25న వివాహం...అంతలోనే ప్రియుడు ఆత్మహత్య
ఓ మహిళతో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. 25న వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకోగా సోమవారం పెళ్లికొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో
విషయం తెలిసి ప్రియురాలూ ఆత్మహత్యాయత్నం
విజయ్కుమార్(పాత చిత్రం)
రాజేంద్రనగర్, న్యూస్టుడే: ఓ మహిళతో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. 25న వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకోగా సోమవారం పెళ్లికొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్వేత తెలిసిన వివరాల మేరకు...వైయస్ఆర్ జిల్లా కొండాపురానికి చెందిన విజయ్కుమార్ (40)కు 15 సంవత్సరాల కిందట వివాహం అయ్యింది. అదే జిల్లాలో స్టేషన్మాస్టర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా భార్యతో దూరంగా ఉంటున్నాడు. నగరంలోని టప్పచపుత్రా ప్రాంతంలో నివాసం ఉండే ఓ మహిళను గత ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. సంవత్సర కాలంగా వీరిద్దరూ రాజేంద్రనగర్ ఉప్పర్పల్లిలోని ఓ అపార్ట్మెంట్లో సహజీవనం చేస్తున్నారు. ఈ నెల 25న వివాహం చేసుకోవాలని నెలరోజుల కిందటే నిర్ణయం తీసుకున్నారు. అయితే..వారం రోజుల క్రితం విజయ్కుమార్ సదరు మహిళకు చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంతో ఆమె టప్పచపుత్రా ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసును రాజేంద్రనగర్ ఠాణాకు బదిలీ చేశారు. రాజేంద్రనగర్ పోలీసులు ఆదివారం విజయ్కుమార్, సదరు మహిళను ఠాణాకు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి పంపించారు. సోమవారం పెళ్లికి సంబంధించిన దుస్తులు తెచ్చుకోవడానికి సదరు మహిళ వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న విజయ్కుమార్ కాబోయే భార్యకు ఫోన్ చేసి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. వెంటనే మహిళ ఇంటికి చేరుకుంది. కానీ అప్పటికే విజయ్కుమార్ మృతిచెందాడు. దీంతో మహిళ ఖైరతాబాద్ సమీపంలో ఎంఎంటీఎస్ రైలు కిందపడి చనిపోవాలని పట్టాలపై పడుకుంది. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఫోన్ సిగ్నల్స్ ద్వారా గుర్తించి కాపాడినట్లు ఎస్సై శ్వేత తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులంతా వైయస్ఆర్ జిల్లాకు చెందిన వారు కావడంతో అతడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
[ 07-05-2024]
రాజంపేట పార్టమెంటు పరిధిలో పెద్దిరెడ్డి రాజ్యం అమల్లో ఉందని మాజీ సీఎం, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు. ఇక్కడ జరిగే దోపిడీలు, దౌర్జన్యాలు, వైకాపా నాయకుల పాపాలకు ఆ పెద్దిరెడ్డే కారకుడని ఆరోపించారు. -
సీఎం జగన్ కంచుకోటలో ఎందుకీ కలవరం?
[ 07-05-2024]
సీఎం జగన్కే కాదు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాం నుంచి వారి కుటుంబానికి పులివెందుల కంచుకోట. ఓట్లు అడగకపోయినా ప్రతి ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో ప్రజలు వారికి బ్రహ్మరథం పడుతున్నారు. -
రాజోలి అన్నావ్.. జోలాలి పాడావ్!
[ 07-05-2024]
మాట తప్పను..మడమ తిప్పను అని సీఎం జగన్ తరచూ అంటుంటారు. రాజోలి ఆనకట్ట విషయంలో ఆయన మాట తప్పారు, మడమ తిప్పారు... రైతుల ప్రయోజనాలకు గండి కొట్టారు. సీఎం జగన్ మన జిల్లా వాసే కదా ఆయన ఏదైనా శంకుస్థాపన చేస్తే అమలవుతుందని మొదట్లో ప్రజలు నమ్మారు. -
రాక్షస రాజ్యం!
[ 07-05-2024]
దుష్టులకు అవకాశమిస్తే ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడతారో ప్రత్యక్ష సాక్ష్యం ఈ నియోజకవర్గం. ఇక్కడ గత ఐదేళ్లుగా అరాచకం రాజ్యమేలుతోంది. తమ వ్యతిరేకులను రాచిరంపాన పెట్టే పెడపాలనతో వైకాపా నేతలు చెలరేగిపోతున్నారు. వైకాపా దత్తపుత్రులైన ఖాకీల పెద్ద మనుషులు నేతల అరాచకకాండకు నిర్లజ్జగా సహకరిస్తున్నారు. -
బోరుమంటున్న జగన్ హామీ!
[ 07-05-2024]
వ్యవసాయ ఉత్పాదకత పెంపులో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు ఆసరాగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బోర్లు వేయడంతో పాటు, మోటారు, పైపులు, విద్యుత్తు నియంత్రికలు ఏర్పాటు చేయిస్తామని సీఎం జగన్ గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. -
150 స్థానాల్లో కూటమి విజయం ఖాయం
[ 07-05-2024]
ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో కూటమి 150 అసెంబ్లీ స్థానాల్లో గెలవడం ఖాయమని, ముస్లిం మైనార్టీలు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి వారి విజయానికి సహకరించాలని ఎమ్మెల్సీ, విశ్రాంత ఐజీ ఇక్బాల్ పేర్కొన్నారు. -
పోస్టల్ బ్యాలట్లో గందరగోళం!
[ 07-05-2024]
జిల్లాలో రెండో రోజైన సోమవారం కూడా పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. పలుచోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రాలకు అధికారులు పంపిన ఓటర్ల జాబితాలో చాలా మంది ఉద్యోగుల పేర్లు లేకపోవడం, -
రెండో రోజు ప్రశాంతంగా పోస్టల్ బ్యాలట్ పోలింగ్
[ 07-05-2024]
జిల్లాలో రెండోరోజు సోమవారం పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో 934 మంది ఉద్యోగులకు గాను 511 మంది ఓటేశారు. -
జగన్ హామీలు... నీటిపై రాతలు
[ 07-05-2024]
జిల్లాలో వైకాపాకు పులివెందుల తర్వాత బద్వేలు నియోజక వర్గంలోనే అత్యధికంగా ఆదరిస్తారు. అందులో అట్లూరు మండలం మరింత ఎక్కువని ఎమ్మెల్యే సుధ పలు కార్యక్రమాల్లో ప్రస్తావించారు. -
పోస్టల్ బ్యాలట్కు అధికార పార్టీ నగదు బదిలీ
[ 07-05-2024]
నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు సోమవారం జరిగిన పోలింగ్లో 867 ఓటర్లకు 701 మంది హాజరయ్యారు. ఓటు వేసేందుకు వచ్చిన కొందరు అధికారులు ఎన్నికల విధులకు సంబంధించి ప్రోసీడింగ్ కాపీలు తీసుకు రాకపోవడంతో వెనక్కి పంపారు. -
వైకాపాను గెలిపిస్తే అభివృద్ధి పాతాళానికే!
[ 07-05-2024]
వైకాపాను మళ్లీ గెలిపించుకుంటే మదనపల్లె నియోజకవర్గం 20 ఏళ్లు అభివృద్ధిలో వెనక్కు వెళ్లిపోతోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్కుమార్రెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్