ప్రభుత్వం మారితేనే యువతకు భవిత
ప్రజలకు తాగు నీటిని అందించలేని వైకాపా ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాలను మాత్రం విచ్చలవిడిగా అందుబాటులోకి తీసుకొచ్చి యువతకు తీరని నష్టాన్ని కలిగిస్తోందని ఎన్డీయే గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు.
ఎన్డీయే గుంటూరు అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని
తెనాలి టౌన్, న్యూస్టుడే : ప్రజలకు తాగు నీటిని అందించలేని వైకాపా ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాలను మాత్రం విచ్చలవిడిగా అందుబాటులోకి తీసుకొచ్చి యువతకు తీరని నష్టాన్ని కలిగిస్తోందని ఎన్డీయే గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. గురువారం తెనాలి కొత్తపేటలో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, ఎన్డీయే అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రాజధాని అంశాన్ని పూర్తిగా పక్కకు పడేసిందన్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకుండా చేసి యువతకు ఉపాధిని దూరం చేసిందన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో నీటి ప్రాజెక్టులకు రూ.73 వేల కోట్లు కేటాయించి పట్టిసీమ వంటి వాటిని పూర్తి చేయడం వల్ల నేడు రైతాంగానికి ఉపయోగపడుతోందన్నారు. ఈ ప్రభుత్వం నీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన విషయం అందరికీ తెలుసన్నారు. వైకాపా ప్రభుత్వం మారితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. తెదేపా, జనసేన, భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందించనున్న పథకాల గురించి వివరించారు. సద్దాం హుస్సేన్ గురించి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్న విషయాన్ని ఒక విలేకరి ప్రస్తావించగా ఈ విషయంపై తాను ఇప్పటికే క్షమాపణలు చెప్పానని, మరో మారు చెబుతున్నానని పేర్కొన్నారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర నిధులతో తెనాలి నియోజకవర్గాన్ని నమూనాగా తీర్చిదిద్దుతామని తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. గుంటూరు పార్లమెంటు తెదేపా మహిళా విభాగ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మితో పాటు మూడు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో చేరిన బాపట్ల మాజీ ఎమ్మెల్యే
[ 28-04-2024]
బాపట్ల మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత చీరాల గోవర్ధన్రెడ్డి తెదేపాలో చేరారు. నెల్లూరులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు పసుపు కండువా కప్పి ఆహ్వానించారు. -
తెదేపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం
[ 28-04-2024]
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని కొన్నపాడు గ్రామంలో పత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మురళీ రామాంజనేయులు ఆదివారం ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సామాన్యుడిని వదిలేసి.. సారొస్తే కోట్లు తగలేసి
[ 28-04-2024]
బీటలు వారిన పిల్లర్లు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకి కనిపిస్తున్న ఇనుప చువ్వలు.. వంతెనలపైనే గోతులు.. ఇవీ సామాన్యుడు వెళ్లే వారధులు.. జగనన్న సంక్షేమ రాజ్యంలో ప్రగతిదారులు.. అదే సీఎం సారు బయటకు అడుగేస్తే వాటి రూపురేఖలే మారిపోతాయి.. ఆయన అడుగుపెట్టేచోట ముందురోజే తళతళలాడే తారు రోడ్డు వేయాల్సిందే. -
జగనన్న పాలన.. మూడుసార్లు వడ్డన
[ 28-04-2024]
తెదేపా ప్రభుత్వ పాలనలో అన్ని ఛార్జీలు పెంచేశారు. మేం అధికారంలోకి వస్తే ఆర్టీసీ ప్రయాణికులకు ఊరట కల్పిస్తాం. పెంపు జోలికి వెళ్లం. -
నిలదీతలకు వేరసి.. పనులకు తెరదీసి..
[ 28-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా నగరపాలిక అధికారులు అదేం పట్టించుకోకుండా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రస్తుతం కొత్త పనులు చేయడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే పలు పనులు చేపట్టగా వాటిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. -
ప్రజల కష్టాలు చూసే ‘సూపర్-6’ రూపకల్పన: లోకేశ్
[ 28-04-2024]
పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశానని, వాటి నుంచి వారిని బయట పడేసేందుకే ‘సూపర్-6’ పథకాలకు రూపొందించినట్లు యువనేత, మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ తెలిపారు. -
కూటమి విజయ దుందుభి ఖాయం
[ 28-04-2024]
రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయ దుందుభి మోగించడం ఖాయమని.. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గెలుపును ఎవరూ ఆపలేరని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చెప్పారు. -
బ్యాండేజీ తీశాక బయటపడిన జగన్నాటకం: లోకేశ్
[ 28-04-2024]
జగన్రెడ్డి తలకు తగిలిన గులకరాయి గాయంపై బ్యాండేజీ తీసేస్తే ఎలాంటి మచ్చా లేదని, దీంతో ఆయన నటన ప్రజలకు అర్థమైందని యువనేత, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. -
మాకు ఏం చేశారని ఓటెయ్యాలి
[ 28-04-2024]
మంగళగిరి వైకాపా అభ్యర్థి మురుగుడు లావణ్యకు చేదు అనుభవం ఎదురైంది. పట్టణంలోని రత్నాలచెరువులో శనివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వృద్ధురాలిని ఓటు అభ్యర్థించారు. -
ఇంటింటికీ నీరు ఇవ్వలేకపోవడం దారుణం
[ 28-04-2024]
కృష్ణా నది నుంచి పైపుల ద్వారా నీరు అందుబాటులోకి తెచ్చినా.. పట్టణంలో ఇంటింటికీ కుళాయి నీరు ఇవ్వలేక పోవడం దారుణమని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆగుతున్నాయ్.. ఊడుతున్నాయ్.. జగనాసుర రథ‘చక్రాలు’
[ 28-04-2024]
సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ప్రయాణాలకు ఎక్కువగా ఉపయోగించే ఆర్టీసీ బస్సు ఛార్జీలు వైకాపా ఐదేళ్ల పాలనలో మూడుసార్లు పెంచింది. అన్నిరకాల బస్సుల్లో ఛార్జీలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపింది.
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య