మీ పనులకో దండం!
గుంటూరు నగరపాలికలో గడప గడపకు మన ప్రభుత్వం కింద చేసిన అభివృద్ధి పనులకు పది నెలల నుంచి బిల్లులు చెల్లించలేదు. ఇవి రూ.కోట్లలో పేరుకుపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.
పది నెలలుగా బిల్లులకు దిక్కులేదు
రుణ ఒత్తిళ్లతో ఫోన్లు ఎత్తని గుత్తేదారులు
గడప గడపకు-మన ప్రభుత్వం పనుల తీరిది
ఈనాడు, అమరావతి
గుంటూరు నగరపాలికలో గడప గడపకు మన ప్రభుత్వం కింద చేసిన అభివృద్ధి పనులకు పది నెలల నుంచి బిల్లులు చెల్లించలేదు. ఇవి రూ.కోట్లలో పేరుకుపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. గతేడాది జూన్, జులై నెలల్లోనే ఆ పనులు పూర్తి చేస్తే వాటి తాలూకూ బిల్లులు ఇప్పటివరకు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. దీనిపై గుత్తేదారులు మండిపడుతున్నారు. చివరగా గతేడాది డిసెంబరు 19న ఆ పనులకు సంబంధించి కొన్ని బిల్లులు పాస్ అయ్యాయి. అవి సుమారు రూ.4-5 కోట్లు ఉంటాయి. అవి మినహా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఇలాగైతే తాము ఎలా బతకాలని గుత్తేదారులు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో ఆగమేఘాల మీద పనులు పూర్తి చేయించి తీరా బిల్లులు చెల్లించకుండా నెలల తరబడి జాప్యం చేస్తే తమకు వడ్డీ మేర కూడా గిట్టుబాటు కాదని ఆందోళన చెందుతున్నారు.
రూ.10 కోట్లకు పైగా పెండింగ్
తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే డివిజన్లలో మురుగు కాల్వలు, డ్రెయిన్లు, కల్వర్టులు, తాగునీటి పైపులైన్లకు సంబంధించిన అనుసంధానం తదితర పనులు 150కు పైగా చేశారు. వాటికి సుమారు రూ.10కోట్లకు పైగా బిల్లులు రావాల్సి ఉందని, ఇన్నాళ్లు పెండింగ్ పెడితే తమకు వడ్డీకి కూడా చాలదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున ముందుగానే నిధులు విడుదల చేస్తున్నామని, బిల్లుల చెల్లింపునకు నిధుల సమస్య తలెత్తదని చెప్పారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ వద్ద నిధులు అందుబాటులో ఉంటాయని, పనులు చేపట్టిన వెంటనే బిల్లులు పొందవచ్చని అప్పట్లో ప్రభుత్వం ఊదరగొట్టింది. దీంతో గుత్తేదారులు పోటీపడి మరీ తక్కువకు పనులు దక్కించుకుని పూర్తి చేశారు. తీరా బిల్లులకు నెలల తరబడి ఎదురుచూడాల్సి రావడంతో ఇప్పుడు వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పోసొప్పో చేసి వాటిని చేసిన గుత్తేదారులు ప్రస్తుతం ఎవరైనా ఫోన్లు చేస్తే తీసే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు. అప్పులిచ్చిన వాళ్లు డబ్బులు అడుగుతారనే భయం వారిని వెంటాడుతోంది.
ఆ నిధులెటు మళ్లించారు?
