సింగరేణి యాజమాన్యం అప్రమత్తం
సింగరేణిలో ఒకేరోజు భారీఎత్తున కేసులు పెరిగాయి. రామగుండం రీజియన్లో 151 కేసులు నమోదయ్యాయి. రెండు రోజులుగా సెలవులు కావడంతో కరోనా పరీక్షలు నిర్వహించలేదు. శనివారం సంక్రాంతి పండగ, ఆదివారం సెలవు కావడంతో రెండు రోజులు కొవిడ్ పరీక్షలను సింగరేణి ఆస్పత్రుల వద్ద నిర్వహించలేదు.
న్యూస్టుడే, గోదావరిఖని
సింగరేణిలో ఒకేరోజు భారీఎత్తున కేసులు పెరిగాయి. రామగుండం రీజియన్లో 151 కేసులు నమోదయ్యాయి. రెండు రోజులుగా సెలవులు కావడంతో కరోనా పరీక్షలు నిర్వహించలేదు. శనివారం సంక్రాంతి పండగ, ఆదివారం సెలవు కావడంతో రెండు రోజులు కొవిడ్ పరీక్షలను సింగరేణి ఆస్పత్రుల వద్ద నిర్వహించలేదు. సోమవారం ఒక్కరోజే 151 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. 322 మందికి పరీక్షలు నిర్వహించగా 151 మందికి పాజిటివ్గా నమోదయ్యాయి. అంటే 50 శాతం కేసులు నమోదయ్యాయి. రానున్న కాలంలో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉండటంతో సింగరేణి యాజమాన్యం అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆస్పత్రుల్లో పడకలతో పాటు కిట్లు, మందులను సమకూర్చుకుంటోంది. ప్రస్తుతం మూడో దశ మార్గదర్శకాల ప్రకారం నివారణ చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం సింగరేణివ్యాప్తంగా అన్ని ప్రాంతాల జీఎంలతో పాటు ఆస్పత్రి సూపరింటెండెంట్లు, పర్సనల్ విభాగాల అధికారులతో దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించింది. ఇందులో ప్రాంతాల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. మార్గదర్శకాలు పాటించాలని వెల్లడించారు.
913 యాక్టివ్ కేసులు
సింగరేణిలో ప్రస్తుతం 913 యాక్టివ్ కేసులున్నాయి. సింగరేణివ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మొత్తం 913 యాక్టివ్ కేసుల్లో 382 మంది ఉద్యోగులు, 415 మంది వారి కుటుంబ సభ్యులు, 116 మంది పొరుగు సేవల సిబ్బంది క్వారంటైన్లో ఉన్నారు. ఇప్పటికే సింగరేణివ్యాప్తంగా ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు, పొరుగు సేవల సిబ్బందికి 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయడంతో ప్రభావం గత ఏడాదితో పోల్చితే తగ్గింది. అయినా కరోనా విస్తరించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యాజమాన్యం అప్రమత్తమైంది.
వారం రోజులే క్వారంటైన్
కరోనా వచ్చిన ఉద్యోగులకు వారం రోజుల వరకు క్వారంటైన్ సమయం కేటాయించింది. గతంలో 14 రోజులు సెలవులు మంజూరు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 7 రోజులు మాత్రమే కేటాయించనున్నారు. మూడో దశ కరోనా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సడలించిన నేపథ్యంలో ఏడు రోజుల ఐసొలేషన్ తర్వాత తిరిగి కరోనా పరీక్షలు లేకుండానే విధులకు అనుమతించనున్నారు. గతంలో నెగెటివ్ రిపోర్టుతో వెళ్తేనే విధుల్లోకి తీసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం మూడో దశ ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఐసోలేషన్ అనంతరం ఎలాంటి కరోనా పరీక్షలు లేకుండానే విధులకు హాజరుకావచ్ఛు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్