వసూళ్లలో ఎగుమతి, దిగుమతి సంఘాల నేతలు
వ్యాపారుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన మిర్చి ఎగుమతి, దిగుమతి సంఘాల నాయకులు అధికార పార్టీ నేతల సేవలో మునిగి తేలుతున్నారు.
బెంబేలెత్తుతున్న మిర్చి వ్యాపారులు
మిర్చియార్డు(గుంటూరు), న్యూస్టుడే: వ్యాపారుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన మిర్చి ఎగుమతి, దిగుమతి సంఘాల నాయకులు అధికార పార్టీ నేతల సేవలో మునిగి తేలుతున్నారు. దివాళా తీసిన వారి నుంచి వసూళ్లు చేసి వ్యాపారులకు రావాల్సిన సొమ్ము ఇప్పించడం చేతగాని సంఘాల నాయకులు ఎన్నికల సందర్భంగా కోట్లాది రూపాయలు వసూళ్లు చేస్తున్నారు. ఓ శీతలగిడ్డంగిలో దిగుమతి సంఘ నాయకుల సమావేశం సోమవారం జరిగింది. ఓ మిర్చి వ్యాపారికి చెందిన సంస్థ నుంచి రావాల్సిన పద్దులు, వడ్డీల గురించి చర్చిద్దామని దిగుమతి సంఘం నేతల నుంచి వ్యాపారులకు కబురు అందింది. ఆమేరకు సదరు సంఘం పేరుపై కార్యదర్శి సంతకంతో ఆహ్వానం పంపారు. దీని ముసుగులో చందాలు వసూళ్లు చేస్తున్నారని తెలుసుకున్న అధిక శాతం మంది వ్యాపారులు ముఖం చాటేశారు. ఈ సమావేశానికి స్పందన అంతంతమాత్రంగా ఉండటంతో మంగళవారం మిర్చియార్డు సమీపంలోని ఓ కల్యాణ మండపంలో వైకాపా ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి అల్పాహార విందు ఉంటుందని కబురు పంపారు. మిర్చి వ్యాపారులు అందరికీ ఫోన్లు చేసి ఈ సమావేశానికి రావాలని ఆహ్వానించారు.
పార్టీలతో సంబంధం ఏమిటని ప్రశ్నించడంతో..
ఇందులో తెదేపా, జనసేన, భాజపా అనుకూల వ్యాపారులు సదరు మిర్చి దిగుమతి సంఘం నాయకుల్ని నిలదీశారు. రాజకీయ పార్టీలతో సంబంధం ఏమిటని ప్రశ్నించడంతో నేతలు ఖంగుతిన్నారు. ఇచ్చే చందాలేవో అన్ని పార్టీల అభ్యర్థులకు సమానంగా ఇద్దామని చెప్పడంతో సదరు సంఘ నేత మారు మాట్లడకుండా మిన్నకుండిపోయారు. మిర్చి ఎగుమతి సంఘాల నాయకులు మాత్రం ఇప్పటికే కోట్లాది రూపాయలు వసూళ్లు చేసినట్లు సమాచారం. చందాలు ఇవ్వని మిర్చి ఎగుమతి వ్యాపారుల్ని జీరో, కటింగ్ వ్యాపారం ఏవిధంగా చేస్తారో బెదిరింపులకు దిగుతున్నారు. దిగుమతి వ్యాపారుల నుంచి అంతగా స్పందన లేకపోవడంతో అల్పాహార విందు పేరుతో వసూళ్లకు దిగుతున్నారు. లైసెన్స్లు లేకుండా వ్యాపారం చేసే వారిని ఎంతో కొంత ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మా అండ లేకపోతే బిల్లు టు బిల్లు వ్యాపారం ఏవిధంగా చేస్తారో చూస్తామని బెదిరిస్తున్నారు. ఈ వ్యవహారానికి ప్రత్యేకంగా మూడు సంఘాల్లోని కొందరు నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు. తాము కష్టపడ్డ సొమ్ము వారికి ఎందుకు ఇవ్వాలని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. సంఘాల నేతల నుంచి ఫోన్ వస్తే భయపడాల్సి వస్తోందని మరికొందరు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలువ ఈ తీరు.. పారేది కన్నీరు
[ 21-05-2024]
మిగ్జాం తుపానుతో గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా పంట కాల్వల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో లక్షల ఎకరాల్లో చేతికి అంది వచ్చిన పంట నీటిపాలైంది. -
ముందే గుంతలు.. కళ్లకు గంతలు..
[ 21-05-2024]
గుంటూరు నగరంలోని ప్రధాన రహదారులు కనీస మరమ్మతులు లేక గుంతలమయంగా మారాయి. నగరపాలక సంస్థ ఎదురుగా ఈ పరిస్థితి ఉన్నా అధికారులకు కనిపించడం లేదు. -
బాధ చూడరు.. బాగు చేయరు..
[ 21-05-2024]
జీజీహెచ్ అత్యవసర కేంద్రం నుంచి ఇలా రోగులను స్ట్రెచర్ మీద తీసుకెళ్తున్నది సీటీ స్కాన్ కేంద్రానికి. -
వైకాపా నాయకులకు గుణపాఠం చెప్పాలి
[ 21-05-2024]
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ ఘటనలో మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి ప్రమేయంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని రాజధాని రైతులు డిమాండ్ చేశారు. -
ఇసుక తవ్వకాలు జరగకుండా 24 గంటలూ పర్యవేక్షణ
[ 21-05-2024]
నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరగకుండా 24 గంటలూ పర్యవేక్షించేలా బృందాలను ఏర్పాటు చేయాలని, నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి ఆదేశించారు. -
న్యాక్ గ్రేడ్కు నిరీక్షణ!
[ 21-05-2024]
వర్సిటీలో బోధన, పరిశోధన ఎలా జరుగుతుందో పరిశీలించి ఐదేళ్లకు ఒకసారి న్యాక్ సంస్థ విశ్వవిద్యాలయాలకు గ్రేడ్ కేటాయిస్తుంది. -
గుంటూరు పశ్చిమ పోస్టల్ బ్యాలట్ల గది మార్పు
[ 21-05-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ల గదిని అధికారులు ఎట్టకేలకు మార్చారు. ఈ నెల 19వ తేదీన ‘ఈనాడు’ లో ‘పోస్టల్ బ్యాలట్లకు భద్రత ఏది’... శీర్షికన ప్రచురితమైన కథనానికి ఎన్నికల అధికారుల్లో కదలిక వచ్చింది. -
జాతీయ సేవకుల కోసం
[ 21-05-2024]
జాతీయ స్థాయిలో సామాన్యులకు సేవలందించే ఆవకాశం సివిల్ సర్వీసెస్ ద్వారా కలుగుతుంది. ఈ నేపథ్యంలో తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్ వైపు ఆసక్తి చూపేందుకు అవసరమైన కృషి చేస్తున్నాయి గుంటూరులోని స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్(సన్), కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. -
తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుల దాడి
[ 21-05-2024]
పార్టీ మారాడనే కోపంతో తెదేపా కార్యకర్తపై క్రికెట్ బ్యాట్తో వైకాపా వర్గీయులు దాడి చేశారు. శావల్యాపురం మండలం కిష్ణాపురంలో సోమవారం రాత్రి ఇది జరిగింది. -
బాధితులు తెదేపా వారని.. ఇంత పక్షపాతమా?
[ 21-05-2024]
జిల్లాలోనూ సార్వత్రిక పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల్లోనే తెదేపా ఏజెంట్లను చితకబాదిన ఉదంతాలు ఆలస్యంగా వెలుగుజూస్తున్నాయి. పోలింగ్ కేంద్రంలో ఏ కొద్దిపాటి గొడవ జరిగినా అక్కడ ఉండే పీవో తన డైరీలో నమోదు చేయాలి. -
ఆ దారి.. మృత్యు వారధి
[ 21-05-2024]
కనిపించని సూచిక బోర్డులు.. ప్రమాదకర మలుపులు.. చోదకుల మితిమీరిన వేగం.. వాహనదారుల నిర్లక్ష్యం.. రోడ్డుపై నిలుపుతున్న వాహనాలు.. కారణం ఏదైనా.. వాడరేవు-పిడుగురాళ్ల జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలు నిండు ప్రాణాలను హరిస్తున్నాయి. -
గ్రానైట్ ముడిరాయి లారీల పట్టివేత
[ 21-05-2024]
గుంటూరు విజిలెన్స్ సీఐ శ్రీహరి తన బృందంతో సోమవారం బల్లికురవ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. -
గుండ్లకమ్మ చుట్టూ ఇసుక దొంగలే
[ 21-05-2024]
ఇసుక దొంగలకు దోచిపెట్టేందుకే గుండ్లకమ్మ నది అన్నట్లు పరిస్థితి ఉందని, అనుమతి లేని తవ్వకాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్ సీహెచ్.శ్రీధర్ అన్నారు. -
కొంతమంది పోలీసుల తీరుతోనే.. హింసాకాండ
[ 21-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈనెల 13వ తేదీ, తర్వాత రోజు పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ దర్యాప్తు బృందం విచారణ చేసింది. -
దేవుడి భూమి.. సమర్పయామి
[ 21-05-2024]
దేవుడికి సేవ చేయాల్సిన అర్చకులు ఆలయ భూమినే అమ్మేశారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని అమ్మేసి నిత్య కైంకర్యాలు నిలిపేశారు. వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దక్షిణాది ముగిసింది.. ఉత్తరాది రమ్మంది
-
ప్రజ్వల్.. లొంగిపో : కుమారస్వామి హితవు
-
బోనస్ విషయంలో ప్రభుత్వం బోగస్ విధానాన్ని బయట పెట్టింది: కేటీఆర్
-
అన్నవరం రైల్వే స్టేషన్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు
-
దోషులను తప్పించి... అమాయకులను ఇరికించి..!
-
తెదేపా ముసుగులో విద్వేష ప్రసంగాలు చేస్తున్న కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి