ఉల్లంగనులపై నిఘా
ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. అయితే అందుకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు జిల్లా కేంద్రాల్లో కొలువుదీరలేదు.
నరసరావుపేటలో జిల్లా కార్యాలయం ఏర్పాటు
న్యూస్టుడే, నరసరావుపేట టౌన్
గనులు, భూగర్భ శాఖ జిల్లా కార్యాలయం
ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. అయితే అందుకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు జిల్లా కేంద్రాల్లో కొలువుదీరలేదు. ఏడాది గడిచినా పూర్తిస్థాయిలో యంత్రాంగం రూపుదిద్దుకోలేదు. పల్నాడు జిల్లా ఆవిర్భావంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ జిల్లా కేంద్రానికి తరలించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇప్పటికి కొన్ని శాఖలు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోనే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూర్చే గనులు, భూగర్భ శాఖ కార్యాలయం ఏడాది తర్వాత జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు.
కొత్త జిల్లా ఏర్పాటుకు ముందు దాచేపల్లిలో మాత్రమే ఏజీ కార్యాలయం ఉండేది. దాని పరిధిలోని ఎనిమిది మండలాలతో పాటు గుంటూరు పరిధిలో కొనసాగుతున్న పది మండలాలను ఇప్పుడు వేరు చేశారు. వీటన్నింటినీ కలిపి నరసరావుపేట కార్యాలయం పరిధిలోకి తీసుకొచ్చారు. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో కార్యకలాపాలు నరసరావుపేట కార్యాలయం నుంచి పర్యవేక్షించనున్నారు. గురజాల, మాచర్ల నియోజకవర్గాల పరిధిలో మాత్రం దాచేపల్లి కార్యాలయం సేవలందించనుంది. ఈ రెండు కార్యాలయాలకు కలిపి జిల్లా అధికారి (డీఎంజీవో) నరసరావుపేటలో ఉంటారు. స్థానిక ఎన్జీవో కాలనీ మూడో లైన్లోని అద్దె భవనంలో జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరు, దాచేపల్లి కార్యాలయాల నుంచి సంబంధిత దస్త్రాలను తీసుకొస్తున్నారు. దీంతో పాటు సిబ్బందిని కూడా వివిధ ప్రాంతాల నుంచి సర్దుబాటు చేస్తున్నారు. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు కొంత సమయం పడుతుందని సిబ్బంది తెలిపారు.
అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట
కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇసుక రీచ్లున్నాయి. అమరావతి, వైకుంఠపురం, కోనూరు, అంబడిపూడి, పొందుగల పరిధిలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. వీటిలో పలు అవతవకలు చోటుచేసుకుంటున్నాయి. పర్యావరణ అనుమతులు ముగియడం, కేటాయించిన ప్రదేశం వదిలేసి ఇతర చోట్ల ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని స్పందనలో జిల్లా పాలనాధికారికి పలు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై విచారించి అక్రమాల నిగ్గుతేల్చడం కష్టమవుతోంది. గతంలో ఓ సారి జిల్లా పాలనాధికారి శివశంకర్ కూడా స్వయంగా కృష్ణా నది రీచ్లకు వెళ్లి పరిశీలించారు. గత ఏడాది కాలంలో సంబంధిత శాఖ అధికారుల కార్యకలాపాలు నామమాత్రంగానే ఉన్నాయి. నరసరావుపేట-చిలకలూరిపేట మధ్య ఓగేరు వాగులో ఇసుక తవ్వకాలు, చిలకలూరిపేట నియోజకవర్గంలో గ్రానైట్ తవ్వకాలు, కోటప్పకొండ, కొండవీడు, నకరికల్లు కొండల్లో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. బోయపాలెం, వంకాయలపాడు, బొప్పూడి, కోటప్పకొండలో స్టోన్క్రషర్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో సిమెంట్, సున్నం, ముగ్గురాళ్ల నిక్షేపాలున్నాయి. ప్రభుత్వానికి సీనరేజీ రూపంలో భారీఎత్తున ఆదాయం జిల్లా నుంచే సమకూరుతుంది. అయితే ఈ గనుల తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయి. గతంలో ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచి అధికారులు వచ్చే సమయానికి అక్రమార్కులు జారుకునే అవకాశముండేది. ఇప్పుడు అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది.
దస్త్రాలు తెప్పిస్తున్నాం
ఉన్నతాధికారుల ఆదేశంతో జిల్లా కార్యాలయాన్ని నరసరావుపేటలో ఏర్పాటు చేశాం. కర్నూలు జిల్లా నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చా. గతంలో విజిలెన్స్ విభాగంలో పని చేసినప్పుడు ఈ ప్రాంతంపై అవగాహన ఉంది. సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నాం. గుంటూరు, ఇబ్రహీంపట్నం కార్యాలయాల నుంచి ఇక్కడి గనులకు సంబంధించిన దస్త్రాలను తెప్పిస్తున్నాం. గనుల తవ్వకాల్లో నిబంధనలు అమలు చేస్తాం. ఫిర్యాదులు వస్తే విచారించి చర్య తీసుకుంటాం.
వాసికర్ల నాగిని, జిల్లా అధికారి, గనులు భూగర్భ శాఖ, పల్నాడు జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్