పది నెలల కిందటే ఆ బిల్లులను సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసినా ఇప్పటివరకు రాలేదు. దీంతో ఆ నిధులను వేటికైనా మళ్లించారా అనే కోణంలో గుత్తేదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాత బిల్లులే పెండింగ్ పడ్డాయని చెప్పి మరే ఇతర పనులకు వారు పోటీ పడడం లేదు. కలెక్టర్ల వద్దే నిధులు ఉంటే బిల్లుల చెల్లింపులో ఇంత జాప్యమెందుకు జరుగుతోందని ప్రశ్నిస్తున్నారు. పనులు చేయండి బిల్లులకు ఇబ్బందేమీ లేదని నాడు ఒత్తిడి చేసి మరీ చేయించిన పలువురు ఇంజినీరింగ్ అధికారులు ఇప్పుడు వాటి ఊసే మరిచారు. వారిని ప్రశ్నిస్తే తమ చేతిలో ఏమీ లేదని చేతులెత్తేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేయించిన అధికారులు పట్టించుకోక.. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటి? ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ నిధులు వస్తాయా? రావా? అన్న ఆందోళనను గుత్తేదారులు వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోపిరెడ్డి.. డబ్బు, రౌడీయిజంతో గెలవాలని చూస్తున్నారు: అమూల్య భావోద్వేగం
[ 28-04-2024]
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పల్నాడు జిల్లా నరసరావుపేట తెదేపా అభ్యర్థి చదలవాడ అరవింద్బాబు కుమార్తె అమూల్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. -
తెదేపాలో చేరిన బాపట్ల మాజీ ఎమ్మెల్యే
[ 28-04-2024]
బాపట్ల మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత చీరాల గోవర్ధన్రెడ్డి తెదేపాలో చేరారు. నెల్లూరులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు పసుపు కండువా కప్పి ఆహ్వానించారు. -
తెదేపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం
[ 28-04-2024]
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని కొన్నపాడు గ్రామంలో పత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మురళీ రామాంజనేయులు ఆదివారం ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సామాన్యుడిని వదిలేసి.. సారొస్తే కోట్లు తగలేసి
[ 28-04-2024]
బీటలు వారిన పిల్లర్లు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకి కనిపిస్తున్న ఇనుప చువ్వలు.. వంతెనలపైనే గోతులు.. ఇవీ సామాన్యుడు వెళ్లే వారధులు.. జగనన్న సంక్షేమ రాజ్యంలో ప్రగతిదారులు.. అదే సీఎం సారు బయటకు అడుగేస్తే వాటి రూపురేఖలే మారిపోతాయి.. ఆయన అడుగుపెట్టేచోట ముందురోజే తళతళలాడే తారు రోడ్డు వేయాల్సిందే. -
జగనన్న పాలన.. మూడుసార్లు వడ్డన
[ 28-04-2024]
తెదేపా ప్రభుత్వ పాలనలో అన్ని ఛార్జీలు పెంచేశారు. మేం అధికారంలోకి వస్తే ఆర్టీసీ ప్రయాణికులకు ఊరట కల్పిస్తాం. పెంపు జోలికి వెళ్లం. -
నిలదీతలకు వేరసి.. పనులకు తెరదీసి..
[ 28-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా నగరపాలిక అధికారులు అదేం పట్టించుకోకుండా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రస్తుతం కొత్త పనులు చేయడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే పలు పనులు చేపట్టగా వాటిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. -
ప్రజల కష్టాలు చూసే ‘సూపర్-6’ రూపకల్పన: లోకేశ్
[ 28-04-2024]
పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశానని, వాటి నుంచి వారిని బయట పడేసేందుకే ‘సూపర్-6’ పథకాలకు రూపొందించినట్లు యువనేత, మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ తెలిపారు. -
కూటమి విజయ దుందుభి ఖాయం
[ 28-04-2024]
రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయ దుందుభి మోగించడం ఖాయమని.. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గెలుపును ఎవరూ ఆపలేరని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చెప్పారు. -
బ్యాండేజీ తీశాక బయటపడిన జగన్నాటకం: లోకేశ్
[ 28-04-2024]
జగన్రెడ్డి తలకు తగిలిన గులకరాయి గాయంపై బ్యాండేజీ తీసేస్తే ఎలాంటి మచ్చా లేదని, దీంతో ఆయన నటన ప్రజలకు అర్థమైందని యువనేత, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. -
మాకు ఏం చేశారని ఓటెయ్యాలి
[ 28-04-2024]
మంగళగిరి వైకాపా అభ్యర్థి మురుగుడు లావణ్యకు చేదు అనుభవం ఎదురైంది. పట్టణంలోని రత్నాలచెరువులో శనివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వృద్ధురాలిని ఓటు అభ్యర్థించారు. -
ఇంటింటికీ నీరు ఇవ్వలేకపోవడం దారుణం
[ 28-04-2024]
కృష్ణా నది నుంచి పైపుల ద్వారా నీరు అందుబాటులోకి తెచ్చినా.. పట్టణంలో ఇంటింటికీ కుళాయి నీరు ఇవ్వలేక పోవడం దారుణమని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆగుతున్నాయ్.. ఊడుతున్నాయ్.. జగనాసుర రథ‘చక్రాలు’
[ 28-04-2024]
సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ప్రయాణాలకు ఎక్కువగా ఉపయోగించే ఆర్టీసీ బస్సు ఛార్జీలు వైకాపా ఐదేళ్ల పాలనలో మూడుసార్లు పెంచింది. అన్నిరకాల బస్సుల్లో ఛార్జీలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపింది.
తాజా వార్తలు (Latest News)
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!