icon icon icon
icon icon icon

YSRCP: పెనమలూరులో వైకాపా అభ్యర్థి జోగి రమేశ్‌ అనుచరుల వీరంగం

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని గంగూరులో వైకాపా అభ్యర్థి జోగి రమేశ్‌ అనుచరులు అరాచకం సృష్టించారు.

Updated : 09 May 2024 19:40 IST

పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని గంగూరులో వైకాపా అభ్యర్థి జోగి రమేశ్‌ అనుచరులు అరాచకం సృష్టించారు. గ్రామంలోని ఓ కాలనీలో చెట్లు, స్తంభాలకు కట్టిన తెలుగుదేశం జెండాలను పీకి గందరగోళం చేశారు. రెండ్రోజుల క్రితం తెదేపా అభ్యర్థి బోడె ప్రసాద్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాలనీ వాసులు వాటిని ఏర్పాటు చేశారు. గురువారం జోగి రమేశ్‌ తన ప్రచారంలో భాగంగా గ్రామానికి రాగా.. తెదేపా జెండాలను తీసేసి వాహనాల కింద, కాళ్ల కింద వేసి తొక్కుతూ వీరంగం వేశారు. ఇదేమిటని ప్రశ్నించేందుకు వెళ్లిన తెదేపా అభిమానులపై దాడులకు దిగారు. అదే సమయంలో అక్కడున్న పోలీసులు అదుపు చేయడంతో వెనక్కి తగ్గి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img