logo

మానవతావాది దీనదయాళ్‌ ఉపాధ్యాయ

పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ గొప్పమానతావాదని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం స్థానిక లాలుపురం రోడ్డులోని భాజపా జిల్లా కార్యాలయంలో ఉపాధ్యాయ జయంతి జరిగింది.

Published : 26 Sep 2022 06:01 IST


దీనదయాళ్‌ ఉపాధ్యాయ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ తదితరులు

నగరంపాలెం, న్యూస్‌టుడే: పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ గొప్పమానతావాదని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం స్థానిక లాలుపురం రోడ్డులోని భాజపా జిల్లా కార్యాలయంలో ఉపాధ్యాయ జయంతి జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికి కన్నా లక్ష్మీనారాయణ పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాతూతూ సమాజం మార్పు కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు.  కార్యక్రమంలో భాజపా సీనియర్‌ నాయకులు యడ్లపాటి రఘునాథబాబు, వల్లూరు జయప్రకాష్‌నారాయణ, పాలపాటి రవికుమార్‌, భాస్కర్‌, నీలం ప్రసాద్‌, చంద్రశేఖర్‌, వెలగలేటి గంగాధర్‌, రమాకుమారి, నాగమల్లేశ్వరీ, కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని