Nara Lokesh: పేదరికం లేని మంగళగిరి నా కల: లోకేశ్
‘పేదరికం లేని మంగళగిరి నా కల. గెలిచాక పేదలకు 20 వేల ఇళ్లు, ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి పూర్తి హక్కులతో పట్టాలు అందజేస్తా’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు.
లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరిన కుటుంబాలు
తాడేపల్లి, న్యూస్టుడే: ‘పేదరికం లేని మంగళగిరి నా కల. గెలిచాక పేదలకు 20 వేల ఇళ్లు, ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి పూర్తి హక్కులతో పట్టాలు అందజేస్తా’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. పట్టణంలోని 16, 19, 20 వార్డులకు చెందిన 75 కుటుంబాలు, మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన 25 కుటుంబాలు, పట్టణానికి చెందిన కొదమల సైమన్, జొన్నాదుల శివశంకర్, సాయిప్రసాద్, బాలసూర్యకుమార్, వాకా మాధవరావు ఆధ్వర్యంలో 70 కుటుంబాలు, బట్టు శివానందశాస్త్ర, చెల్లూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో దామర్ల శివశంకర్, వీరాస్వామితోపాటు 25 కుటుంబాలు ఆత్మకూరు నుంచి పులివర్తి సుందరయ్య ఆధ్వర్యంలో వేమూరి మోహన్, ఖమ్మంపాటి చందు, ప్రేమ్కుమార్, వేమూరి ప్రభుదాసుతోపాటు 30 కుటుంబాలు లోకేశ్ సమక్షంలో శుక్రవారం తెదేపాలో చేరాయి. ఉండవల్లిలోని ఆయన నివాసంలో నిర్వహించిన ఈ క్రమంలో పార్టీలో చేరిన వారికి లోకేశ్ పసుపు కండువాలు కప్పి ఆహ్వానించారు.
తాగునీళ్లు ఇవ్వలేని స్థితిలో పాలకులు..: లోకేశ్ మాట్లాడుతూ ఓడినా ప్రజల్లోనే ఉండి సొంత నిధులు వెచ్చించి సేవ చేస్తున్నానని అన్నారు. ఇక్కడ ప్రజలు వరుసగా రెండుసార్లు అవకాశం ఇచ్చినా కనీసం మంచినీళ్లు ఇవ్వలేని స్థితిలో స్థానిక ఎమ్మెల్యే ఆర్కే ఉన్నారని విమర్శించారు. తాను చిరు వ్యాపారులకు నాలుగేళ్లుగా తోపుడు బండ్లు ఇస్తున్నానన్నారు. ‘జËయహో బీసీ’ సభలో యూ-1 రిజర్వు జోన్ ఎత్తివేస్తానని చంద్రబాబు హామీ ఇవ్వగానే ఇప్పుడు యూ-1 జోన్ ఎత్తివేశారన్నారు. మంగళగిరిని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దే మాస్టర్ ప్లాన్ తన వద్ద ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో అవకాశం ఇస్తే ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటానన్నారు. నీలం బటన్ నొక్కి రూ.10 ఖాతాలో వేస్తూ ఎర్ర బటన్తో రూ.100 కొట్టేయడం సీఎం జగన్కు వెన్నతోపెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక తొమ్మిదిసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సామాన్యుడిని వదిలేసి.. సారొస్తే కోట్లు తగలేసి
[ 28-04-2024]
బీటలు వారిన పిల్లర్లు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకి కనిపిస్తున్న ఇనుప చువ్వలు.. వంతెనలపైనే గోతులు.. ఇవీ సామాన్యుడు వెళ్లే వారధులు.. జగనన్న సంక్షేమ రాజ్యంలో ప్రగతిదారులు.. అదే సీఎం సారు బయటకు అడుగేస్తే వాటి రూపురేఖలే మారిపోతాయి.. ఆయన అడుగుపెట్టేచోట ముందురోజే తళతళలాడే తారు రోడ్డు వేయాల్సిందే. -
జగనన్న పాలన.. మూడుసార్లు వడ్డన
[ 28-04-2024]
తెదేపా ప్రభుత్వ పాలనలో అన్ని ఛార్జీలు పెంచేశారు. మేం అధికారంలోకి వస్తే ఆర్టీసీ ప్రయాణికులకు ఊరట కల్పిస్తాం. పెంపు జోలికి వెళ్లం. -
నిలదీతలకు వేరసి.. పనులకు తెరదీసి..
[ 28-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా నగరపాలిక అధికారులు అదేం పట్టించుకోకుండా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రస్తుతం కొత్త పనులు చేయడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే పలు పనులు చేపట్టగా వాటిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. -
ప్రజల కష్టాలు చూసే ‘సూపర్-6’ రూపకల్పన: లోకేశ్
[ 28-04-2024]
పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశానని, వాటి నుంచి వారిని బయట పడేసేందుకే ‘సూపర్-6’ పథకాలకు రూపొందించినట్లు యువనేత, మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ తెలిపారు. -
కూటమి విజయ దుందుభి ఖాయం
[ 28-04-2024]
రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయ దుందుభి మోగించడం ఖాయమని.. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గెలుపును ఎవరూ ఆపలేరని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చెప్పారు. -
బ్యాండేజీ తీశాక బయటపడిన జగన్నాటకం: లోకేశ్
[ 28-04-2024]
జగన్రెడ్డి తలకు తగిలిన గులకరాయి గాయంపై బ్యాండేజీ తీసేస్తే ఎలాంటి మచ్చా లేదని, దీంతో ఆయన నటన ప్రజలకు అర్థమైందని యువనేత, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. -
మాకు ఏం చేశారని ఓటెయ్యాలి
[ 28-04-2024]
మంగళగిరి వైకాపా అభ్యర్థి మురుగుడు లావణ్యకు చేదు అనుభవం ఎదురైంది. పట్టణంలోని రత్నాలచెరువులో శనివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వృద్ధురాలిని ఓటు అభ్యర్థించారు. -
ఇంటింటికీ నీరు ఇవ్వలేకపోవడం దారుణం
[ 28-04-2024]
కృష్ణా నది నుంచి పైపుల ద్వారా నీరు అందుబాటులోకి తెచ్చినా.. పట్టణంలో ఇంటింటికీ కుళాయి నీరు ఇవ్వలేక పోవడం దారుణమని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆగుతున్నాయ్.. ఊడుతున్నాయ్.. జగనాసుర రథ‘చక్రాలు’
[ 28-04-2024]
సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ప్రయాణాలకు ఎక్కువగా ఉపయోగించే ఆర్టీసీ బస్సు ఛార్జీలు వైకాపా ఐదేళ్ల పాలనలో మూడుసార్లు పెంచింది. అన్నిరకాల బస్సుల్లో ఛార్జీలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!