గదుల్లేవ్.. టీచర్ల కొరత!
‘ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. సర్కారీ బడుల్లో చదివే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తే వీరు ప్రపంచంతో పోటీ పడతారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పరిస్థితిదీ
ఈనాడు-అమరావతి
గుంటూరు నగరంలో చెట్టు నీడన చదువుకుంటున్న విద్యార్థులు
‘ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. సర్కారీ బడుల్లో చదివే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తే వీరు ప్రపంచంతో పోటీ పడతారు. లేదంటే ఉద్యోగాలు దక్కించుకోవటంలో వెనకబడిపోతారు’ అని అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేల దాకా సభల్లో వల్లెవేస్తారు.
క్షేత్రస్థాయిలో పాఠశాలల్లో బోధనకు సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారా? లేరా? అనేది పట్టించుకోవటం లేదు. టీచర్లు, గదులు కొరతే కాదు నిన్న, మొన్నటి దాకా పుస్తకాల కొరత సమస్యలతోనూ విద్యార్థులు, ఉపాధ్యాయులు సతమతమయ్యారు. నాడు-నేడులో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. అందుకు తగ్గట్లు ఉపాధ్యాయులను నియమించలేదు. టీచర్ల కొరతతో ఒకే టీచర్ తాను బోధించే సబ్జెక్టుతో పాటు అదనంగా మరో సబ్జెక్టును బోధిస్తున్న పరిస్థితి ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా ఉంది. ఇలా ఉపాధ్యాయులపై పనిభారం పెరగటంతో మొక్కుబడి బోధన చేస్తున్నారు.. సబ్జెక్టు టీచర్ల ఖాళీల్లో కనీసం వాలంటీర్లను నియమించినా తమకు కొంత వెసులుబాటు కలుగుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఆదివారం పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగుల జడ్పీ హెచ్ఎస్ విద్యార్థులు బోధనకు సరిపడా టీచర్లు లేరని రోడ్డెక్కారు. గణితం, సైన్సు, సోషల్ బోధించే ఉపాధ్యాయులు లేరు. గతేడాది ఎక్కువమంది హిందీ, సోషల్, గణితంలో తప్పారు. ప్రధానంగా టెన్త్ విద్యార్థులకు టీచర్లు లేకపోతే నష్టపోతారు. వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. మరికొద్ది రోజుల్లో సిలబస్ పూర్తి చేసి తిరిగి పునశ్చరణ ప్రారంభించాలి. ఆ సమయానికి అయినా డిప్యూటేషన్పై సర్దుబాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
పల్నాడు నుంచి డిప్యూటేషన్లు..
పల్నాడు ప్రాంతం నుంచి కొందరు టీచర్లు డిప్యూటేషన్, సర్దుబాటు పేరుతో ప్రభుత్వ స్థాయిలోనే పైరవీలు చేసుకుని గుంటూరు చుట్టుపక్కలకు వచ్చేశారు. దీంతో పల్నాడు పాఠశాలల్లో బాగా కొరత ఉంది. గుంటూరు జిల్లాలో మంగళగిరి, గుంటూరు నగరపాలక ఉన్నత పాఠశాలల్లో టీచర్ల కొరత వేధిస్తోంది. హైస్కూళ్లు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎస్ఏలు, ఎస్జీటీ, పీఈటీ, పీడీలు ఇలా అన్ని క్యాడర్లలో కొరత ఉంది. కొందరు ఉద్యోగ విరమణ చేయగా మరికొందరు దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లటం, విలీనం, గత మూడేళ్లుగా డీఎస్సీ నియామకాలు చేపట్టకపోవటం వంటివి టీచర్ల కొరతకు కారణాలుగా ఉపాధ్యాయ సంఘాలు నాయకులు తెలిపారు.
మచ్చుకు కొన్ని పాఠశాలల్లో కొరత ఇలా..
* గుంటూరు కొల్లిశారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో ఆంగ్లం బోధించేవారు లేరు. స్వర్ణాంద్రనగర్ అప్గ్రేడెడ్ స్కూల్, అశోక్నగర్ యూపీ పాఠశాలలోనూ టీచర్ల సమస్య నెలకొంది.
* మంగళగిరి మున్సిపల్ వీవర్స్ కాలనీ పాఠశాలలో పెద్ద సంఖ్యలో పిల్లలు ఉన్నారు. కానీ వారికి తగ్గ నిష్పత్తిలో ఉపాధ్యాయులు లేరు. అదనంగా టీచర్లను సమకూర్చాలని లేఖలు పెట్టారు. స్థానికంగానే ఉన్న బ్రహ్మానందరెడ్డి తదితర స్కూళ్లల్లోనూ ఈ సమస్య ఉంది.
* వట్టిచెరుకూరు మండలం ముట్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో టీచర్ల సమస్య నెలకొంది.
* కొల్లిపర మండలం తూములూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 2020 నుంచి ఒకే ఒక్క టీచర్ బయాలజీ బోధిస్తున్నారు. ఇద్దరికి ఒక్కరే ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన మాజీ మంత్రి డొక్కా
[ 26-04-2024]
వైకాపాకు రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ తెదేపాలో చేరారు. తన అనుచరులతో కలిసి అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపా కండువా కప్పుకొన్నారు. -
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!