ఇరుముళ్లంటే ఇంత నిర్లక్ష్యమా!
‘దుర్గగుడికి తరలివచ్చే భవానీ భక్తుల కోసం కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో.. పవిత్రమైన ఇరుముడి బియ్యాన్ని రోడ్ల పక్కనే పడేసి వెళ్లిపోయే పరిస్థితి దాపురించింది. అమ్మవారి దర్శనాలు చేసుకుని మహామండం నుంచి కిందకు వచ్ఛి. కనకదుర్గానగర్లో రాతి మండపాల పక్కన కుప్పలుగా బియ్యం పోసేసి వెళ్లిపోయారు.
ఈనాడు, అమరావతి
భక్తులు నడిచే దారిలో పోసిన ఇరుముడుల బియ్యం
విజయ దశమి తర్వాత గురు, శుక్రవారాల్లో రెండు రోజులు ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. రెండు రోజుల్లో కనీసం మూడు లక్షల మందికి పైగా భవానీలు తరలివచ్చారు. వీరు తలపై పెట్టుకుని తీసుకొచ్చిన ఇరుముడిలోని బియ్యాన్ని.. ఎక్కడ ఉంచాలో, ఎవరికి ఇవ్వాలో కూడా తెలియని అయోమయంలో పడిపోయారు. దాంతో.. గుడి ప్రాంగణంలోనే ఏదో ఒక మూల పెట్టేసి వెళ్లిపోవాలనే భావనతో రోడ్ల పక్కన పడేశారు. ఇరుమడిలోని బియ్యం, పసుపు కుంకుమ, పండ్లు, డబ్బులు.. ఇవన్నీ పడేశారు. నేతి కొబ్బరికాయలను మాత్రం హోమగుండంలో వేసేందుకు తమవెంట పట్టుకుని వెళ్లిపోయారు. ఈ ఏడాది దసరాలో ఇరుముడి స్వీకరణకు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదంటూ ఆలయం తరఫున ఒక ప్రకటన చేసి వదిలేశారు. ఆ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోని భవానీ భక్తులకు సరిగా చేరలేదు. దీంతో వాళ్లు ఇరుముళ్లతో ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
న్యాయస్థానంలోనూ వాదోపవాదాలు..
దుర్గగుడిలో దసరా ఉత్సవాలకు ఈ దసరాలో లక్షల మంది భవానీలు తరలివస్తున్నారని, వారికోసం ఇరుముళ్ల స్వీకరణ, హోమగుండం ఏర్పాటు చేయాలంటూ.. సుంకర దుర్గారావు, మయూరి రాము, కోరాడ నాగదుర్గాప్రసాద్, మల్లెల బాలకృష్ణారెడ్డి, సల్లా శ్రీనివాసరావు, లక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పట్నాల లక్ష్మణరెడ్డి తదితర గురుభవానీల ఆధ్వర్యంలో న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. దసరాలో ఏటా ఇరుముళ్ల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారని, ఈసారి కూడా చేయాలంటూ కోరారు. దీనిపై దుర్గగుడి తరఫున వివరణ ఇస్తూ.. గత రెండేళ్లలో కొవిడ్ నేపథ్యంలో భక్తులు తక్కువ వచ్చారని, ఈసారి భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, కనీసం ఐదు లక్షల మంది రావొచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. అంతమందికి సంబంధించి ఇంత తక్కువ సమయంలో ఏర్పాట్లు చేయడానికి ఇబ్బంది అవుతుందని వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూపర్-6తో భవిష్యత్తు గ్యారెంటీ
[ 10-05-2024]
‘అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ఇక్కడ నివసిస్తున్న వివిధ వృత్తుల వారు చేసే పనికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఆదాయం పెరిగేలా చేస్తాం. ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసి అక్కడ పని చేసుకోవడానికి అన్ని వసతులు.. -
ఈ అరాచకాల్ని.. ఆపేదెవరు..?
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు మూడు రోజుల సమయమే ఉంది. శనివారం సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. సోమవారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పల్నాడులో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం కత్తిమీదసాములా మారింది. -
అన్నవి హామీలే.. కర్షకులకు కష్టాలే
[ 10-05-2024]
జిల్లాలో పంటలు చేతికొచ్చే వేళ మిగ్జాం తుపానుతో రైతులు సర్వం కోల్పోయారు. కోత కోసి ఓదెల మీద ఉన్న వరి పనలు తడిచిపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలకొరిగి నష్టం జరిగింది. -
ప్రతీ నెలా నిరీక్షణే.. జీవితకాలం నష్టమే..
[ 10-05-2024]
2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2022లో పీఆర్సీని ప్రకటించారు. 11వ పీఆర్సీలో ఫిట్మెంట్ 23 శాతానికి ప్రభుత్వం తగ్గించడంతో విశ్రాంత ఉద్యోగుల పింఛన్లో 4 శాతం కోత పడింది. -
బరితెగించిన వైకాపా
[ 10-05-2024]
గుంటూరు నగరంలో వైకాపా తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి బరి తెగించారు. ప్రజల నుంచి మద్దతు లేదని గుర్తించిన సదరు వ్యక్తులు అడ్డదారుల్లోనైనా గెలవాలనే లక్ష్యంతో సామ, దాన, దండోపాయాలు అవలంబిస్తున్నారు. -
నా సోదరి మాధవిని గెలిపించండి
[ 10-05-2024]
గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన నా సోదరి గళ్లా మాధవిని గెలిపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. జనసేన కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె పవన్ కల్యాణ్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. -
ఐఎఫ్ఎస్కు నడింపల్లి యువతి ఎంపిక
[ 10-05-2024]
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో చెరుకుపల్లి మండలం నడింపల్లికి చెందిన వెన్నం అనూష 73వ ర్యాంక్ సాధించారు. ఎన్నో ప్రయత్నాల తరువాత ఆమె ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. -
అంతర్ జిల్లాల బ్యాలట్లు గల్లంతు
[ 10-05-2024]
పోస్టల్ బ్యాలట్ మొదలైనప్పటి నుంచి అంతర్ జిల్లాల ఉద్యోగుల విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. తొలి రోజు నుంచి బ్యాలట్ల కొరత ఉందని చెబుతూనే.. -
మంగళగిరి ప్రజలూ నా కుటుంబ సభ్యులే
[ 10-05-2024]
మంగళగిరి ప్రజలు తనకు సొంత కుటుంబ సభ్యులతో సమానమని కూటమి తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరి మండలం కురగల్లు, నిడమర్రు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తల్లి నారా భువనేశ్వరితో కలసి గురువారం ‘రచ్చబండ’ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
దోశలో ఇనుప వాషర్ బోల్ట్
[ 10-05-2024]
గుంటూరులోని కొందరు హోటల్స్ నిర్వాహకులు ఆహార పదార్థాల తయారీలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గురువారం కొరిటెపాడులోని ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్లిన వినియోగదారుడికి ఎదురైన సంఘటనే తార్కాణం. -
రోశయ్య, ఆళ్ల మాట తప్పారు
[ 10-05-2024]
పెదకాకాని హజరత్ సయ్యద్ బాజిషహీద్ అవులియా బాబా దర్గా నిర్వహణ బాధ్యతల విషయంలో ఎమ్మెల్యేలు రోశయ్య, ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట తప్పారు. ఈ కారణంగా ముత్తవల్లీ, ముజావర్ల వంశాలకు చెందిన 200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. -
‘వైకాపా అభ్యర్థులను అన్ని చోట్లా ఓడించండి’
[ 10-05-2024]
దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ దళితుల్ని నిలువునా వంచించారని ప్రభుదా రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావ్,
తాజా వార్తలు (Latest News)
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం