అమ్మో.. అక్కడికి వెళ్లలేం!
జిల్లాలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఐదేళ్లు పూర్తయినవారికి బదిలీ తప్పనిసరి కావడం, చాలారోజుల తర్వాత బదిలీలకు అనుమతి ఇవ్వడంతో చాలామంది ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతం నుంచి కొత్త ప్రాంతాలకు
ఈనాడు, అమరావతి: జిల్లాలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఐదేళ్లు పూర్తయినవారికి బదిలీ తప్పనిసరి కావడం, చాలారోజుల తర్వాత బదిలీలకు అనుమతి ఇవ్వడంతో చాలామంది ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతం నుంచి కొత్త ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయా ప్రాంతాల నేతల వద్దకు వెళ్లి సిఫార్సు లేఖలు తెచ్చుకుని దరఖాస్తుకు జతచేస్తున్నారు. ఈక్రమంలో జిల్లాలో డెల్టాలోని ఒక నియోజకవర్గంలో పనిచేయడానికి అక్కడికి బదిలీపై వెళ్లడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న అధికారులను తన నియోజకవర్గంలో పనిచేయవద్దని లేఖలు ఇవ్వడంతో వారంతా ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లడానికి సిద్ధమయ్యారు. రవాణాసౌకర్యాలు, ఇతర అనుకూలతలు అన్నీ ఉన్నా అక్కడి పరిస్థితుల దృష్ట్యా పనిచేయడానికి ఎవరూ ఇష్టపడటం లేదన్న చర్చ ఉద్యోగుల్లో నడుస్తోంది. అక్కడి పనిచేసి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళుతున్నవారితో అక్కడి పరిస్థితిని తెలుసుకున్న ఉద్యోగులు అక్కడికి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. ఆనియోజకవర్గంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు వివిధ కారణాలతో సస్పెన్షన్కు గురికావడంతో అందరిలోనూ చర్చనీయాంశమైంది. దీంతో అక్కడికి వచ్చేవారికి ఎలాంటి షరతులు ఉండవని చెబుతూ కొందరు ఉద్యోగులకు సోమవారం ఫోన్ చేసి రావాలని కోరడం గమనార్హం. ఈవిషయం ఉద్యోగులకు తెలియడంతో ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే అంచనా వేశామని ఒకరికొకరు చర్చించుకుంటున్నారు.
నేతల అభిప్రాయమే కీలకం....: ఒకప్పుడు ఉద్యోగుల బదిలీలు పరిపాలనా అవసరాలు, ఉద్యోగుల సామర్థ్యం, పనితీరు మదింపు చేసుకుని ఉన్నతాధికారులు బదిలీలు చేసేవారు. ఉద్యోగుల ఆరోగ్య, ఇతరత్రా సమస్యలను పరిగణనలోకి తీసుకుని కొందరికి బదిలీల్లో వెసులుబాటు ఇచ్చేవారు. ఉన్నతాధికారులు అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేయడంతో పరిపాలనాపై పట్టు ఉండేది. యంత్రాంగం కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేసేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగులు బదిలీపై ఎక్కడికి వెళ్లాలన్నా అక్కడి నేత నుంచి లేఖ తీసుకోవడం సర్వసాధారణమైంది. బదిలీ కావాలన్నా.... కోరుకున్న స్థానం పొందాలన్నా అక్కడి నేత లేఖ కావాల్సిందే. దీంతో ఉన్నతాధికారులు నేతల సిఫార్సులకు అనుగుణంగా బదిలీలు చేయాల్సి వస్తోంది. దీనివల్ల పరిపాలనాలోనూ తరచూ ఇబ్బందులు వస్తున్నాయి. రెండేళ్ల కిందట బదిలీలపై నిషేధం ఉన్నా క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని నేతల సిఫార్సులకు అనుగుణంగా బదిలీ చేయడం వల్ల ఏడాదిపాటు ఆ ఉద్యోగులకు వేతనాలు అందని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల వారి సమస్య పరిష్కారమైంది. కొందరు నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు కొన్నిసార్లు ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఒకే కార్యాలయంలో ఐదేళ్లు పూర్తయితే తప్పనిసరిగా బదిలీపై వెళ్లాలని మార్గదర్శకాలు చెబుతున్నా కొందరు వాటిని అనుసరించకుండా నేతలతో సిఫార్సు చేయిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన మాజీ మంత్రి డొక్కా
[ 26-04-2024]
వైకాపాకు రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ తెదేపాలో చేరారు. తన అనుచరులతో కలిసి అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపా కండువా కప్పుకొన్నారు. -
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!