logo

వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యం

వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా పని చేస్తానని  పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.

Published : 30 Apr 2024 06:27 IST

తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు

మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు, పక్కన ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ ఆంజనేయులు

బొల్లాపల్లి, న్యూస్‌టుడే : వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా పని చేస్తానని  పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. సోమవారం అయన ఎన్నికల ప్రచారంలో భాగంగా బొల్లాపల్లి మండలంలోని గండిగనుమల, దోమలగుండం, అయ్యన్నపాలెం, గుమ్మనంపాడులో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడి ప్రజల తాగు, సాగు నీటి కష్టాలు తీర్చేందుకు ఐదేళ్లుగా కృషి చేస్తూనే ఉన్నానని, ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ, వన్యప్రాణి శాఖ అనుమతులు సాధించినట్లు తెలిపారు. 6 నెలలుగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయక గుత్తేదారులు పనులు చేయడానికి ముందుకు రాలేదని తెలిపారు. అయ్యన్నపాలెం చెరువుకు కృష్ణా జలాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందుకే సుగాలీ ప్రజల మధ్యన తన పుట్టినరోజు వేడుక చేసుకుంటున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన నేత నిశ్శంకర శ్రీనివాసరావు, నేతలు గోవిందునాయక్‌, వాసుదేవరెడ్డి, కోటానాయక్‌, హనుమానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని