే నెల తొలి వారంలోనే నెలవారీ రుసుములు వసూలయ్యేవి. ఈ మారు ఇప్పటివరకు ఎవరూ ఫీజలు కట్టలేదు. మొత్తం మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద క్రీడాకారులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆటలను కూడా వాణిజ్యపరంగా చూడడం దారుణమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
అందరి వినతి మేరకు రుసుములు తగ్గొచ్చు
- డాక్టర్ వి.శ్రీనివాస్, ముఖ్య కార్యనిర్వహణాధికారి, క్రీడాప్రాధికార సంస్థ, గుంటూరు జిల్లా
రుసుములు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతూ క్రీడాకారులు వినతిపత్రాలు ఇచ్చారు. వాటిని రాష్ట్ర అధికారులకు పంపించాం. ఈ విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని, కొద్ది రోజుల్లోనే రుసుములు తగ్గించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!