icon icon icon
icon icon icon

Pawan Kalyan: మైనార్టీలకు అండగా ఉంటాం: పవన్‌ కల్యాణ్‌

మైనార్టీల అభ్యున్నతికి కూటమి మేనిఫెస్టో తోడ్పడుతుందని, వారికి అండగా ఉంటామని జనసేనాని పవన్‌ కల్యాణ్ భరోసా ఇచ్చారు.

Published : 09 May 2024 22:26 IST

విజయవాడ: మైనార్టీల అభ్యున్నతికి కూటమి మ్యానిఫెస్టో తోడ్పడుతుందని, వారికి అండగా ఉంటామని జనసేనాని పవన్‌ కల్యాణ్ భరోసా ఇచ్చారు. విజయవాడలో కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా గురువారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ... వైకాపా ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. సీఎం ఇంటికి కూత వేటు దూరంలో యువతిపై అత్యాచారం జరిగితే నిందితులను ఇంకా పట్టుకోలేదన్నారు. ఇచ్చిన సీపీఎస్‌ హామీని నిలబెట్టుకోలేని జగన్‌.. ముస్లిం రిజర్వేషన్లను కాపాడుతామంటున్నారని ఎద్దేవా చేశారు. 

‘‘రాష్ట్రంలో దాదాపు 30వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు. హమీలను నెరవేర్చకుండా జగన్‌ మాట తప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక యువతకు పెద్దన్న పాత్ర పోషిస్తుంది. యువతలో ఉన్న నైపుణ్యం బయటకు తీయాలి. వారి ఆశలు, ఆకాంక్షలు అసెంబ్లీలో వినిపిస్తా’’ అని పవన్‌ తెలిపారు. కూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థులు గద్దె రామ్మోహన్‌, సుజనాచౌదరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img