NDA: పింఛన్ల పంపిణీలో ఒక్క ప్రాణం పోయినా సీఎస్దే బాధ్యత: ఎన్డీయే కూటమి
పింఛన్ల పంపిణీలో సీఎస్ జవహర్రెడ్డి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఎన్డీయే కూటమి నేతలు సచివాలయంలో ఆకస్మిక ధర్నాకు దిగారు.
అమరావతి: పింఛన్ల పంపిణీలో సీఎస్ జవహర్రెడ్డి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఎన్డీయే కూటమి నేతలు సచివాలయంలో ఆకస్మిక ధర్నాకు దిగారు. సీఎం, సీఎస్ కార్యాలయాలు ఉండే మొదటి బ్లాక్ వద్ద మెట్లపై బైఠాయించి ఆందోళన చేశారు. సీఎం జగన్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సీఎస్కు ఎన్నికల సంఘం లేఖ రాసిన నేపథ్యంలో తెదేపా, జనసేన, భాజపా నేతలు సీఎస్ను సచివాలయంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. మే నెల పింఛను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. సహేతుకమైన నిర్ణయం తీసుకోవాలని, ఈసీ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
గ్రామ సచివాలయ ఉద్యోగులు సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగులను కూడా పెన్షన్ల పంపిణీకి వినియోగించాలని సూచించారు. దీనిపై సీఎస్ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో కూటమి నేతలు అక్కడే బైఠాయించి సీఎస్ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉన్నాధికారుల పొరపాటు, నిర్లక్ష్యం, దురుద్దేశం వల్ల 33 మంది వృద్ధులు పింఛను కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయారని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఉపాధ్యాయుల్ని మద్యం దుకాణాల వద్ద పెట్టిన ప్రభుత్వం.. పింఛను పంపిణీకి ఉద్యోగులను వినియోగించలేరా? అని ప్రశ్నించారు. మే నెల పింఛన్ల పంపిణీలో ఒక్క ప్రాణం పోయినా సీఎస్దే బాధ్యత అని స్పష్టం చేశారు. తెదేపా నేత దేవినేని ఉమా, జనసేన నేత శివశంకర్, భాజపా నేత లంకా దినకర్ తదితరులు నిరసన తెలిపిన వారిలో ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ఓ జలగ
‘జగన్ ఐదేళ్ల పాలనలో జనాలను జలగలా పీల్చి పిప్పి చేశారు. ఎక్కడా అభివృద్ధి లేదు.. వైకాపా నాయకులంతా మారీచులు.. దోచుకోవడం తప్ప అభివృద్ధి తెలియదు. వారు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనమే. -
4 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం
రాష్ట్రంలో మరో నాలుగు రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగనుందని సీఎం జగన్ అన్నారు. కర్నూలు వైఎస్సార్ సర్కిల్ సమీపంలో గురువారం ఏర్పాటుచేసిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో మాట్లాడారు. -
నా మెజారిటీని తగ్గించేందుకు రూ.300 కోట్ల దోపిడీ సొమ్ము పంపారు
మంగళగిరి నియోజకవర్గంలో తన మెజారిటీ తగ్గించేందుకు రూ.300 కోట్ల దోపిడీ సొమ్ము పంపారని తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్ పేర్కొన్నారు. -
అరాచకం.. వినాశనం.. ఇదే జగన్ నైజం
సమాజానికి జగన్ చాలా హానికరమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. అరాచకం, వినాశనం ఆయన నైజమని దుయ్యబట్టారు. -
కడప ప్రజలు నేరం వైపా.. న్యాయం వైపా?: వైఎస్ షర్మిల
చెల్లెళ్లకంటే జగన్కు భార్య తరఫు బంధువులే ఎక్కువయ్యారా? అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. -
మైనార్టీలకు అండగా ఉంటాం: పవన్ కల్యాణ్
మైనార్టీల అభ్యున్నతికి కూటమి మేనిఫెస్టో తోడ్పడుతుందని, వారికి అండగా ఉంటామని జనసేనాని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. -
సజ్జల భార్గవరెడ్డిపై కేసు నమోదు చేసిన సీఐడీ
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. -
24 గంటల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేస్తా: చంద్రబాబు
ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన 24 గంటల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. -
చంద్రబాబు ప్రచార జోరు.. శుక్రవారం 5 నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు
రాష్ట్రంలో ఎన్నికల ప్రచార గడువు శనివారంతో ముగుస్తుండటంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రెండ్రోజుల పాటు విస్తృత పర్యటనలు చేపట్టనున్నారు. -
పెనమలూరులో వైకాపా అభ్యర్థి జోగి రమేశ్ అనుచరుల వీరంగం
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని గంగూరులో వైకాపా అభ్యర్థి జోగి రమేశ్ అనుచరులు అరాచకం సృష్టించారు. -
వైకాపా రౌడీ మూకలు బరితెగిస్తున్నాయ్: అచ్చెన్నాయుడు
అధికారం కోల్పోతున్నారన్న అక్కసుతో వైకాపా రౌడీ మూకలు బరి తెగిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. -
రేపటి కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం గెలవాలి: చంద్రబాబు
కరెంటు ఛార్జీలు, మద్య నిషేధంపై జవాబు చెప్పిన తర్వాతే జగన్ ఓట్లు అడగాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. -
యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన.. మచిలీపట్నంలో ఇంటింటికీ ‘సిద్ధం’ స్టిక్కర్లు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా నేతలు యథేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. -
పోలింగ్కు ముందు ఓట్ల కొనుగోలుకు వైకాపా కుట్ర: విజయ్ కుమార్
ప్రజల డబ్బుతో వారి ఓట్ల కొనుగోలుకు వైకాపా ప్రభుత్వం కుట్రపన్నిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటేసిన వారిని కాటేసే రకం జగన్: చంద్రబాబు
ఈ ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్ ముక్కలవడం ఖాయం అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం.. గుంటూరులో ఉద్యోగుల ఆందోళన
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోంది. గుంటూరు మహిళా కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పత్రాలు లేవని ఉద్యోగులను తిరిగి పంపిస్తున్నారు. -
ఏపీలో సంక్షేమ పథకాలకు నిధుల జమ ఎందుకు ఆలస్యమైంది?: ఈసీ
ఏపీలో సంక్షేమ పథకాల నగదు జమపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల పోలింగ్ ముగిసేవరకు నిధుల జమను వాయిదా వేసింది. -
ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేశా... ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డా: వైఎస్ షర్మిల
ఎంపీగా అవినాష్రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
వైకాపా వీరవిధేయ పోలీసులపై వేటు
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల అరాచకాలకు కొమ్ముకాసిన పోలీసులపై ఎన్నికల సంఘం (ఈసీ) వేటు వేసింది. మాచర్ల టౌన్ సీఐ శరత్బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్సై వి.శ్రీహరిలను బదిలీ చేసింది. -
ఏపీలో ఆదివారం బ్యాంకులు పనిచేసేలా చూడండి: చర్చనీయాంశమైన ఆర్థికశాఖ అధికారుల లేఖ
ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలు పనిచేసేలా చూడాలని ఆర్థికశాఖ అధికారులు డీజీఎంకు లేఖ రాయడం చర్చనీయాంశమవుతోంది. -
హైదరాబాద్ నుంచి గుంటూరుకు లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లు సీజ్
ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది.
తాజా వార్తలు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!