సైకిల్పై ఆఫీసుకు వెళ్లివచ్చేలా
ఇంటి నుంచి కార్యాలయాలకు సైకిల్పై రాకపోకలు సాగించేలా పౌరులను ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది. అందుకోసం ఐటీకారిడార్పై ఇంజినీర్లు ప్రముఖంగా దృష్టి పెట్టారు. వినియోగం, ఉపయోగం అంశాలను పరిగణనలోకి తీసుకుని..
90 కి.మీ పొడవున సైకిల్ ట్రాక్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ ప్రణాళిక
ఈనాడు, హైదరాబాద్: ఇంటి నుంచి కార్యాలయాలకు సైకిల్పై రాకపోకలు సాగించేలా పౌరులను ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది. అందుకోసం ఐటీకారిడార్పై ఇంజినీర్లు ప్రముఖంగా దృష్టి పెట్టారు. వినియోగం, ఉపయోగం అంశాలను పరిగణనలోకి తీసుకుని.. ఆ ప్రాంతంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. 2020 నవంబరులో కేబీఆర్ పార్కు, నెక్లెస్రోడ్డు, పలు గేటెడ్ కమ్యూనిటీలు, కొత్త రహదారులపై సైకిల్ ట్రాక్లు నిర్మించగా.. వేర్వేరు కారణాలతో ఆయా ఏర్పాట్లు నిరుపయోగమయ్యాయి. ఇప్పుడు.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని 12 ప్రాంతాల్లో 90 కిలోమీటర్ల పొడవు 2 మీటర్ల వెడల్పుతో కొత్త డిజైన్తో సైకిల్ ట్రాక్ నిర్మించేందుకు జీహెచ్ఎంసీ ఇంజినీర్లు సిద్ధమవుతున్నారు.
ఇతర వాహనాలు ప్రవేశించకుండా..
మూడేళ్ల క్రితం రహదారిపై కాలిబాట పక్కన సైకిల్ ట్రాక్లు నిర్మాణమయ్యాయి. నెక్లెస్రోడ్డుపై నాలుగు కిలోమీటర్ల మేర, కేబీఆర్ పార్కు చుట్టూ 1.2కి.మీ పొడవున, ఎల్బీనగర్ నుంచి చింతల కుంట వరకు, ఇతరత్రా ప్రాంతాల్లో ఏర్పాట్లు జరిగాయి. రోడ్డుపై కాలిబాట నుంచి 1.5మీటర్ల దారిని సైకిళ్ల కోసం కేటాయించి, ఆ స్థలాన్ని పసుపు రంగు గీతతో విభజించారు. గీత పొడవునా ప్రతి 100మీటర్లకు ఒక బోర్డును ఏర్పాటు చేసి, సూచించిన సమయాల్లో వాహనదారులు గీత లోపలికి ప్రవేశించవద్దని హెచ్చరించారు. వాహనదారులు మాత్రం హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోలేదు. కేబీఆర్ పార్కు వద్ద అయితే.. సైకిల్ ట్రాక్ను కార్లు, ఆటోల యజమానులు పార్కింగ్ కేంద్రంగా వాడుకున్నారు. అలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా జీహెచ్ఎంసీ కొత్త డిజైన్ను రూపొందించింది. సైకిల్ ట్రాక్ పొడవునా రోడ్డును విభజిస్తూ ఫైబర్ డబ్బాలు, దిమ్మెలతో విభాగిని నిర్మిస్తోంది. వర్షపునీరు అటు, ఇటు సాగిపోయేలా మధ్య మధ్యలో సందు వదులుతోంది. ఫలితంగా సైకిళ్లకు కేటాయించిన మార్గంలో ఇతర వాహనాలు ప్రవేశించే అవకాశం లేకుండా పోయింది. కొత్త తరహా ట్రాక్ను ఐటీ కారిడార్లోని గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్, నానక్రామ్గూడ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నామని జీహెచ్ఎంసీ చెబుతోంది.
ప్రధాన రహదారుల ఎంపిక..
ప్రధాన రహదారి వెడల్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రోడ్డు, కాలిబాట, సర్వీసు రోడ్డు, సైకిల్ ట్రాక్లను వరుసగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. అందుకుగాను జీహెచ్ఎంసీ 20 ప్రాంతాలను ఎంపిక చేసింది. ఐటీకారిడార్లోని పలు రోడ్డు మార్గాలతోపాటు, షేక్పేట రహదారి, ఎల్బీనగర్ కూడలి నుంచి విజయవాడ హైవే వైపు, నాగోల్, కామినేని కూడలి, ఉప్పల్, హబ్సిగూడ నుంచి మెట్టుగూడ వరకు, ఒవైసీ ఆసుపత్రి నుంచి ఆరాంఘర్ చౌరస్తా, తదితర రోడ్డు మార్గాలు జాబితాలో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?