ప్రజల గొంతూ తడపలేరా?
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
తాగునీటి సమస్యను పరిష్కరించలేని ఎమ్మెల్యే కిలారి
నిడుబ్రోలులోని మంచినీటి చెరువు
పొన్నూరు, న్యూస్టుడే: 2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల కాలంలో పొన్నూరు పట్టణంలోని తాగునీటి సమస్య పరిష్కారానికి ఎటువంటి నిధులు మంజూరు చేయలేదు.
- 2019 ఎన్నికల సమయంలో అప్పటి వైకాపా అభ్యర్థి కిలారి వెంకటరోశయ్య పొన్నూరు పట్టణం జీబీసీ రహదారిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి రాగానే మంచినీటి సమస్యను పరిష్కారస్తామని వెల్లడించారు. తాగునీటిని తెదేపా ప్రభుత్వం ఒక్క పూట మాత్రమే సరఫరా చేసిందని, వైకాపా అధికారంలోకి వస్తే ఉదయం, సాయంత్రం సమయాల్లో తాగునీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
- పొన్నూరు పట్టణ పరిధిలోని నిడుబ్రోలు, క్యాబిన్పేట, రైలుపేట, నేతాజీనగర్, శ్రీనగర్ కాలనీ, వడ్డిముక్కల రోడ్డు, వీవర్స్ కాలనీ, టీచర్స్ కాలనీ, ముబారక్ నగర్, డఫ్పేట, సాయినగర్, సాంబశివరావునగర్, తదితర ప్రాంతాల్లో చాలా కాలం నుంచి పురపాలక సంఘ అధికారులు సరఫరా చేసే తాగునీరు సరఫరా కాకపోవడంతో కాలనీ వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు సరఫరా కావడం లేదని మహిళలు ఫిర్యాదు చేసినా ఇంజినీరింగ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వ్యక్తిగత అవసరాలకు నీరు అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
- తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పట్టణంలోని 31 వార్డులో సుమారు 250 వరకు చేతి పంపులను ఏర్పాటు చేశారు. అందులో 5, 6, 8, 18, 19, 21, 25, 27, 29 వార్డుల్లో చేతి పంపులు పాడైపోయాయి. చేతి పంపులు బాగు చేయించమని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని మహిళలు చెబుతున్నారు. వాటి మరమ్మతులకు వైకాపా ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. చేతి పంపులు అందుబాటులో లేకపోవడంతో నీటి కోసం మహిళలు నానా అవస్థలు పడుతున్నారు.
- అయిదేళ్ల కాలంలో ప్రతి వేసవిలో ఒక్కపూట తాగునీటిని కూడా వైకాపా ప్రభుత్వం అందించలేకపోయింది. మూడు నెలల నుంచి తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న వారే లేరని మహిళలు వాపోతున్నారు. సాయంత్రం పూట తాగునీటి సరఫరా మాట నీటిపై రాతగానే మిగిలిపోయింది. ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య ఎన్నికల హామీ విస్మరించారని పుర ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పట్టణం : పొన్నూరు వార్డు : 31
కుటుంబాలు : 17,500
జనాభా: 61,500
కుళాయిల సంఖ్య : 5,500
ప్రతి రోజు మంచినీటి
సరఫరా : 8 లక్షల లీటర్లు
డబ్బా నీటిని కొనుగోలు చేస్తున్నాం
మా వార్డులో మూడు నెలల నుంచి తాగునీరు సరఫరా కావడం లేదు. వ్యక్తిగత అవసరాల కోసం చేతి పంపులో నీటిని వాడుకుంటున్నా. ప్రైవేటు వ్యాపారుల వద్ద డబ్బా నీటిని కొనుగోలు చేసి దాహార్తి తీర్చుకుంటున్నా. ఇప్పటికే కుటుంబ అవసరాల ఖర్చులు బాగా పెరిగిపోయాయి. మా లాంటి సామాన్యుడు డబ్బులు చెల్లించి తాగునీటి కొనుగోలు చేయాల్సి దుస్థితి వైకాపా ప్రభుత్వంలో ఏర్పడింది.
