Hyderabad: సినీ ఫక్కీలో భారీ మోసం.. రూ.10కోట్ల విరాళం ఇప్పిస్తామంటూ..

బంజారాహిల్స్‌లో సినీ ఫక్కీలో భారీ మోసం జరిగింది. స్వచ్ఛంద సంస్థకు ₹10కోట్ల విరాళం ఇప్పిస్తామంటూ గుంటూరుకు చెందిన ఓ వ్యక్తికి కొంతమంది దుండగులు  టోకరా వేశారు.

Updated : 28 May 2023 10:08 IST

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో సినీ ఫక్కీలో భారీ మోసం జరిగింది. స్వచ్ఛంద సంస్థకు రూ.10కోట్ల విరాళం ఇప్పిస్తామంటూ గుంటూరుకు చెందిన ఓ వ్యక్తికి కొంతమంది దుండగులు టోకరా వేశారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో రూం బుక్‌ చేసిన నిందితులు.. అతడిని అక్కడికి పిలిపించుకుని రూ.15లక్షల నగదుతో ఉడాయించారు. మోసపోయినట్లు గుర్తించిన సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు.. హోటల్‌ సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని