4 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం
రాష్ట్రంలో మరో నాలుగు రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగనుందని సీఎం జగన్ అన్నారు. కర్నూలు వైఎస్సార్ సర్కిల్ సమీపంలో గురువారం ఏర్పాటుచేసిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో మాట్లాడారు.
కర్నూలు, కళ్యాణదుర్గం, రాజంపేట సభల్లో సీఎం జగన్
ఈనాడు, కర్నూలు: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగనుందని సీఎం జగన్ అన్నారు. కర్నూలు వైఎస్సార్ సర్కిల్ సమీపంలో గురువారం ఏర్పాటుచేసిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో మాట్లాడారు. పాఠశాలల్లో 30వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగాఉండగా ‘నాడు-నేడు’తో ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయని చెప్పుకొచ్చారు. ‘కర్నూలు నగర చిరంజీవి అభిమానులు’ పేరుతో కొందరు చిరంజీవి, జగన్ చిత్రాలతో ముద్రించిన కరపత్రాలను ముఖ్యమంత్రి సభలో పెద్దఎత్తున పంపిణీ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతోపాటు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్తో జగన్ ఉన్న ప్లకార్డులనూ సభలో ప్రదర్శించారు.
వివక్షకు తావులేకుండా డబ్బులిచ్చాం
ఈనాడు డిజిటల్, అనంతపురం: తమ ప్రభుత్వ హయాంలో రూ.2.70 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గురువారం నిర్వహించిన ప్రచార సభలో జగన్ ప్రసంగించారు. ‘‘విశ్వసనీయతకు అర్థం చెప్పిన పార్టీ వైకాపానే. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, ఆరో తరగతి నుంచే డిజిటల్ బోధన, 8వ తరగతి నుంచి ప్రతి విద్యార్థికి ట్యాబ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేశాం. గతంలోచదువులపై ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వం ఎప్పుడైనా చూశారా’ అని జగన్ ప్రశ్నించారు.
మద్యం మత్తులో వీరంగం
కర్ణాటక నుంచి తెప్పించిన మద్యం టెట్రా ప్యాకెట్లను కార్యకర్తలకు పంపిణీ చేశారు. మద్యం తాగి సభకు వచ్చిన వైకాపా కార్యకర్తలు వీరంగం సృష్టించారు. సీఎంతో ఫొటోలు దిగాలని బారికేడ్లను తోసేందుకు ప్రయత్నించారు. కొందరు బారికేడ్లు దూకి సీఎం బస్సువైపు దూసుకెళ్లారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన కానిస్టేబుళ్లపై దాడికి ప్రయత్నించారు. అప్పటికే సీఎం జగన్ ప్రసంగం ముగించుకుని హెలిప్యాడ్ వద్దకు వెళ్లిపోయారు.
ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం
ఈనాడు-కడప, న్యూస్టుడే-రాజంపేట: అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం జరగాలంటే మళ్లీ వైకాపాను గెలిపించాలని సీఎం జగన్ అన్నారు. ఇప్పటికే పింఛా ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తున్నాయని, గాలేరు-నగరి సుజల స్రవంతి పథకాన్ని పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో గురువారం జరిగిన బహిరంగసభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు రాజంపేట, మదనపల్లె, రాయచోటి వచ్చినప్పుడు జిల్లా కేంద్రాలుగా చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మూడు ప్రాంతాలకు జిల్లా కేంద్రాలు ఎలా ఇవ్వగలరని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వస్తే ప్రత్యేకహోదాపై మాట్లాడతారని ప్రజలు ఆశించారని.. కానీ వాళ్లు చంద్రబాబును పొగుడుతూ మనపై నాలుగు రాళ్లు వేసి వెళ్లిపోయారని విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.