logo

యానిమేషన్‌ సినీ కథా రచయిత ఆత్మహత్య

అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్‌ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్‌ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 24 Apr 2024 04:48 IST

లలిత సాయి ప్రశాంత్‌

రాయదుర్గం, న్యూస్‌టుడే: అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్‌ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్‌ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన యానిమేషన్‌ సినిమా కథ రచయిత దాసరి లలిత సాయి ప్రశాంత్‌(45) మణికొండ పంచవటి కాలనీలో నివసిస్తున్నాడు. అవివాహితుడైన ఆయన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం బంధువులు ఫోన్‌ చేయగా ఆయన ఇంతకీ సమాధానం ఇవ్వలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి చెప్పారు. వారు ఆయన గదికి వెళ్లి చూసేసరికి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు. వారు రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. గదిలో పోలీసులు ఓ లేఖ స్వాధీనం చేసుకున్నారు. ‘తన ఆరోగ్యం బాగాలేదని, వైద్యం కోసం చేసిన అప్పులు తీర్చలేకపోతున్నందుకు తనువు చాలిస్తున్నానని, తన మృతికి ఎవరు కారణం కాదు’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు