మళ్లీ ఇదేం బాదుడు
ఏప్రిల్ నెలలో వాడుకున్న విద్యుత్తుకు మే నెలలో బిల్లు ఇస్తున్నారు. ఇందులో ప్రతిఒక్కరికి ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో అదనంగా బిల్లు రావడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.
ఇంధన సర్దుబాటు పేరిట విద్యుత్తు ఛార్జీల పెంపు
పెరిగిన భారంతో సామాన్యులు విలవిల
పర్చూరు పట్టణంలో నివసించే ఒక కుటుంబానికి మే నెల బిల్లు రూ.255 వచ్చింది. ఇందులో ట్రూఅప్ ఛార్జీలు రూ.28.17 కాగా ఈ నెలలో అదనంగా విధించిన ఇంధన కొనుగోలు ఛార్జీలు రూ.24.12 భారం పడింది. ఈ లెక్కన ఇంధన సర్దుబాటు ఛార్జీల రూపంలో రూ.52 భారం పడింది. రూ.255 బిల్లులో రూ.52 ట్రూఅప్ భారం పడటం గమనార్హం.
ఈనాడు-నరసరావుపేట, బాపట్ల : ఏప్రిల్ నెలలో వాడుకున్న విద్యుత్తుకు మే నెలలో బిల్లు ఇస్తున్నారు. ఇందులో ప్రతిఒక్కరికి ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో అదనంగా బిల్లు రావడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలు పెంచామని చెప్పకపోయినా బిల్లు పెరగడంపై సంబంధిత శాఖ అధికారులను ఆరా తీస్తున్నారు. గతంలో డిస్కంలకు వచ్చిన నష్టాలను ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో వేయడం వల్ల బిల్లు పెరిగిందని, ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం కొనసాగుతుందని చెప్పడంతో ఇదేమి దోపిడీ అంటూ వాపోతున్నారు. ఇప్పటికే ట్రూఅప్ ఛార్జీల పేరుతో గతేడాది ఆగస్టు నుంచి బిల్లులు పెరగ్గా మళ్లీ ఇప్పుడు బాదుడు ఏంటని సామాన్యులు విలవిలలాడి పోతున్నారు. మార్కెట్లో నిత్యావసరాల నుంచి గ్యాస్ వరకు అన్ని ధరలు పెరిగి కుటుంబపోషణ భారంగా మారిన నేపథ్యంలో విద్యుత్తు బిల్లు పెరగడంతో అల్లాడిపోతున్నారు.
కొనసాగుతున్న వడ్డన
విద్యుత్తు సంస్థలకు 2014 నుంచి 2019 వరకు వచ్చిన నష్టాలను భర్తీ చేసుకోవడానికి గతేడాది ఆగస్టు నుంచి యూనిట్కు 22 పైసల చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ఇది 36 నెలలపాటు కొనసాగుతుందని ప్రకటించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాపై మొత్తం రూ.425.92 కోట్ల సొమ్ము భారం పడింది. ఇది కొనసాగుతుండగానే మళ్లీ ఇప్పుడు ఇంధన కొనుగోలు సర్దుబాటు పేరుతో అదనపు భారం వేయడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నష్టాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు అదనంగా భారం వేయనున్నారు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వినియోగదారులపై రూ. కోట్లలో అదనపు భారం పడనుంది. సీఆర్డీఏ పరిధిలో ఎల్టీ విభాగం 368296 కనెక్షన్లు, హెచ్టీ కనెక్షన్లు 546 ఉన్నాయి. గుంటూరు సర్కిల్ పరిధిలో 1389779 ఎల్టీ కనెక్షన్లు, హెచ్టీ కనెక్షన్లు 1249 ఉన్నాయి. వీరందరిపై ఇంధన కొనుగోలు సర్దుబాటు ఛార్జీలు పడ్డాయి. గతేడాది ఏప్రిల్లో వినియోగించుకున్న విద్యుత్తుకు ప్రస్తుత ఏప్రిల్ నెలలో ఇచ్చే బిల్లులో సర్దుబాటు చేశారు. దీంతో మే నెల బిల్లులో మొత్తం పెరిగింది. ఏ నెలకు ఆ నెల వచ్చే మార్చి నెల వరకు వసూలు చేస్తారు. ఏప్రిల్ నెలలో యూనిట్కు 20 పైసలుతో మొదలై గరిష్ఠంగా 66 పైసల వరకు భారం పడుతుంది.
అద్దె ఇంట్లో అదనపు పోటు
2014 నుంచి 2019 వరకు వాడిన విద్యుత్తు వినియోగాన్ని లెక్కించి ఇప్పుడు సంబంధిత వినియోగదారునికి సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీనివల్ల అప్పట్లో అద్దెకు ఉన్నవారు వాడిన యూనిట్ల ఆధారంగా ప్రస్తుతం నివాసం ఉన్నవారికి బాదుడు భారం భరిస్తున్నారు. తాజాగా 2021-22 సంవత్సరంలో వాడుకున్న విద్యుత్తుకు ఇప్పుడు ఇంధన సర్దుబాటు కొనుగోలు ఛార్జీలు ప్రస్తుత ఏప్రిల్ నెల నుంచి వసూలు చేస్తున్నారు. దీంతో గతంలో ఆ ఇంట్లో అద్దెకు ఉన్నవారు ఎక్కువ విద్యుత్తు వాడుకున్నట్లయితే ఇప్పుడున్నవారు తక్కువ వాడుకున్నా భారం మోయక తప్పదు. గతంలో వాడుకున్నవారికి ఇప్పుడు తాము సర్దుబాటు ఛార్జీలు చెల్లించడం దారుణమని అద్దెదారులు వాపోతున్నారు. ఈ విషయాన్ని కొందరు యజమానుల దృష్టికి అద్దెదారులు తీసుకెళ్లగా తామేమి చేయలేమని ఎప్పుటి నుంచో అద్దెకు ఇస్తున్నందున ఎవరుంటే వారే చెల్లించాలని స్పష్టం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన మాజీ మంత్రి డొక్కా
[ 26-04-2024]
వైకాపాకు రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ తెదేపాలో చేరారు. తన అనుచరులతో కలిసి అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపా కండువా కప్పుకొన్నారు. -
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా