icon icon icon
icon icon icon

AP CID: సజ్జల భార్గవరెడ్డిపై కేసు నమోదు చేసిన సీఐడీ

సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

Updated : 09 May 2024 21:57 IST

అమరావతి: సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. వైకాపా సోషల్‌ మీడియాలో తెదేపా అధినేత చంద్రబాబుపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ.. కేసు నమోదు చేయాలని సీఐడీని ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో 171f, 171g, 505(2), రెడ్ విత్120బి ఐపీసీ సెక్షన్ల ప్రకారం సీఐడి కేసు నమోదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img