icon icon icon
icon icon icon

Atchannaidu: వైకాపా రౌడీ మూకలు బరితెగిస్తున్నాయ్‌: అచ్చెన్నాయుడు

అధికారం కోల్పోతున్నారన్న అక్కసుతో వైకాపా రౌడీ మూకలు బరి తెగిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Published : 09 May 2024 18:38 IST

అమరావతి: అధికారం కోల్పోతున్నారన్న అక్కసుతో వైకాపా రౌడీ మూకలు బరి తెగిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ‘ఈనాడు’ కంట్రిబ్యూటర్‌ రమేశ్‌పై వైకాపా కార్యకర్తల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. వైకాపా పాలనలో ప్రజలు, మీడియాపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రమేశ్‌పై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల భద్రతకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img