అటు చదువు.. ఇటు ఆటలు
ఆటపై ఉన్న ఆసక్తి పలు విజయాలకు నాంది పలుకుతోంది. జిల్లా స్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో సత్తా చాటారు.. అదే ఉత్సాహంతో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనున్నారు. వీరంతా సబ్జూనియర్, జూనియర్ విభాగంలో
బాల్బ్యాడ్మింటన్లో ప్రతిభ
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
న్యూస్టుడే, మార్కండేయకాలనీ
బాల్బ్యాడ్మింటన్ ఆడుతున్న క్రీడాకారులు
ఆటపై ఉన్న ఆసక్తి పలు విజయాలకు నాంది పలుకుతోంది. జిల్లా స్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో సత్తా చాటారు.. అదే ఉత్సాహంతో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనున్నారు. వీరంతా సబ్జూనియర్, జూనియర్ విభాగంలో క్రీడా పోటీల్లో చురుగ్గా పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. అటు చదువు.. ఇటు క్రీడల్లో ఏమాత్రం తీసిపోకుండా రాణిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందినవారంతా.. ఇంట్లో తల్లిదండ్రుల ప్రోత్సాహం.. శిక్షకుల సహకారంతో బాల్బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో రాణిస్తున్నారు. గోదావరిఖని పవర్హౌజ్కాలనీలో జిల్లా స్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీలు ఇటీవల నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు హాజరై పోటీల్లో పాల్గొన్నారు. శ్రీనివాస్, అశోక్, జోన్స్వర్షిత్, మహేందర్, రత్నాకుమార్, లిఖిత్కృష్ణ, తిరుపతి, అంజి, గణేష్, చందు, జాయిస్అభిషేక్ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. ఈ క్రీడాకారులు త్వరలో హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.
ఎనిమిది సార్లు పతకాలు - జోన్స్వర్షిత్, డిగ్రీ విద్యార్థి
ఏడో తరగతి నుంచి బాల్బ్యాడ్మింటన్ క్రీడను ఎంచుకొని సాధన మొదలుపెట్టాను. శిక్షకుల మార్గదర్శకంలో ఇప్పటివరకు రాష్ట్రస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో ఎనిమిది సార్లు పాల్గొని నాలుగు వెండి పతకాలు సాధించాను. అదే విధంగా జాతీయ స్థాయి పోటీలు తమిళనాడు ఈ-రోడ్లో జరిగిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ధ్రువపత్రం అందుకున్నా.. ఇటీవల జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి హైదరాబాద్ వనస్థలిపురం క్రీడా మైదానంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించనున్నా..
పాఠశాల దశ నుంచే శిక్షణ - లిఖిత్కృష్ణ, డిప్లొమా విద్యార్థి
గోదావరిఖని పవర్హౌజ్కాలనీలో జరిగిన బాల్బ్యాడ్మింటన్ జిల్లా ఎంపిక ప్రక్రియలో ప్రతిభచాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాను. క్రీడలంటే చాలా ఇష్టం.. అందుకే ఎంత కష్టమైనా సమయాన్ని ఎక్కువగా క్రీడలకు కేటాయిస్తున్నా.. ఈ మాసంలో నిర్వహించే రాష్ట్రస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో పాలొననున్నాను. క్రీడల్లో చురుగ్గా ఉన్నానని శిక్షకులు నాపై దృష్టి సారించి మెలకువలు చెబుతున్నారు. పాఠశాల స్థాయి నుంచి బాల్బ్యాడ్మింటన్ శిక్షణ పొందుతున్నా. గతంలో కేరళ త్రిశూర్లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ధ్రువపత్రం అందుకున్నా.. జెన్కోలో ఉద్యోగం సాధించాలన్నదే లక్ష్యం.
మెకానికల్ ఇంజినీర్ లక్ష్యం -పి.జాయిస్అభిషేక్, డిప్లొమా విద్యార్థి
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా చదువుతున్నా.. మెకానికల్ ఇంజినీర్ కావాలన్నదే లక్ష్యం.. ప్రస్తుతం ఖాళీ సమయాన్ని క్రీడలపై దృష్టి సారించా. క్రీడల్లో బాల్బ్యాడ్మింటన్ను ఎంచుకున్నా. ఇప్పటి వరకు ఖమ్మం, మెదక్ జిల్లాలో జరిగిన సబ్జూనియర్ విభాగం పోటీల్లో ప్రతిభ కనబరిచి వెండి పతకాలు సాధించా. బోనకల్లో జరిగిన అండర్-19 బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచా. కేరళలో నిర్వహించిన జాతీయ స్థాయి సబ్ జూనియర్ విభాగంలో ప్రతిభ కనబరిచి ధ్రువపత్రం అందుకున్నా. మరింత సాధన చేసి అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని ప్రతిభ చాటుతాననే నమ్మకం నాకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్