KCR: 18న భారాస కీలక సమావేశం.. ముఖ్య నేతలందరికీ ఆహ్వానం

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్‌లో భారాస అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.

Published : 16 Apr 2024 15:43 IST

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్‌లో భారాస అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థులకు ఆయన ‘బి ఫారాలు’ అందజేయనున్నారు. ఎన్నికల ఖర్చుకింద ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులు ఇవ్వనున్నారు. పార్టీ నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నారు. ఎంపీ అభ్యర్థులతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులను సమావేశానికి ఆహ్వానించనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. బస్సు యాత్ర రూట్‌మ్యాప్‌పై పార్టీ నేతలతో చర్చించనున్నారు. రైతుల వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకోవాలని భారాస నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని