ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
సీఎం రేవంత్రెడ్డి
మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి
నారాయణపేట, మద్దూరు, కోస్గి, న్యూస్టుడే: అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరులో జరిగిన కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. 2009లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మొదటిసారి 7500 మెజార్టీతో విజయం సాధించానని, ఇటీవలి ఎన్నికల్లో 33వేల మెజార్టీతో కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్రానికి సీఎంని అందించారని వ్యాఖ్యానించారు. డెబ్బై ఏళ్లుగా అభివృద్ధి పరంగా నియోజకవర్గానికి అన్యాయం జరిగిందన్నారు. 1967లో అచ్యుతారెడ్డి మంత్రిగా పనిచేశారని, గుర్నాథ్రెడ్డి, నందారం వెంకటయ్య పలుమార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసినా మంత్రి యోగం దక్కలేదన్నారు. ఆ లోటును భర్తీచేస్తూ సోనియాగాంధీ కొడంగల్కు పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు పదవులు ఇచ్చారన్నారు. గతంలో సాగు, తాగునీరు, పెట్టుబడుల విషయంలో వివక్షకు గురయ్యామన్నారు. కృష్ణా- వికారాబాద్ రైల్వేలైన్ ఏర్పాటు కాలేదన్నారు. చిన్న సీసీ రోడ్డు కావాలన్నా, మురుగు కాల్వలు కావాలన్నా..ఏపనికైనా హైదరాబాద్ వెళ్లి చేయిచాచే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు తాను పాలించే స్థాయిలో ఉన్నా బేషజాలకు పోకుండా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కొడంగల్ అభివృద్ధిని చూసి భారాస, భాజపాలు నాటకాలు ఆడుతున్నాయని, కొడంగల్ ప్రజలు వీరిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వంద రోజుల్లో రూ.5వేల కోట్ల నిధులు తీసుకువచ్చామన్నారు. పేట-కొడంగల్ పథకానికి అప్పట్లో సీఎం కిరణ్కుమార్రెడ్డి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ డీకే అరుణ అడ్డుపడ్డారని విమర్శించారు. ఆ పథకాన్ని ఇప్పుడు పట్టాలకెక్కిస్తే చూస్తూ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో పుట్టిపెరిగిన ఆమె అభివృద్ధి ఏం చేశారని సీఎం ప్రశ్నించారు.
ఓర్వలేక కుట్రలు
తొలినాళ్లలో పాలమూరుకు చెందిన బూర్గుల రామకృష్ణరావు సీఎం అయితే, 70 ఏళ్ల తర్వాత మరోసారి ఈ ప్రాంతీయుడికి అవకాశం వచ్చిందన్నారు. ఓర్వలేక కొందరు కుట్రలు, కుతంత్రాలు పన్నుతుంటే మీరందరూ చూస్తూ ఊరుకుంటారా? అని కార్యకర్తలను రేవంత్రెడ్డి ప్రశ్నించారు. అన్ని పార్టీలు జెండాలు పక్కనబెట్టి పాలమూరు అభివృద్ధికోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. నా బలగం, బంధువులు కొడంగల్ ప్రజలేనని..50వేల మెజార్టీ ఇవ్వాలని పిలుపునిచ్చారు. రాబోయే 20 రోజులు అత్యంత కీలకమని, రెండు విడతలుగా ప్రతికార్యకర్త ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించాలన్నారు. మహిళా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి ఓట్లు అడగాలని కోరారు.
మద్దూరులో సమావేశానికి హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలు
పోటీలో ఉన్నది రేవంత్రెడ్డే: వంశీచంద్
మహబూబ్నగర్ లోక్సభ స్థానం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధికి అన్ని విధాలా పాటుపడతానన్నారు. దిల్లీలో పాలమూరు గళం వినిపించి నిధులు తెస్తానన్నారు. ఒకప్పుడు పాలమూరు ప్రజలు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు పాలమూరు బిడ్డ రేవంత్రెడ్డిని ఆ రాష్ట్రాల నాయకులు ప్రచారానికి పిలిచే పరిస్థితి వచ్చిందన్నారు. ఇక్కడ పోటీ చేస్తున్నది రేవంత్రెడ్డి అని ప్రతికార్యకర్త గుర్తించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో తాండూరు, పరిగి ఎమ్మెల్యేలు మనోహర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, మాజీ ఎంఎల్సీ రాములునాయక్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, కొడంగల్ నియోజకవర్గం ఇన్ఛార్జి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
[ 03-05-2024]
శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
అమిత్ షా వీడియో మార్ఫింగ్ .. ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
[ 03-05-2024]
కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. -
ప్రభాకర్రావు కోసం పోలీసుల వేట .. అరెస్టు వారెంట్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్
[ 03-05-2024]
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. -
50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని దాటిన హైదరాబాద్ మెట్రో
[ 03-05-2024]
హైదరాబాద్ మెట్రో 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటింది. ఈ మేరకు ఎండీ ఎన్వీఎస్రెడ్డి వెల్లడించారు. -
శ్రీచైతన్య విద్యార్థులకు అభినందన సభ
[ 03-05-2024]
పదో తరగతి ఫలితాల్లో కొత్తపేట శ్రీచైతన్య విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. -
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
[ 03-05-2024]
జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. గతేడాది తాండూరులో ఏప్రిల్ మొత్తంగా ఆరు రోజులు మాత్రమే 40 నుంచి 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఓయో హోటల్లో అగ్నిప్రమాదం
[ 03-05-2024]
చైతన్యపురి మోహన్నగర్ వద్ద ఓయో హోటల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. -
పగలు భగభగలు.. రాత్రిపూట సెగలు
[ 03-05-2024]
మే నెల రాకతో ఎండలు మరింత ముదిరాయి. పగటిపూట భానుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. -
ఫేస్బుక్లో పరిచయం చేసుకొని.. పిస్తోల్ తెప్పించుకొని!
[ 03-05-2024]
ఫేస్బుక్ పరిచయం అతన్ని పిస్తోల్ తీసుకొచ్చేలా చేసింది. అక్రమంగా ఆయుధాలను విక్రయించి రూ.లక్షలు సంపాదించాలనుకున్న అతడు బాలానగర్ ఎస్వోటీ, జీడిమెట్ల పోలీసులకు చిక్కాడు. -
ప్రతి గడప ఎక్కాలి.. గెలుపు మాటే వినిపించాలి
[ 03-05-2024]
ప్రధాన పార్టీల నేతలు, అధినేతల ఆదేశాలతో నియోజకవర్గ స్థాయి నాయకులు ఒత్తిడిలో ఉన్నారు. -
ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు
[ 03-05-2024]
హైదరాబాద్ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. -
కమల దళం.. అధినేతల కదనోత్సాహం
[ 03-05-2024]
నగరంలో భాజపాకు మంచి పట్టుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లు కైవసం చేసుకుని సత్తాచాటిన భాజపా.. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి.. పలుచోట్ల రెండో స్థానంలో నిలిచింది. -
నేటి నుంచి తపాలా ఓటింగ్
[ 03-05-2024]
ఈనెల 13న జరగనున్న పోలింగ్ నేపథ్యంలో సరిగ్గా 10 రోజుల ముందు తపాలా ఓటు, ఇంటివద్ద ఓటు ప్రక్రియలు మొదలు కాబోతున్నాయి. -
యువత ఓటెత్తాలి
[ 03-05-2024]
నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. -
స్వతంత్రులు నామమాత్రమేనా..?
[ 03-05-2024]
ప్రతి ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థులు కనీస ప్రభావం చూపలేక పోతున్నారు. అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నా కొందరికి నోటాకు వచ్చిన ఓట్లు కూడా రావడం లేదు. -
అత్యధిక ఓటింగ్ నమోదైంది అప్పుడే!
[ 03-05-2024]
రాజధాని పరిధిలో ఇప్పటివరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది 1991లోనే. -
‘కాంగ్రెస్ వైపే బలహీన వర్గాలు’
[ 03-05-2024]
దళితుల అభ్యున్నతి, సాధికారతకు కృషి చేస్తున్న కాంగ్రెస్కు తమ మద్దతు ఉంటుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, మాల ప్రజా సంఘాల ఐకాస ఛైర్మన్ జి.చెన్నయ్య పేర్కొన్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న బడేభాయ్, చోటాభాయ్: కేటీఆర్
[ 03-05-2024]
అమలు కాని హామీలతో బడే భాయ్ మోదీ, చోటాభాయ్ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీ రామారావు విమర్శించారు. -
చేవెళ్ల.. అభిమానం నిలువెల్లా
[ 03-05-2024]
చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి లింగంపల్లి ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఓటర్లు భిన్నం.. ఓటింగ్ విభిన్నం
[ 03-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు విలువైనది. కొన్ని సందర్భాల్లో ఒక్క ఓటు కూడా కీలకంగా మారుతుంది. -
ఉత్కంఠ పోరులో ఆధిక్యాలు స్వల్పమే
[ 03-05-2024]
రాజధాని పరిధిలో ఇప్పటి వరకు జరిగిన ఎంపీ ఎన్నికల్లో అత్యల్ప మెజార్టీ నమోదైంది హైదరాబాద్లోనే. -
పేద విద్యార్థులకు సహకారం ప్రశంసనీయం
[ 03-05-2024]
చారిత్రక నేపథ్యం కలిగిన రాజ్బహదూర్ వెంకట్రామ్రెడ్డి వసతి గృహ నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు అభినందనలు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి అన్నారు. -
అంధులు.. చదరంగంలో ఎత్తులు
[ 03-05-2024]
దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్ ఆధ్వర్యంలో బేగంపేట లోని దేవనార్ పాఠశాలలో ఫిడే రేటింగ్ జాతీయ ఓపెన్ చదరంగం పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. -
‘బీసీ రిజర్వేషన్లు ఎత్తేసేందుకు భాజపా కుట్ర’
[ 03-05-2024]
బీసీ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కుట్రజేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. -
కాంగ్రెస్లో చేరిన గ్రేటర్ హైదర్బాద్ మాజీ అధ్యక్షుడు కట్టెల
[ 03-05-2024]
గ్రేటర్ హైదరాబాద్ భారాస మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్యాదవ్ గురువారం సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. -
ఇంటినుంచే ఓటు..ఇక్కట్లకు లేదు చోటు
[ 03-05-2024]
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలనేది ఎన్నికల సంఘం ఉద్దేశం. గతంలో పోలింగ్ కేంద్రానికి రాలేని స్థితిలో ఉన్న వారు ఓటు వేసేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చేది. -
కాంగ్రెస్తోనే ముదిరాజ్లకు గుర్తింపు: రంజిత్రెడ్డి
[ 03-05-2024]
కాంగ్రెస్ పార్టీతోనే ముదిరాజ్లకు సరైన గుర్తింపు లభిస్తుందని చేవెళ్ల లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి తెలిపారు. -
ఎంఎన్జేలో రొమ్ము పునర్ నిర్మాణ శస్త్రచికిత్సలు విజయవంతం
[ 03-05-2024]
మారిన జీవన విధానం, అహారపు అలవాట్ల కారణంగా చాలా మంది క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. -
హెచ్ఎండీఏలో మరో అవినీతి తిమింగలం!
[ 03-05-2024]
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)లో మరో కీలకాధికారి చుట్టూ అవినీతి నిరోధక శాఖ ఉచ్చు బిగుస్తోంది. -
వైద్య పరీక్షలకు గర్భవిచ్ఛిత్తి చేసుకున్న బాలిక
[ 03-05-2024]
పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీ కొని గుర్తు తెలియని 28 ఏళ్ల వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ రైల్వేస్టేషన్లో బుధవారం అర్ధరాత్రి తరువాత జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?