ఇళ్ల నిర్మాణంలో తంటాలు
పేదల పక్కా గృహాల ప్రారంభోత్సవానికి సీఎం వైఎస్ జగన్ డిసెంబరులో బాపట్ల వస్తారన్న సమాచారంతో గృహ నిర్మాణానికి జిల్లా అధికార యంత్రాంగం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పక్కాగృహాల నిర్మాణంలో జిల్లా వెనకబడి ఉండటంపై ఇటీవల నిర్వహించిన వీసీలో సీఎం జగన్ ఆరా తీశారు.
మహిళా సమాఖ్యలకు గృహ నిర్మాణ బాధ్యత
ప్యాడిసన్పేట లేఅవుట్ ప్రారంభోత్సవానికి డిసెంబరులో సీఎం రాక
న్యూస్టుడే, బాపట్ల
పేదల పక్కా గృహాల ప్రారంభోత్సవానికి సీఎం వైఎస్ జగన్ డిసెంబరులో బాపట్ల వస్తారన్న సమాచారంతో గృహ నిర్మాణానికి జిల్లా అధికార యంత్రాంగం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పక్కాగృహాల నిర్మాణంలో జిల్లా వెనకబడి ఉండటంపై ఇటీవల నిర్వహించిన వీసీలో సీఎం జగన్ ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఇంత వరకు నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ బాధ్యతను మహిళా సమాఖ్యలకు అప్పగించాలని నిర్ణయించారు. అయితే జగనన్న లేఔట్లలో మౌలిక వసతులు లేక ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి మెరకలు వేయకపోవటంతో భారీ వర్షాలకు జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి.
* ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారుల స్థలాలు రద్దు చేసి వేరే వారికి ఇస్తామని కలెక్టర్ పేరుతో నోటీసులు జారీ చేశారు. నిరుపేదలు ఆర్థిక ఇబ్బందులతో గృహ నిర్మాణం తమ వల్ల కాదంటూ చేతులేత్తేస్తున్నారు. పక్కా గృహాల నిర్మాణంలో చీరాల, అద్దంకి పట్టణాలు, అద్దంకి మండలం, సంతమాగులూరు, యద్దనపూడి, జె.పంగులూరు, కొరిశపాడు, బల్లికురవ మండలాలు వెనుకబడి ఉన్నాయి. నియోజకవర్గ, మండల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు, పురపాలక కమిషనర్లు, ఎంపీడీవోలను వారంలో రెండు సార్లు జగనన్న కాలనీలకు పంపించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయిస్తున్నారు. కాలనీల్లో పరిస్థితులను వీడియోకాల్ ద్వారా జిల్లా పాలనాధికారికి అధికారులు వివరిస్తున్నారు.
* ఇప్పటి వరకు పునాది వేయని, పునాది దశలో ఆగిన ఇళ్ల నిర్మాణ బాధ్యతను మహిళా సమాఖ్యలకు అప్పగించారు. మహిళా సమాఖ్యలే భవన నిర్మాణ కార్మికులను మాట్లాడి పనులు చేయించాలని ఆదేశించారు. ఈ విధంగా అయినా పక్కాగృహాల నిర్మాణంలో కదలిక వచ్చి పురోగతి కనిపిస్తుందని అధికారులు భావిస్తున్నారు. లబ్ధిదారుల ఆర్థిక ఇబ్బందులతో 16 వేలకు పైగా గృహాలు వివిధ దశల్లో అసంపూర్తిగా ఆగిపోయి ఉన్నాయి. వీరితోను అధికారులు మాట్లాడి పనులు తిరిగి ప్రారంభించాలని ఒత్తిడి తెస్తున్నారు.
* ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80లక్షలు అందిస్తోంది. ఇందులో భాగంగానే లబ్ధిదారులకు ఇసుక, స్టీలు, సిమెంటు బస్తాలను గృహనిర్మాణ శాఖ అధికారులు అందజేస్తున్నారు. భవన నిర్మాణ సామగ్రి ధరలు బాగా పెరిగాయి. పునాది నిర్మాణం చేపట్టాలంటే రూ.80 వేల వరకు ఖర్చు అవుతోంది. నిరుపేదలు పునాది నిర్మాణం చేపట్టలేని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా చేయూత అందించటానికి పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న 16,343 మంది లబ్ధిదారులైన మహిళలు ఒక్కొక్కరికి గృహ నిర్మాణానికి రూ.35 వేల రుణం మంజూరు చేయించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 10,473 మందికి రుణాలు మంజూరు చేయించారు. ఇంకా 5,870 మందికి రుణాలు అందాల్సి ఉంది. రుణం ద్వారా వచ్చిన సొమ్మును ఇంటి నిర్మాణానికే లబ్ధిదారులు వినియోగించేలా సచివాలయ సిబ్బంది చూస్తున్నారు.
ప్యాడిసన్పేట లేఔట్లో జగనన్న కాలనీ
* వ్యవసాయ భూములు, లోతట్టు ప్రాంతాల్లో జగనన్న కాలనీలు ఉండటంతో వర్షాలకు ముంపు బారినపడ్డాయి. చాలా చోట్ల మెరకలు వేయలేదు. అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టలేదు. భారీ వర్షాలకు నిర్మాణ సామగ్రి తరలించలేని దుస్థితి నెలకొంది. అన్ని కాలనీల్లో విద్యుద్దీకరణ పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. పక్కా గృహాల పురోగతిపై రాష్ట్రస్థాయిలో బాపట్ల జిల్లా కింది నుంచి నాలుగో స్థానంలో ఉంది. ఉన్నతాధికారులు, కలెక్టర్ సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నా మౌలిక వసతుల కొరత, ప్రభుత్వం అందిస్తున్న సాయం సరిపోక ఇళ్ల నిర్మాణాలు నత్తనడక సాగతున్నాయి. బాపట్లలో ప్యాడిసన్పేట లేఅవుట్ జగనన్న కాలనీలో 1800లకు పైగా గృహాలు మంజూరు చేశారు. అంతర్గత రహదారులు బురదమయంగా మారి ఇసుక, సిమెంటు తరలింపు కష్టతరమవుతోంది.
గృహ నిర్మాణానికి అధిక ప్రాధాన్యం
పేదల పక్కా గృహాల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వ సాయానికి తోడు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తున్నాం. దశలవారీగా జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పన చేపడుతున్నాం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. డిసెంబరులోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. - విజయకృష్ణన్, కలెక్టర్
జిల్లాకు కేటాయించిన గృహాలు 32,602
మొత్తం జగనన్న లేఔట్లు 282
నిర్మాణాలు ప్రారంభించని గృహాలు 522
పునాది దశలో ఆగినవి 17,743
పునాది పూర్తయిన గృహాలు 5261
గోడల వరకు నిర్మించిన ఇళ్లు 1132
శ్లాబ్ వేసినవి 2323
పూర్తయినవి 3109
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!