జగన్.. ఓ జలగ
‘జగన్ ఐదేళ్ల పాలనలో జనాలను జలగలా పీల్చి పిప్పి చేశారు. ఎక్కడా అభివృద్ధి లేదు.. వైకాపా నాయకులంతా మారీచులు.. దోచుకోవడం తప్ప అభివృద్ధి తెలియదు. వారు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనమే.
వైకాపా నాయకులంతా మారీచులు
మళ్లీ వారొస్తే రాష్ట్రం నాశనమే
ఆస్తిపత్రాలపై మళ్లీ రాజముద్రను తీసుకొస్తా
ప్రజలంతా కూటమిని ఆదరించండి
13న ఉదయం 7 గంటలకే ఓటేయాలి
కురుపాం, చీపురుపల్లి, విశాఖ సభల్లో చంద్రబాబు
ఈనాడు-విజయనగరం, విశాఖపట్నం, ఈనాడు డిజిటల్ విశాఖపట్నం, న్యూస్టుడే, సీతంపేట, చీపురుపల్లి, గరివిడి, కురుపాం గ్రామీణం: ‘జగన్ ఐదేళ్ల పాలనలో జనాలను జలగలా పీల్చి పిప్పి చేశారు. ఎక్కడా అభివృద్ధి లేదు.. వైకాపా నాయకులంతా మారీచులు.. దోచుకోవడం తప్ప అభివృద్ధి తెలియదు. వారు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనమే. ఈ ఎన్నికల్లో కూటమికి పట్టం కట్టండి. అభివృద్ధి చేసి చూపిస్తా. మీ పిల్లల భవితకు బంగారుబాట వేస్తా..’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం, విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, విశాఖ ఉత్తరం నియోజకవర్గంలోని సీతంపేటలలో గురువారం ప్రజాగళం సభల్లో ఆయన మాట్లాడారు. విశాఖలో రాత్రి వర్షపు జల్లులు కురిసినా భారీగా తరలివచ్చిన ప్రజలంతా చంద్రబాబు ప్రసంగాన్ని ఆసాంతం విన్నారు. తమ ప్రభుత్వ హయాంలో గిరిజన బిడ్డల కోసం ఎన్నో పథకాలు అమలుచేస్తే జగన్ వాటిని ఎత్తేశారని మండిపడ్డారు. మన్యం వాసులపై ఆయనకు ఎందుకింత కక్షని ధ్వజమెత్తారు.
లేటరైట్ ముసుగులో దోపిడీ
‘బాక్సైట్ తవ్వకాలు నిలిపివేస్తే.. వైకాపా నేతలు తవ్వకాలు చేపట్టి సహజ సంపదను దోచుకున్నారు. లేటరైట్ ముసుగులో భారతి సిమెంట్ కోసం బాక్సైట్ తవ్వకాలు చేపట్టారు. గిరిజన ప్రాంతంలోని వారికే ఉద్యోగావకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో జీవో నం.3 తీసుకొస్తే జగన్ తీసేశారు. ఇలాంటి వ్యక్తికి ఓటేస్తారా? మేం అధికారంలోకి వస్తే ఆ జీవోను తీసుకొస్తాం. మీ జీవితాలను అంధకారంలోకి నెట్టిన వ్యక్తి జగన్. ఎస్సీలకు 26 పథకాలు అమలుచేస్తే రద్దు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు యాభై ఏళ్లకే పింఛను ఇచ్చే బాధ్యత నాది’ అని భరోసానిచ్చారు.
జనవరిలో బటన్ నొక్కితే.. ఇంకా డబ్బులు పడలేదు
‘నాయకుడంటే ఉత్తుత్తి బటన్లు నొక్కడం కాదు. ఉద్యోగాలివ్వాలి. ఆడబిడ్డలకు రక్షణగా నిలవాలి. మీ ఆదాయం పెంచాలి. మోదీ బటన్ నొక్కుతున్నారు. ఏనాడైనా చెప్పారా? అదీ నాయకుడికి ఉండాల్సిన లక్షణం. జగన్ బటన్ నొక్కి వేసింది రూ.10.. బొక్కేసింది రూ.100. ‘బటన్ నొక్కా.. ఎన్నికల కమిషన్ డబ్బులు ఇవ్వొద్దంటోం’దని జగన్ చెబుతున్నారు. మరి జనవరిలో బటన్ నొక్కితే ఇన్నాళ్లూ ఎందుకు పడలేదు జగన్?’ అని ప్రశ్నించారు.
అది ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం
‘జగనన్న భూహక్కు పత్రం పేరుతో పాటు ఆ పుస్తకాల మీద జగన్ ఫొటో ఏంటి? ప్రజల ఆస్తి పత్రాల మీద రాజముద్ర ఉండాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని అమల్లోకి తీసుకొచ్చి జగన్ ఫొటోలున్న పత్రాలను చించి చెత్తబుట్టలో వేస్తా’ అని చంద్రబాబు భరోసానిచ్చారు. ‘వైకాపా ప్రభుత్వం ప్రజల భూములను కొట్టేయాలని ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చింది. అది ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం. రికార్డులు ఉండవు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిరాక్సు పత్రాలిస్తారు. మన వివరాలన్నింటికీ ఓ కంపెనీకి చెందిన ప్రైవేటు వ్యక్తిని యజమానిగా ఉంచుతారు. మన ఆస్తులు అమ్మాలంటే జగన్ అనుమతి అవసరం. ప్రతి గ్రామంలో ప్రైవేటు గుమస్తాకు అధికారమిస్తారు. ఆయన ఒప్పుకోకపోతే మనం అమ్మడానికి వీలుండదు. జగన్ నియమించే ఆ అధికారి/వ్యక్తికి మన భూములపై పెత్తనమిస్తున్నారు. ఇలా అయితే ప్రజాఆస్తులకు రక్షణ ఎలా ఉంటుంది?’ అని ప్రశ్నించారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ఆ చట్టం రద్దు చేసే బాధ్యత తీసుకుంటా’నని హామీనిచ్చారు. అనంతరం జగన్ ఫొటో ఉన్న పుస్తకాన్ని ప్రజల ముందు చించారు.
ఉదయం 7 గంటలకే వెళ్లండి
ఎన్నికల రోజున రాష్ట్ర ప్రజలంతా ఉదయం ఏడింటికే పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా ఓటేయాలని కోరారు. ‘వైకాపా నాయకులు మారీచులు. మారువేషంలో వస్తారు. మిమ్మల్ని మభ్యపెడతారు. ఏదేమైనా ధర్మం గెలుస్తుంది. విజయం మనదే. ఇటీవల ఉద్యోగులు, పోలీసులు పోస్టల్ బ్యాలట్లో ఓటేశారు. వైకాపా వాళ్లు డబ్బులిచ్చినా మనకే మద్దతు తెలిపారు. అప్పుడే అయిపోలేదు. మీ కుటుంబసభ్యులనూ అప్రమత్తం చేయండి. ఈ నెల 13న కూటమికే ఓట్లేయించండి’ అని కోరారు.
ఈ జన సునామీలో రాష్ట్రవ్యాప్తంగా వైకాపా తుడిచిపెట్టుకుపోతుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. ఉత్తరాంధ్రను తాకట్టు పెట్టిన దౌర్భాగ్యుడు బొత్స సత్యనారాయణ అని, చీపురుపల్లిలో ఆయన చిత్తుగా ఓడిపోతారని చెప్పారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు.
రాజమహేంద్రవరం జైల్లో ఉన్నప్పుడు చంపాలని కుట్ర
‘రాజమహేంద్రవరం జైల్లో నన్ను చంపాలని చూశారు. డ్రోన్లు పంపి అనేక విధాలుగా ప్రణాళిక చేసినా ఎక్కడా జంకలేదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘విలాసమైన ప్యాలెస్లలో ఉండేందుకు అలవాటుపడిన వ్యక్తి జగన్. హైదరాబాద్, బెంగళూరు, ఇడుపులపాయ, తాడేపల్లి ప్యాలెస్తోపాటు ఇప్పుడు రుషికొండను బోడిగుండు చేసి ప్యాలెస్ నిర్మించుకున్నారు. దానికి రూ.500 కోట్లు వెచ్చించారు. టూరిజం రిసార్టు అన్నారు. ఇప్పుడు అందులో ఎవరైనా ఉండాలంటే రూ.కోటి ఇవ్వాలట. అంతపెట్టి ఎవరైనా ఉంటారా? రుషికొండను అనకొండలా కొట్టేశారు’ అని విమర్శించారు. జగన్, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి విశాఖలో రూ.40 వేల కోట్ల ఆస్తులను కొట్టేశారని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటన్నింటినీ తిరిగి ప్రజలకే పంచిపెడతానని చంద్రబాబు పేర్కొన్నారు.
నేడు అయిదు ప్రజాగళం సభలకు చంద్రబాబు
ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్నికల ప్రచారంలో తెదేపా అధినేత చంద్రబాబు దూసుకుపోతున్నారు. మార్చి 27న ‘ప్రజాగళం’ పేరుతో రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభించిన ఆయన ఇప్పటి వరకు 82 సభలు నిర్వహించారు. ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడనుండడంతో ఆయన మరింత దూకుడు పెంచారు. శుక్రవారం ఒక్క రోజే ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభల్లో ప్రసంగిస్తారు. శనివారం మరో మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ప్రచార గడువు ముగిసే నాటికి మొత్తం 90 నియోజకవర్గాల్లో ఆయన పర్యటన పూర్తికానుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.