కరెంటు ఎప్పుడు వచ్చేనో...
మండుతున్న ఎండలు.. తీవ్ర ఉక్కపోతతో సతమతమవుతున్న తరుణంలో తరచూ విద్యుత్తు సరఫరాలో అంతరాయంతో ప్రజలు మరింత అల్లాడిపోతున్నారు. ఓవర్ లోడు సమస్యతో రాత్రులు ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజులు కాలిపోతున్నాయి.
ఓవర్ లోడు సమస్యతో సరఫరాకు తరచూ అంతరాయం
కొత్త ట్రాన్స్ఫార్మర్లు అమర్చని విద్యుత్తు అధికారులు
బాపట్ల, న్యూస్టుడే: మండుతున్న ఎండలు.. తీవ్ర ఉక్కపోతతో సతమతమవుతున్న తరుణంలో తరచూ విద్యుత్తు సరఫరాలో అంతరాయంతో ప్రజలు మరింత అల్లాడిపోతున్నారు. ఓవర్ లోడు సమస్యతో రాత్రులు ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజులు కాలిపోతున్నాయి. కరెంటు తీగలు తెగిపడి రాత్రులు గంటల తరబడి సరఫరా నిలిచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. లోడుకు తగ్గట్లుగా అదనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంలో విద్యుత్తు శాఖ విఫలమైంది. జిల్లా కేంద్రం బాపట్ల వాసులను కరెంటు కష్టాలు వీడటం లేదు. తీరప్రాంతంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 43 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదవుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రత సైతం 32 డిగ్రీలుగా ఉండటంతో రాత్రులు వాతావరణం చల్లబడటం లేదు. రాత్రి ఎనిమిది గంటలైనా వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి. దీంతో ఏసీల వినియోగం విపరీతంగా పెరిగింది. ఒక్కో ఇంట్లో రెండు, మూడు ఏసీలు వినియోగిస్తున్నారు. కరెంటు వినియోగం అనూహ్యంగా పెరిగిపోయింది. రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య ఓవర్లోడ్ సమస్య ఎదురవుతోంది. పీక్లోడ్ సమయంలో 6.5 మిలియన్ల యూనిట్ల విద్యుత్తు వినియోగం జరుగుతోంది.
అర్ధరాత్రి జాగారం
బాపట్ల పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి ప్రాంతం, విజయలక్ష్మీపురం, రైలుపేట రాజీవ్గాంధీ కాలనీ, శృంగారపురం, భీమావారిపాలెం, ఎస్ఎన్పీ అగ్రహారం, శ్రీనివాసనగర్ కాలనీలో రోజూ రాత్రి సమయంలో ఓవర్లోడ్ సమస్య కారణంగా కరెంటు సరఫరా నిలిచిపోతోంది. ట్రాన్స్ఫార్మర్ల వద్ద ప్యూజులు కాలిపోతున్నాయి. ఇన్సులేటర్లు సైతం దెబ్బతింటున్నాయి. సరఫరా పునరుద్ధరించటానికి 45 నిమిషాల నుంచి గంటన్నర సమయం పడుతోంది. దీంతో ప్రజలు అర్ధరాత్రి జాగారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఓవర్లోడు సమస్య ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కనీసం ఏడు నుంచి ఎనిమిది కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నెల నుంచి ఈ సమస్య ఉన్నా కొత్తవి రాలేదు. దీనికితోడు పుండు మీద కారం చల్లినట్లు రహదారుల విస్తరణ పనుల నిమిత్తం కరెంటు సరఫరా నిలిపివేస్తుండటంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. జిల్లా కేంద్రం బాపట్ల, పట్టణాల్లో విద్యుత్తు డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని, పీక్లోడ్ సమయంలో అధిక భారంతో ట్రాన్స్ఫార్మర్ల ఫ్యూజులు కాలిపోయి సరఫరా నిలిచిపోతున్నట్లు ఈఈ ఆంజనేయులు చెబుతున్నారు. సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మతులు చేసి సరఫరా పునరుద్ధరిస్తున్నట్లు వివరించారు.
