బడి బయటి పిల్లలు ఎందరు?
బడికెళ్లాల్సిన పిల్లలు పేదరికంతో పనుల్లో మగ్గుతున్నారు. ఇటుక బట్టీలు, కార్ఖానాల్లో బాల్యం మసక బారుతోంది. బడి ఈడు పిల్లలు చదువులకు దూరమవుతుండటంతో భవిత అయోమయంగా మారింది. విద్యాహక్కు
జిల్లాలో కొనసాగుతున్న సర్వే..
26లోపు తుది జాబితా ఖరారు
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్
పెద్దపల్లిలో సర్వే చేస్తున్న సీఆర్పీ
బడికెళ్లాల్సిన పిల్లలు పేదరికంతో పనుల్లో మగ్గుతున్నారు. ఇటుక బట్టీలు, కార్ఖానాల్లో బాల్యం మసక బారుతోంది. బడి ఈడు పిల్లలు చదువులకు దూరమవుతుండటంతో భవిత అయోమయంగా మారింది. విద్యాహక్కు చట్టం ప్రకారం బడి వయసు పిల్లలను పాఠశాలలో చేర్పించడం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా నిర్బంధ విద్యను విద్యాశాఖ అమలు చేస్తోంది.
ఇందులో భాగంగా బడి బయటి పిల్లలను గుర్తించే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. క్షేత్ర స్థాయిలో సీఆర్పీలు, ఐఆర్పీలు సర్వేలో భాగస్వాములవుతున్నారు. సిబ్బంది ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్తూ 28 అంశాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఈ నెల 26లోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. సమయం తక్కువగా ఉండటంతో గడువులోగా పూర్తి చేసేందుకు సర్వేలో వేగం పెంచారు. ఇందులో తేలిన విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేయనున్నారు. అయితే కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో సిబ్బంది జంకుతున్నారు.
మసక బారుతున్న బాల్యం
ఆర్థిక సమస్యలు, నిరక్షరాస్యత నేపథ్యంలో బడి ఈడు పిల్లలు చాలా మంది చదువుకు దూరంగా ఉంటున్నారు. పాఠశాలలకు వెళ్లాల్సిన వయసులో వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. ఉపాధ్యాయులు తాము పని చేసే పాఠశాలల పరిధిలో బడి బయటి పిల్లల ఇళ్లకు వెళ్లి పంపించాలని ఒత్తిడి తీసుకొచ్చినా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా చాలా మంది బాలికలు ఇంటి వద్దే ఉంటున్నారు. సర్వేలో భాగంగా బడిఈడు పిల్లలు, దివ్యాంగ పిల్లలను వేర్వేరుగా గుర్తిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 19 మంది ఐఆర్పీలు, 51 మంది సీఆర్పీలు పరిశీలనలో పాల్గొంటున్నారు. అధికారుల సర్వేతో బడిఈడు పిల్లల సంఖ్య పక్కాగా తేలనుంది.
వలస కూలీలే అధికం
జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగిరి, మంథని మండలాల్లో ఎక్కువగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. వీటిలో ఒడిశా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాది కుటుంబాలు వలస వచ్చాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతం, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని పట్టణాల్లో బాలకార్మికుల సంఖ్య అధికంగా ఉంది. గతేడాది 300కు పైగా బాలకార్మికుల సంఖ్య తేలింది. ఈ సారి పిల్లల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
28 అంశాలతో సమాచార సేకరణ
* బడి బయటి పిల్లల సమాచారాన్ని 28 అంశాలతో సేకరిస్తున్నారు. ఇప్పటికే పాఠశాలల్లో ఇలాంటి పిల్లలతో కూడిన వివరాల జాబితా ఉన్నాయి. ఈ జాబితా వెంట తీసుకొని సిబ్బంది ఇంటింటి పరిశీలన నిర్వహిస్తున్నారు.
* విద్యార్థి పేరు, ఆధార్ సంఖ్య, పుట్టిన తేదీ, వయసు, చరవాణి, కుటుంబ సభ్యుల జీవనాధారం, స్వశక్తి సంఘంలో సభ్యులుగా ఉన్నారా? కులం, విద్యాస్థితి? ఏ తరగతిలో బడి మానేశారు? వలస వచ్చిన వారా? తదితర వివరాలను సేకరిస్తున్నారు. ః దివ్యాంగులైన బడి బయటి పిల్లలను గుర్తించడానికి ఐఆర్పీలు సర్వే నిర్వహిస్తున్నారు. ఇటుక బట్టీలు, కార్మిక వాడలు, పరిశ్రమలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సీఆర్పీలు పర్యటిస్తున్నారు. ప్రధానోపాధ్యాయుల సహకారంతో సర్వే సాగుతోంది.
* జిల్లాలో క్షేత్ర స్థాయిలో గుర్తించిన పిల్లల వివరాలతో మండల స్థాయిలో జాబితా రూపొందిస్తున్నారు. ఈ జాబితాను మరోసారి పరిశీలించి తప్పులుంటే సవరిస్తారు. ఈ నెల 26లోగా విద్యాశాఖ రూపొందించిన ‘ప్రబంధ్’ పోర్టల్లో నమోదు చేయనున్నారు.
పకడ్బందీగా సర్వే నిర్వహణ: విజయ్కుమార్, సమగ్ర శిక్ష జిల్లా సమన్వయకర్త
జిల్లాలో సీఆర్పీలు, ఐఆర్పీలు వేర్వేరుగా సర్వే నిర్వహిస్తున్నారు. పాఠశాలకు దూరంగా ఉండే పిల్లల గుర్తింపులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పరిశీలన జరపాలని ఆదేశించాం. పల్లెలు, పట్టణాల్లో సిబ్బంది పకడ్బందీగా సర్వే చేస్తున్నారు. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
82 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా శుక్రవారం నామపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించి 34 మందివి తిరస్కరించి, 82 మందివి ఆమోదించారు. -
గ్యారంటీలను అమలు చేస్తాం : మంత్రి పొన్నం
[ 27-04-2024]
‘పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ సవాల్ విసిరారు. -
అభ్యర్థులను చూసి ఓటు వేయండి
[ 27-04-2024]
కాంగ్రెస్, భారాసలకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యం
[ 27-04-2024]
జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క పని కూడా కాలేదని, అభివృద్ధి జరగాలంటే గులాబీ జెండా ఎంపీ అవసరమని కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
వేసవి వేళ.. ఆటల వేడుక
[ 27-04-2024]
వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడితో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఊపిరి పీల్చుకుంటారు. -
బొగ్గు బాయిల చుట్టూ రాజకీయం
[ 27-04-2024]
ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికల వేళ నగదు కష్టాలు
[ 27-04-2024]
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. -
నారీమణులే నిర్ణేతలు
[ 27-04-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది. -
ఇంటి నంబర్ల గోల్మాల్!
[ 27-04-2024]
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. -
భానుడి భగభగ...
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 27-04-2024]
ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. -
పశుపక్షాదుల దాహం తీర్చేలా..
[ 27-04-2024]
వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
[ 27-04-2024]
ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
[ 27-04-2024]
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
అడవిని మింగేస్తున్న అనకొండలు
[ 27-04-2024]
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. -
కబ్జాల పర్వం!
[ 27-04-2024]
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. -
మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు
[ 27-04-2024]
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ సదుపాయం.. వినియోగానికి దూరం
[ 27-04-2024]
ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. -
హరిత లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం
[ 27-04-2024]
పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.