నియమావళి అమలు ఇలాగేనా?
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 12 రోజులు గడిచింది. అమలుకు సంబంధించి ప్రత్యేకాధికారులను నియమించినా కొన్నిచోట్ల కోడ్ ఉల్లంఘనలు కనపడుతూనే ఉన్నాయి.
వేటపాలెం, అద్దంకి, మేదరమెట్ల, న్యూస్టుడే: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 12 రోజులు గడిచింది. అమలుకు సంబంధించి ప్రత్యేకాధికారులను నియమించినా కొన్నిచోట్ల కోడ్ ఉల్లంఘనలు కనపడుతూనే ఉన్నాయి. జగనే మా భవిష్యత్తు అనే కార్యక్రమం కింద ప్రతి క్లస్టర్ పరిధిలో అధికార పార్టీ జెండా దిమ్మెలు ఏర్పాటుచేసి, వాటికి పార్టీ రంగులు వేసి మరీ ఆవిష్కరించారు. వీటిల్లో చాలా వాటికి కోడ్ వచ్చిన తరువాత తెల్లరంగు వేశారు. అయినా కొన్నిచోట్ల అవి కనపడుతూనే ఉన్నాయి. అద్దంకిలో అధికార పార్టీ జెండాలు ఎగురవేసిన సిమెంటు దిమ్మెలు, ఇనుప చువ్వలు పార్టీ రంగుతోనే ఉన్నాయి.
మంచినీటి శుద్ధజల కేంద్రం వద్ద రాజకీయ నేతల ఫొటోలు రహదారిపైకి కనిపిస్తున్నాయి. వేలమూరిపాడు జగనన్న కాలనీ శంకుస్థాపన శిలాఫలకంపై రాజకీయ నాయకుల చిత్రపటాలు తొలగించకపోవటంపై స్థానికులు విమర్శిస్తున్నారు. కొరిశపాడు మండలం తమ్మవరంలో గ్రామ సచివాలయం ఎదురు ఉన్న వైకాపా, తెదేపా జెండా దిమ్మెలకు ఉన్న రంగు తొలగించలేదు. అనమనమూరులో ఉన్న విలేజ్ హెల్త్ క్లీనిక్, రైతుభరోసా కేంద్రాల్లో స్థానిక సర్పంచి, ఈ భవనాల్లో ఉన్న శిలాఫలకాల్లో రాజకీయ నాయకుల పేర్లకు ముసుగు తొడగలేదు. ఇప్పటికైనా వీటికి రంగు వేయడానికి అధికారులు చర్యలు చేపట్టాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో చేరిన బాపట్ల మాజీ ఎమ్మెల్యే
[ 28-04-2024]
బాపట్ల మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత చీరాల గోవర్ధన్రెడ్డి తెదేపాలో చేరారు. నెల్లూరులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు పసుపు కండువా కప్పి ఆహ్వానించారు. -
తెదేపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం
[ 28-04-2024]
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని కొన్నపాడు గ్రామంలో పత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మురళీ రామాంజనేయులు ఆదివారం ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సామాన్యుడిని వదిలేసి.. సారొస్తే కోట్లు తగలేసి
[ 28-04-2024]
బీటలు వారిన పిల్లర్లు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకి కనిపిస్తున్న ఇనుప చువ్వలు.. వంతెనలపైనే గోతులు.. ఇవీ సామాన్యుడు వెళ్లే వారధులు.. జగనన్న సంక్షేమ రాజ్యంలో ప్రగతిదారులు.. అదే సీఎం సారు బయటకు అడుగేస్తే వాటి రూపురేఖలే మారిపోతాయి.. ఆయన అడుగుపెట్టేచోట ముందురోజే తళతళలాడే తారు రోడ్డు వేయాల్సిందే. -
జగనన్న పాలన.. మూడుసార్లు వడ్డన
[ 28-04-2024]
తెదేపా ప్రభుత్వ పాలనలో అన్ని ఛార్జీలు పెంచేశారు. మేం అధికారంలోకి వస్తే ఆర్టీసీ ప్రయాణికులకు ఊరట కల్పిస్తాం. పెంపు జోలికి వెళ్లం. -
నిలదీతలకు వేరసి.. పనులకు తెరదీసి..
[ 28-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా నగరపాలిక అధికారులు అదేం పట్టించుకోకుండా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రస్తుతం కొత్త పనులు చేయడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే పలు పనులు చేపట్టగా వాటిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. -
ప్రజల కష్టాలు చూసే ‘సూపర్-6’ రూపకల్పన: లోకేశ్
[ 28-04-2024]
పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశానని, వాటి నుంచి వారిని బయట పడేసేందుకే ‘సూపర్-6’ పథకాలకు రూపొందించినట్లు యువనేత, మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ తెలిపారు. -
కూటమి విజయ దుందుభి ఖాయం
[ 28-04-2024]
రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయ దుందుభి మోగించడం ఖాయమని.. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గెలుపును ఎవరూ ఆపలేరని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చెప్పారు. -
బ్యాండేజీ తీశాక బయటపడిన జగన్నాటకం: లోకేశ్
[ 28-04-2024]
జగన్రెడ్డి తలకు తగిలిన గులకరాయి గాయంపై బ్యాండేజీ తీసేస్తే ఎలాంటి మచ్చా లేదని, దీంతో ఆయన నటన ప్రజలకు అర్థమైందని యువనేత, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. -
మాకు ఏం చేశారని ఓటెయ్యాలి
[ 28-04-2024]
మంగళగిరి వైకాపా అభ్యర్థి మురుగుడు లావణ్యకు చేదు అనుభవం ఎదురైంది. పట్టణంలోని రత్నాలచెరువులో శనివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వృద్ధురాలిని ఓటు అభ్యర్థించారు. -
ఇంటింటికీ నీరు ఇవ్వలేకపోవడం దారుణం
[ 28-04-2024]
కృష్ణా నది నుంచి పైపుల ద్వారా నీరు అందుబాటులోకి తెచ్చినా.. పట్టణంలో ఇంటింటికీ కుళాయి నీరు ఇవ్వలేక పోవడం దారుణమని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆగుతున్నాయ్.. ఊడుతున్నాయ్.. జగనాసుర రథ‘చక్రాలు’
[ 28-04-2024]
సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ప్రయాణాలకు ఎక్కువగా ఉపయోగించే ఆర్టీసీ బస్సు ఛార్జీలు వైకాపా ఐదేళ్ల పాలనలో మూడుసార్లు పెంచింది. అన్నిరకాల బస్సుల్లో ఛార్జీలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపింది.
తాజా వార్తలు (Latest News)
-
వెంకటగిరిలోజగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!