icon icon icon
icon icon icon

Chandrababu: చంద్రబాబు ప్రచార జోరు.. శుక్రవారం 5 నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు

రాష్ట్రంలో ఎన్నికల ప్రచార గడువు శనివారంతో ముగుస్తుండటంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రెండ్రోజుల పాటు విస్తృత పర్యటనలు చేపట్టనున్నారు.

Published : 09 May 2024 20:07 IST

అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల ప్రచార గడువు శనివారంతో ముగుస్తుండటంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రెండ్రోజుల పాటు విస్తృత పర్యటనలు చేపట్టనున్నారు. శుక్రవారం ఒక్క రోజే ఆయన ఐదు ప్రజాగళం సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.  శనివారం మూడు సభల్లో పాల్గొననున్నారు. పలమనేరులో మార్చి 27న ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన చంద్రబాబు.. ఇవాళ్టితో 82 నియోజకవర్గాల్లో సభలు పూర్తి చేశారు. ప్రచారగడువు ముగిసే నాటికి మొత్తం 90 నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు పూర్తవనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img