ఓడిన వైకల్యం.. నెరవేరిన కల
మాచర్లలోని ఓల్డ్ కోర్టు రహదారిలో ఇరుకు సందు.. అందులో ఓ చిన్న రేకుల ఇంట్లో అద్దెకు ఉండే ఓ పేద విద్యార్థి.. పోలియో కారణంగా అంగవైకల్యంతో అందరి పిల్లల్లా పరుగులు పెట్టలేని పరిస్థితి..
గుంటూరు వైద్యం, న్యూస్టుడే
మాచర్లలోని ఓల్డ్ కోర్టు రహదారిలో ఇరుకు సందు.. అందులో ఓ చిన్న రేకుల ఇంట్లో అద్దెకు ఉండే ఓ పేద విద్యార్థి.. పోలియో కారణంగా అంగవైకల్యంతో అందరి పిల్లల్లా పరుగులు పెట్టలేని పరిస్థితి.. రెండేళ్ల వయసులోనే తండ్రి మరణం.. తల్లి దినసరి కూలీగా పని చేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి.. ఆ కష్టాలన్నీ అతడి సంకల్పం ముందు చిన్నబోయాయి.. కష్టాలను విజయానికి మెట్లుగా మార్చుకుని ప్రతిష్ఠాత్మకమైన గుంటూరు వైద్య కళాశాలలో మొదటి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సీటు సాధించాడు.. ఎందరికో స్ఫూర్తిగొలిపే విజయం సాధించిన ఆ విద్యార్థి షేక్ హమీద్. అతన్ని ‘న్యూస్టుడే’ పలుకరించగా తాను సాధించిన విజయం గురించి వివరించారు. ఆ విశేషాలు హమీద్ మాటల్లోనే..
చిన్నప్పుడే నాన్న మౌలాలీ చనిపోయారు. అమ్మ హుస్సేన్బీ దినసరి కూలీగా పని చేస్తూ వచ్చే ఆదాయమే మా ఇంటికి ఆధారం. పోలియో కారణంగా పుట్టుకతోనే నాకు వైకల్యం సోకింది. మాచర్లలోనే 1-5వ తరగతి వరకు విద్య ప్రాథమిక పాఠశాలలో, 6 నుంచి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు మాధ్యమంలోనే చదివా. 10వ తరగతి చదువుతున్న సమయంలో ఎంబీబీఎస్ చదవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నా. కానీ కళ్ల ముందు కుటుంబ కష్టాలు కనిపించాయి. త్వరగా కుటుంబానికి సాయపడాలనుకుని పాలిటెక్నిక్లో డిప్లొమా కోర్సులో చేరా. నా లక్ష్యం ఇది కాదని తెలిసింది. అక్కడ ఉండలేకపోయా. నాకు మాదిరిగానే వైకల్యంతో బాధపడుతున్నవారికి సేవ చేయాలంటే వైద్య వృత్తి సరైనదిగా భావించా. దీంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ గ్రూపు ఆంగ్ల మాధ్యమంలో చేరా. 900 మార్కులతో ఉత్తీర్ణత సాధించా. నీట్ శిక్షణకు చేతిలో పైసా లేదు. దీంతో చరవాణి సాయంతో అంతర్జాలంలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి పరీక్షకు సిద్ధమయ్యా. తొలి ప్రయత్నంలోనే గుంటూరు వైద్య కళాశాలలో సీటు సాధించడం ఎంతో ఆనందంగా ఉంది.
పెద్ద చదువు ఎందుకన్నారు
జూనియర్ కళాశాలలో చేరే సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు కొంతమంది ‘ఎంబీబీఎస్’ అంటే పెద్ద చదువులే.. కష్టం అన్నారు. అయినా వెనకడుగు వేయలేదు. ఓ సారి ప్రయత్నిద్దామనుకున్నా. ఇంట్లో అమ్మ, అక్క అడ్డు చెప్పలేదు. మొదటి ప్రయత్నంలోనే నీట్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తాననే నమ్మకం ఉంది. కానీ ఇలా గుంటూరు వైద్య కళాశాలలో సీటు వస్తుందనుకోలేదు. ఇష్టంగా చదివాను కాబట్టే గెలిచాను.
అమ్మ కష్టమే చదువుపై ప్రేమ పెంచింది
పేదరికాన్ని మా చదువుకు ఎన్నడూ అడ్డు కానివ్వలేదు మా అమ్మ హుస్సేన్బీ. చిన్నప్పటి నుంచి నేను, మా అక్క హజియా బాగా చదువుతుండటం చూసి వారికి అర్థిక ఇబ్బందులను అడ్డు కాకుండా కూలి పని చేస్తూ కష్టపడుతూ చదివించింది. అక్క నరసరావుపేట జేఎన్టీయూలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. అమ్మ కష్టమే నన్ను ఇలా చదివేలా చేసింది. అదే ఇప్పటి నా విజయవానికి కారణం.
ప్రభుత్వ సాయం
‘వైద్య కళాశాలలో చేరాలంటే ఫీజు చెల్లించలేని పరిస్థితి. వసతి గృహంలో ప్రవేశానికి, మెస్ ఛార్జీలు చెల్లింపునకూ ఆర్థిక కష్టాలే. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ పద్మావతిదేవి ద్వారా తెలుసుకున్న జిల్లా పాలనాధికారి వేణుగోపాల్రెడ్డి వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం చేసేలా చూశారు. ఎంబీబీఎస్ కోర్సు పూర్తయ్యే వరకూ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించనుంది. ఇక చదువు మీదే ధ్యాసంతా. ఎంబీబీఎస్ పూర్తి చేయాలన్నదే నా లక్ష్యం. పోలియోతో ఇలా అయ్యిందేమిటి? ఈ జీవితం అంతే? అనుకుంటే చేసేదేం లేదని అర్థం చేసుకున్నాను. అది నా సంకల్పాన్ని ఏమీ చేయలేకపోయింది. ఎన్నో అవరోధాలు ఉన్నాయని అనుకోకూడదు. నిత్యం చేదు జ్ఞాపకాల చిరునామాగా సాగకూడదనుకున్నా. లక్ష్యం నిర్దేశించుకుని కష్టపడి చదివితే విజయం మన సొంతమవుతుంది’.. అని నమ్ముతా అంటాడు హమీద్.
హమీద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
స్వతంత్ర అభ్యర్థిని.. కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.