చీరాలలో అనధికార కోతలు
చీరాల అర్బన్, న్యూస్టుడే: చీరాలలో అనధికారిక విద్యుత్తు కోతలపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటల కొద్ది విద్యుత్తు సరఫరా నిలిపేయడంతో ప్రజలు వాపోతున్నారు. ఈ సమయంలో క్షేత్రస్థాయి సిబ్బందికి ఫోను చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈదురుగాలులకు చీరాల పట్టణంలో పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు పడిపోవడంతో పాటు చెట్ల కొమ్మలు విరిగి తీగలపై పడ్డాయి. దీనివలన పట్టణంలోని వైకుంఠపురం, దండుబాట, విఠల్నగర్, కొత్తపేట, ప్రసాదునగరం, జాండ్రపేట తదిర ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో గంటల వ్యవధిలోనే కరెంటు ఇచ్చినా మరికొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల వరకు సమయం పట్టింది. చీరాల విద్యుత్తు డివిజన్ పరిధిలో చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు మండలాలున్నాయి. వీటిల్లో 1.65 లక్షల సర్వీసులు ఉన్నాయి. రోజుకి 11 లక్షల యూనిట్ల విద్యుత్తు వినియోగం ఉండగా ప్రస్తుతం ఎండలు పెరగడంతో మరో లక్ష యూనిట్లు డిమాండ్ అదనంగా కావాల్సి రావడం కూడా సమస్య ఏర్పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. వేటపాలెం, చినగంజాం మండలాల్లో ఆక్వా పరిశ్రమ ఉంది. ఇక్కడ కూడ విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఉండటంతో రైతులు జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. డీజిల్కు అదనంగా వ్యయం చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. దీనికితోడు తీరప్రాంతంలో విద్యుత్తు లైన్లు మూడు దశబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. మొత్తం వేయి కిలోమీటర్లకు గాను, ఇప్పటి వరకు 70 కిలోమీటర్ల మాత్రమే మార్పు చేశారు. పాత లైన్లు కావడంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీనిపై చీరాల విద్యుత్తు ఈఈ కె.సూర్యప్రకాష్ మాట్లాడుతూ పరివర్తకాల మార్పు, గాలులు వలన స్తంభాలు పడిపోవడం, తీగలు తెగడం వలన సరఫరాను నిలిపివేస్తున్నామన్నారు. అధికారికంగా ఎక్కడ కోతలు విధించడం లేదన్నారు.
వేమూరులో రోడెక్కిన స్థానికులు
వేమూరు ఉపకేంద్రం ఎదురుగా ఆర్అండ్బీ రోడ్డుపై రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులు
వేమూరు, న్యూస్టుడే: తెగిపడిన విద్యుత్తు తీగకు సంబంధిత శాఖ అధికారులు మరమ్మతులు జాప్యం చేయడంపై స్థానికులు గురువారం రాత్రి 10 గంటల సమయంలో తెనాలి-వెల్లటూరు ఆర్అండ్బీ రహదారిపై ఆందోళనకు దిగారు. విద్యుత్తు సరఫరా పునరుద్ధరించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రహదారిపై బైఠాయించారు. వేమూరు 6వ వార్డులో గురువారం సాయంత్రం 5గంటల సమయంలో విద్యుత్తు తీగ తెగింది. ఈ విషయమై వేమూరు లైన్మెన్కు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి సరఫరా నిలిపేశారు. గంటలో మరమ్మతులు పూర్తి చేస్తామని చెప్పారు. తరవాత ఫోన్చేస్తే ‘ఇదిగో అదిగో’ అంటూ సమయం గడిపారు. రాత్రి 8 గంటలైనా మరమ్మతులు చేయలేదని ప్రశ్నించడానికి ఫోన్చేస్తే ఆ ప్రాంత లైన్మెన్ ఫోన్ స్విచాఫ్ అయింది. చేసేది లేక విద్యుత్తు ఉప కేంద్రానికి ఫోన్చేస్తే వారు ఫోన్ తీయలేదు. దీంతో ఆ ప్రాంత వాసులు సుమారు 100 మంది ఉప కేంద్రం వద్దకు వెళ్లి ప్రశ్నించగా అక్కడ ఉన్న ఆపరేటర్ ఈ సమయంలో ఏం చేయలేమని బదులిచ్చాడు. దీంతో ఆందోళన కారులు సబ్స్టేషన్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న సబ్ ఇంజినీర్తో పోలీసులు మాట్లాడారు. వెంటనే మరమ్మతులు చేయించాలని విద్యుత్తు సిబ్బందిని కోరారు. 10.45 గంటలకు మరమ్మతుల అనంతరం సరఫరాను పునరుద్ధరించడంతో ఆందోళనకారులు నిరసన విరమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!