చిలకా ప్రభుదాస్,13వ వార్డు
తెచ్చుకోలేకపోతున్నాం
చాలా రోజులు నుంచి తాగునీరు రావడం లేదని పురపాలక సంఘ అధికారులను కలిసి లిఖత పూర్వకంగా ఫిర్యాదు చేశాం. సమస్య పరిష్కరిస్తామని అధికారులు చెప్పారు. మా సమస్య పరిష్కారం కాలేదు. దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోలేకపోతున్నాం. ఇప్పటికే వృద్ధాప్యం కావడంతో అనేక రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.
సాతులూరి మల్లేశ్వరి, 11వ వార్డు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
[ 04-05-2024]
గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రలోభాలు
[ 04-05-2024]
జీతభత్యాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగ బాధ్యతల నిర్వహణతోపాటు వివిధ అంశాల్లో ఐదేళ్లు రాచిరంపాన పెట్టడంతో వైకాపా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తల్ని ఆ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. -
‘పేదకు నరకం’.. లేదే కనికరం..
[ 04-05-2024]
రాజేష్, మనవడు మాది వినుకొండ మండలంలోని కొచ్చెర్ల గ్రామం. మా తాత చిన్నయేసు ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం గుంటూరు పెద్దాసుపత్రికి తీసుకొచ్చాం. -
‘సంక్షేమం పేరుతో జగన్ నమ్మక ద్రోహం’
[ 04-05-2024]
రాష్ట్రంలో సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమం పేరుతో ముస్లిం, మైనార్టీలకు నమ్మక ద్రోహం చేశారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ పేర్కొన్నారు. -
రాజధాని వద్దంటూ.. లోకల్ ఎలా అవుతారు?
[ 04-05-2024]
‘అమరావతిని రాజధానిగా వద్దని, మూడు రాజధానులు కావాలంటూ మీరు పక్కా లోకల్ అని వాహనాలపై ఎలా రాసుకుంటారు’ అని వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్యని ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. -
372 సమస్యాత్మక కేంద్రాలు
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న జరగనున్న ఎన్నికలకు సంబంధించి 373 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను నియమించామని, 1,309 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్రెడ్డి తెలిపారు. -
జగన్ కుతంత్రం.. ఓడిన మానవత్వం
[ 04-05-2024]
నా అవ్వాతాతలు ఆనందంగా ఉండాలి. వారికి ఇంటి వద్దే పింఛను అందిస్తున్నాం. వారి చల్లని దీవెనలు అందించాలి. ఇవీ సీఎం జగన్ వృద్ధులను ఉద్దేశిస్తూ ఆయా సభల్లో చెప్పే మాటలు. -
తొలి రోజు 1,011 మంది గృహ ఓటింగ్
[ 04-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన హోం ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు రెండు రోజుల పాటు ఓటింగ్ చేసుకునే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. -
జగన్.. మాపై ఎందుకీ కక్ష?
[ 04-05-2024]
భట్టిప్రోలు మండలం తాతావారిపాలెం గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు స్థానిక యూనియన్ బ్యాంకుకి ఆటోలో వచ్చారు. ఆమె ఖాతాలో కొంతకాలంగా లావాదేవీలు జరగకపోవడంతో నగదు తీసుకోవడం. -
జగన్ను గద్దె దించడానికి నిరుద్యోగులు సిద్ధం
[ 04-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను మోసగించిన సీఎం జగన్ను గద్దె దించడానికి 40 లక్షల మంది నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని నిరుద్యోగ జేఏసీ నాయకులు అన్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు 1800 కిలోమీటర్లు మేర చేపట్టిన నిరుద్యోగ చైనత్యయాత్ర శుక్రవారం మంగళగిరి చేరింది.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM