బెంగళూరుకు మార్గం సుగమం
బెంగళూరు నుంచి విజయవాడకు ఆరు వరుసల రహదారి నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇది బాపట్ల జిల్లా అద్దంకి మీదుగా వెళుతుండటంతో ఇక్కడ విశ్రాంత ప్రాంతం నిర్మాణంతోపాటు ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ప్రవేశమార్గం సైతం ఏర్పాటు చేయనున్నారు.
టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టిన ఎన్హెచ్ఏఐ అధికారులు
కడప మీదుగా విజయవాడ వరకు ఆరు వరుసల రహదారి
ఈనాడు-నరసరావుపేట
జాతీయ రహదారిలో కూడలి ఏర్పాటు చేసే ప్రాంతం
బెంగళూరు నుంచి విజయవాడకు ఆరు వరుసల రహదారి నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇది బాపట్ల జిల్లా అద్దంకి మీదుగా వెళుతుండటంతో ఇక్కడ విశ్రాంత ప్రాంతం నిర్మాణంతోపాటు ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ప్రవేశమార్గం సైతం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమైన భూసేకరణ కోసం భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) ప్రకటన ఇచ్చింది. గతేడాది సర్వే పనులు మొదలై కొలిక్కి రావడంతో ఇటీవల టెండర్లు పిలిచారు. గుత్తేదారులతో ఒప్పందాలు పూర్తయిన తర్వాత మూడేళ్ల కాలంలో నిర్మాణం పూర్తిచేయాలన్నది లక్ష్యం. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.16వేల కోట్ల సొమ్ము వెచ్చించనుంది. ఈమార్గం పూర్తయితే విజయవాడ నుంచి బెంగళూరుకు 8 గంటల సమయంలో చేరుకోవచ్చు. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంతో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు అనుసంధాన రహదారి అభివృద్ధి చేయడం వల్ల ప్రగతికి బాటలు పడనున్నాయి. మొత్తం 342.5 కిలోమీటర్ల దూరం రహదారి నిర్మించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోని జాతీయ రహదారి 44కు చిలమత్తూరు మండలం కోడూరు వద్ద అనుసంధానం చేస్తారు. చెన్నై-కోల్కతా జాతీయ రహదారి 16కు ముప్పవరం వద్ద కలుపుతారు. దీంతో విజయవాడ నుంచి బెంగళూరు వరకు మొత్తం జాతీయ రహదారిలోనే ప్రయాణించవచ్చు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 342.5కిలోమీటర్ల దూరం మార్గాన్ని నిర్మించనున్నారు. అటవీప్రాంతంలో పర్యావరణానికి విఘాతం కలగకుండా 7.7 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మిస్తారు.
118.76 హెక్టార్ల భూసేకరణ
బెంగళూరు-కడప-విజయవాడ ఎకనమిక్ కారిడార్ నిర్మాణానికి బాపట్ల జిల్లాలో 118.76 హెక్టార్ల భూసేకరణ చేస్తున్నారు. ఈమార్గం బాపట్ల జిల్లాలో 325 కిలోమీటరు నుంచి 342.5 కిలోమీటరు వరకు ప్రయాణిస్తుంది. ఈక్రమంలో అద్దంకి వద్ద విశ్రాంతి ప్రాంతం, ముప్పవరం వద్ద జాతీయ రహదారిలోకి ప్రవేశమార్గం నిర్మాణం, టన్నెల్ ఏర్పాటుకు భూమి సేకరిస్తున్నారు. అద్దంకి మండలంలోని అద్దంకి, కొటికలపూడి, జె.పంగులూరు మండలంలోని ముప్పవరం, కొండమూరు గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. ఎకనమిక్ కారిడార్ స్థానికులకు ఇబ్బంది లేకుండా 2మీటర్ల మేర ఎత్తులో నిర్మిస్తారు. గ్రామాల గుండా వెళ్లే మార్గం 5 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గ్రామాల్లో రోడ్డును దాటడానికి అండర్పాస్లు నిర్మిస్తారు. ఈ మార్గంలోకి ఎక్కడికక్కడ ప్రవేశం లేకుండా అవసరాలకు అనుగుణంగా 15 నుంచి 20 కిలోమీటర్ల వ్యవధిలో ఒక ప్రవేశకూడలి(ఇంటర్ జంక్షన్) ఏర్పాటుచేస్తారు. ఈప్రాంతంలోనే రోడ్డులోకి ప్రవేశం ఉంటుంది. ఇది ఎకనమిక్ కారిడార్ కావడంతో స్థానికులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లతోపాటు వేగంగా వెళ్లే వాహనాలకు అడ్డంకులు లేకుండా నిర్మిస్తారు.
సమయం.. ఇంధనం ఆదా
విజయవాడ-కడప-బెంగళూరు నడుమ ఆరు వరుసల రహదారిని నిర్మిస్తారు. రోడ్డు 70 మీటర్ల వెడల్పుతో అత్యంత ఆధునికంగా నిర్మాణం చేపడతారు. బాపట్ల జిల్లాలో 17.5 కిలోమీటర్ల మేర నూతన రహదారి నిర్మించనున్నారు. ఈప్రాంతంలో అభివృద్ధికి అవకాశాలు మెరుగువుతాయి. స్థానికంగా పండే ఉద్యాన, వ్యవసాయ, వాణిజ్య పంటలను సులభంగా అటు బెంగళూరు, ఇటు విజయవాడకు రవాణా చేయవచ్చు. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరుకు 15 నుంచి 16 గంటల సమయం పడుతోంది. ఈమార్గం అందుబాటులోకి వస్తే 8 గంటల్లోనే ప్రయాణం పూర్తవుతుంది. దీనివల్ల సమయం, ఇంధనం ఆదా అవుతుంది. వాహనాల మన్నిక కూడా పెరుగుతుంది. ప్రయాణ సమయం తగ్గడం వల్ల మార్టూరు తదితర ప్రాంతాల్లో విస్తారంగా పండే కూరగాయలను బెంగళూరుకు రవాణా సులభమవుతుంది. దీంతోపాటు వాణిజ్య, ఉద్యాన పంటలకు సంబంధించిన శుద్ధి యూనిట్లను ఈప్రాంతంలో ఏర్పాటుచేసుకుని అంతిమ ఉత్పత్తులు తయారుచేసే ప్లాంట్లు విస్తారంగా ఏర్పాటయ్యే వెసులుబాటు కలుగుతుంది. ఆహారశుద్ధి పరిశ్రమలు వస్తే పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కాల్చి పడేస్తా.. ఎవడొస్తాడో రమ్మను’.. సస్పెండైన ఓ ఎస్సై వీరంగం
[ 30-04-2024]
కాల్చి పడేస్తా ఎవరు వస్తారో రమ్మనురా అంటూ సస్పెండైన ఎస్సై వీరంగం సృష్టించిన ఘటన సోమవారం వెలుగు చూసింది. భార్య భర్తల కేసు న్యాయస్థానంలో ఉండగా సస్పెన్స్లో ఉన్న ఓ ఎస్సై.. -
ఎండలో మాడ్చొద్దు.. ఉసురు తీయొద్దు
[ 30-04-2024]
సామాజిక పింఛన్ల మొత్తాన్ని బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయం వారిని మరింత ఇబ్బంది పెట్టేలా ఉంది. -
ఓట్ల వేటలో జగన్నాటకమే
[ 30-04-2024]
పండుటాకులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మొన్న పింఛన్ల కోసం సచివాలయాల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురిచేసింది. అది సరిపోలేదని ఈసారి ఏకంగా కిలోమీటర్ల దూరం వెళ్లి బ్యాంకుల నుంచి పింఛను తెచ్చుకునేలా చేస్తోంది. -
మత్తులో ముంచారు.. మొత్తంగా దోచారు!
[ 30-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాల వద్ద సిబ్బందిగా ఉపాధ్యాయులను నియమించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని కొత్తకొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం బ్రాండ్లను పూర్తిగా ఆపేశారు. -
అయిదేళ్ల వేదన.. అరణ్య రోదన
[ 30-04-2024]
సీఎం జగన్ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారు. మాట ఇవ్వడం.. మడమ తిప్పడం అనే పదానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఈ అయిదేళ్లలో ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. -
పొన్నూరు అభివృద్ధిపై నోరువిప్పని జగన్
[ 30-04-2024]
పట్టణంలోని రేపల్లె బస్టాండ్ వద్ద నిర్వహించిన సభలో సీఎం జగన్ పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై స్పందించకపోవడంపై ప్రజలు నిరాశ చెందారు. -
పోరు.. ఖరారు!
[ 30-04-2024]
గుంటూరు పార్లమెంటు స్థానానికి 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఇక్కడ పోటీకి ఆసక్తి చూపడం గమనార్హం. -
పోరులో నిలిచింది 122 మంది
[ 30-04-2024]
నామినేషన్ల తుది ఘట్టం ముగిసింది. ఉపసంహరణల అనంతరం ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు మొత్తం 122 మంది బరిలో నిలిచారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల నుంచి ఒక్కరు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. -
వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యం
[ 30-04-2024]
వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా పని చేస్తానని పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -
జిల్లాలో 12,91,716 ఓటర్లు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు తుది ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్బాషా సోమవారం ప్రకటించారు. జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 12,91,716 మంది ఓటర్లు ఉన్నారు. -
ఎన్నికల బరిలో 104 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో బాపట్ల లోక్సభ నియోజకవర్గం, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 104 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలు తుది గడువుగా ఉంది. -
రెండ్రోజులకోసారి డ్రమ్ము నీరు సరిపోతుందా?
[ 30-04-2024]
రేపల్లె శివారు ప్రాంతమైన 28వ వార్డు ప్రజలకు తాగునీరు అందడం లేదని ఆరోపిస్తూ వారు ప్రధాన రహదారిపై సోమవారం ఆందోళనకు దిగారు. ట్యాంకరుతో రెండ్రోజులకోసారి సరఫరా చేస్తున్న నీరు అందరికీ సరిపోవడంలేదని మండిపడ్డారు. -
లోకేశ్తో చిరువ్యాపారులకు మంచి రోజులు
[ 30-04-2024]
నారా లోకేశ్ ఎమ్మెల్యే అయితే మంగళగిరిలో చిరు వ్యాపారులకు మంచి రోజులొస్తాయని, సైకిల్ గుర్తుపై ఓటేసి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. -
వసూళ్లలో ఎగుమతి, దిగుమతి సంఘాల నేతలు
[ 30-04-2024]
వ్యాపారుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన మిర్చి ఎగుమతి, దిగుమతి సంఘాల నాయకులు అధికార పార్టీ నేతల సేవలో మునిగి తేలుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన