బాధితుల సంగతేంటి?
విజయవాడ నగరంలోని టయోటా కంపెనీ డీలర్లు చేసిన అక్రమాల కారణంగా వాహనదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కొనుగోలుదారులు డీలర్కు అన్ని రకాల పన్నులు చెల్లించారు. కానీ ఆర్థిక సమస్యల కారణంగా షోరూమ్ నిర్వాహకులు
ఆ రెండు షోరూమ్లలో కొన్న కార్లపై అనిశ్చితి
ఈనాడు, అమరావతి: విజయవాడ నగరంలోని టయోటా కంపెనీ డీలర్లు చేసిన అక్రమాల కారణంగా వాహనదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కొనుగోలుదారులు డీలర్కు అన్ని రకాల పన్నులు చెల్లించారు. కానీ ఆర్థిక సమస్యల కారణంగా షోరూమ్ నిర్వాహకులు ఏడాది నుంచి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా సొంతానికి వాడేసుకున్నారు. ఈ మొత్తాలు చెల్లించకపోవడం వల్ల కొన్న వాహనాలన్నీ అనధికారికమైనవిగానే పరిగణిస్తారు. నిబంధనల ప్రకారం ఇవి రోడ్డుపై తిరిగితే సీజ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎటువంటి ప్రమేయం లేని వాహనదారుల పరిస్థితి ఏమిటన్నది అగమ్యగోచరంగా తయారైంది. రాధామాధవ్ టయోటా, లీలాకృష్ణ టయోటా నుంచి కొని మోసపోయిన వారిలో చాలా మంది ప్రజాప్రతినిధులు, నేతలు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ షోరూమ్లను రవాణా శాఖ అధికారులు మూసివేశారు. వారి డీలర్షిప్లపై ఎటువంటి క్రయవిక్రయాలు జరగకుండా లాగిన్లను నిలుపుదల చేశారు. మరి కొనుగోలుదారులకు ఏ విధంగా న్యాయం చేస్తారన్నది తేలాల్సి ఉంది.
* సాధారణంగా ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేస్తే.. జీవిత పన్ను, బీమా, ఇన్వాయిస్, వంటి వాటిని సంబంధిత డీలర్ రవాణా శాఖ సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. అనంతరం ఆ వాహనానికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబరును కేటాయిస్తారు. అప్పుడే అధికారికం అవుతుంది, రోడ్డుపైన తిరిగేందుకు అవకాశం ఉంది. దీనికి భిన్నంగా విజయవాడలోని ఈ డీలర్లు వ్యవహరించారు. కొనుగోలుదారుల నుంచి నిబంధనల ప్రకారం పన్నులు వసూలు చేశారు. కానీ ఆ మొత్తాన్ని రవాణా శాఖకు జమ చేయకుండానే స్వాహా చేశారు. కానీ వాహనాన్ని కొనుగోలుదారుడికి ఇచ్చేశారు. మరికొంత మంది నుంచి వాహనం డెలివరీ ఇస్తానని చెప్పి ముందస్తుగా డబ్బు తీసుకుని ఆనక చేతులెత్తేశారు. ఈ విధంగా నగరంలోని రాధా మాధవ్ టయోటా, లీలాకృష్ణ టయోటా షోరూమ్ల నిర్వాహకులు అందినకాడికి వసూలు చేశారు. ఇలా పలు వాహనాలను అంటగట్టినట్లు సమాచారం. ఎన్ని వాహనాలు?, ఎంత మొత్తానికి అక్రమాలకు పాల్పడ్డారన్నది తెలియడం లేదు. రూ.కోట్లలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
* నగరంలోని పలు స్టేషన్లలో డీలర్ల మోసంపై ఫిర్యాదులు నమోదు అయినట్లు తెలిసింది. ఇప్పటి వరకు పటమట పోలీసుస్టేషన్లలో రెండు కేసులు ఉన్నట్లు వెలుగు చూసింది. గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన శాంతిరాజు.. ఈ ఏడాది జనవరి ఆరో తేదీన విజయవాడ శివారు ప్రసాదంపాడులోని రాధామాధవ్ టయోటా షోరూమ్కు వెళ్లాడు. ఇన్నోవా క్రిస్టా కారు కోసం బుక్ చేసుకున్నాడు. 3 విడతలుగా రూ.29.04లక్షలు చెల్లించాడు. వాహనాన్ని జనవరి నెలాఖరు నాటికి డెలివరీ ఇస్తామని డీలరు చెప్పారు. కానీ గుంటూరు షోరూమ్ వారు ఎంతకీ కారు ఇవ్వకుండా దాటవేత ధోరణితో వ్యవహరించేవారు. జూన్లో గుంటూరు షోరూమ్ మూసివేశారు. అనంతరం విజయవాడ ప్రసాదంపాడు షోరూమ్కు వచ్చి టయోటా కంపెనీకి చెందిన కోస్తా ప్రతినిధి అయిన చంద్రను, షోరూమ్ ఎండీని కలిశారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో శాంతిరాజు ఫిర్యాదు చేశారు. పోలీసుల జోక్యంతో మేనేజరు వెంకటశ్రీనివాసరావు మూడు దఫాలుగా రూ.10లక్షలు చెల్లించారు. ఆ తర్వాత స్పందన లేకపోవడంతో బాధితుడు పటమట స్టేషనులో ఫిర్యాదు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
స్వతంత్ర అభ్యర్థిని.. కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.