icon icon icon
icon icon icon

Chandrababu: ఓటేసిన వారిని కాటేసే రకం జగన్‌: చంద్రబాబు

ఈ ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్‌ ముక్కలవడం ఖాయం అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Published : 09 May 2024 14:53 IST

కురుపాం: ఈ ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్‌ ముక్కలవడం ఖాయం అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. తెదేపా, భాజపా, జనసేన కూటమి విజయం తథ్యమన్నారు. వైకాపావి నవరత్నాలు కాదు.. నవమోసాలని విమర్శించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలతో ముందుకొస్తున్నామని చెప్పారు.

‘‘రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. దళిత, గిరిజన ద్రోహి.. జలగ జగన్‌. ఓటేసిన వారిని కాటేసే రకం ఆయనది. ఏకలవ్య మోడల్‌ స్కూళ్లను నిర్వీర్యం చేశారు. లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ను దోచుకున్నారు. విద్యుత్‌ ఛార్జీలతో పాటు అన్ని ధరలనూ పెంచేశారు. మద్యం దుకాణాల్లో డిజిటల్‌ చెల్లింపుల్లేవు. ఆ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్‌కు పోతోంది. ఉద్యోగాల్లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. జగన్‌ మీ బిడ్డ కాదు.. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్‌ గడ్డ. జాబు రావాలంటే కూటమి అధికారంలోకి రావాలి’’ అని చంద్రబాబు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img