పనుల్లో నిర్లక్ష్యం.. నాణ్యత గగనం..!
రైల్వే క్రాసింగ్ల వద్ద జరుగుతున్న వివిధ ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా రైల్వేశాఖ రద్దీ ప్రదేశాల్లో రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ)లను నిర్మిస్తోంది. కాజీపేట నుంచి బల్లార్షా మార్గంలో రైల్వే ఇంజినీరింగ్ శాఖ నిర్వహణ చేపడుతోంది.
రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణాల్లో లోపాలు
జలాశయం కాదిది.. ఉప్పరపల్లి రైల్వే అండర్బ్రిడ్జి మార్గం
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి: రైల్వే క్రాసింగ్ల వద్ద జరుగుతున్న వివిధ ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా రైల్వేశాఖ రద్దీ ప్రదేశాల్లో రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ)లను నిర్మిస్తోంది. కాజీపేట నుంచి బల్లార్షా మార్గంలో రైల్వే ఇంజినీరింగ్ శాఖ నిర్వహణ చేపడుతోంది. ప్రధానంగా ఈ ఆర్యూబీల ఉద్దేశం గేట్మెన్ల అవసరం లేకుండా, ఆటోమేటిక్ గేట్లు ఎత్తివేసి రైళ్ల రాకపోకలు సజావుగా సాగేలా చేపట్టడమే. ఈ లక్ష్యానికి అధికారులు, గుత్తేదారులు తూట్లు పొడిచే విధంగా నిర్మాణాలు నాణ్యత లేకుండా చేపడుతున్నారనే విమర్శలు వ్యక్త మవుతున్నాయి. జిల్లాలో పెద్దంపేట, రామగుండం జంక్షన్, రాఘవపురం, పెద్దపల్లి జంక్షన్, కొత్తపల్లి, కొలనూర్, ఓదెల, పొత్కపల్లి పరిధిలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఓదెల మండలంలోని కొత్తపల్లి, ఉప్పరపల్లి, హరిపురం గ్రామాల్లో ఆర్యూబీలు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణ నాణ్యత లోపభూయిష్టంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. నిర్మించకముందే నీటిలో మునిగాయి. సరైన సిమెంట్, ఇసుక, కంకర మిశ్రమాలు తయారుచేసి గోడలను నిర్మించకపోవడంతో అప్పుడే పగుళ్లు కనిపిస్తున్నాయి. భారీ వర్షాల మూలంగా ఆర్యూబీల మార్గాలన్నీ జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. సిమెంట్ దిమ్మెలు అందులో మునిగిపోయి శిథిలమైపోతున్నాయి. ఇప్పటికైనా రైల్వే అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని, గుత్తేదారులతో నాణ్యమైన పనులు చేయించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఆర్యూబీల్లోనూ మైనస్ టెండర్..?
ఉప్పల్ ఆర్వోబీ విషయంలో కొందరు అధికారులు, గుత్తేదారులు కుమ్మకై ప్రాజెక్టు ఆకృతిని మార్చి మైనస్ టెండరింగ్కు పాల్పడ్డారనే అభియోగాలతో ఏకంగా సీబీఐ చేతికి సదరు అధికారి చిక్కారు. తక్కువ కోట్ చేసినవారికే రైల్వే పనులు అప్పగిస్తుండగా ఇక్కడే అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్యూబీల్లోనూ మైనస్ టెండర్స్ జరిగి ఉంటాయని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపల్లి నుంచి కొత్తపల్లి వెళ్లే మార్గంలో నిర్మాణ దశలో నిండిన వర్షపునీటిని మోటార్లతో తోడేస్తున్న దృశ్యం
పట్టాలపై రద్దీ నివారణ.. గేట్మెన్ రహిత వ్యవస్థ
పట్టాలపై రద్దీ నివారించేందుకు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆర్వోబీ, తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆర్యూబీలను రైల్వేశాఖ నిర్మించ తలపెట్టింది. రైల్వే శాఖ గతంలో బడ్జెట్లో ప్రస్తావించిన గేట్మెన్ రహిత రైల్వే ట్రాఫిక్ రద్దీ ఏర్పాటు చర్యలను ముమ్మరం చేయడంలో భాగంగానే ఈ పనులు నిర్వహిస్తున్నారు. గేట్మెన్లు, అడుగడుగునా ఆటోమేటిక్ రైల్వే గేట్ లాకింగ్ సిస్టం లేకుండానే రైల్వేతో పాటు వాహనాల రాకపోకలు ఎక్కడా స్తంభించకుండా చేసేందుకు వీటి నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
* పెద్దపల్లి జిల్లా కేంద్రంగా మారినప్పటి నుంచి వ్యవసాయ, ఇసుక, బియ్యం, ఇతరత్రా ముడిసరకుల కోసం రాకపోకలు సాగించే భారీ వాహనాలతో రద్దీ పెరిగిపోతుంది. దీంతో రైల్వే, ర.భ.స శాఖలు రూ.200 కోట్ల ఖర్చు అంచనాతో అవసరమైన ఆర్వోబీలు, ఆర్యూబీలు నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి.
అవినీతి అధికారుల వెన్నులో వణుకు
ఇప్పటికే ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్న ఆర్వోబీ డిజైన్ మార్పుకు గుత్తేదారు వద్ద నుంచి రూ.10 లక్షల లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏకంగా సీబీఐకి దొరికారు. ఈ ఘటన మరవకముందే హైదరాబాద్లోని తార్నాకలో ఓ రైల్వే గుత్తేదారు ఇంటిపై ‘ఈడీ’దాడులు రైల్వేశాఖలోనే సంచలనంగా మారింది. రైల్వే పనుల నకిలీ బిల్లుల వ్యవహారం ఒకొక్కటి బయటపడుతుండటంతో రైల్వే అధికారుల వెన్నులో వణుకు పుడుతోంది.
* కాజీపేట-బల్లార్షా మూడోలైన్ నిర్మాణానికి సంబంధించి గుత్తేదారుల బిల్లులు చెల్లించడం, ప్రతిపాదనలు, పర్యవేక్షణల కోసం ప్రత్యేకంగా రామగుండం, పెద్దపల్లి, ఓదెల, కొత్తపల్లి ప్రాంతాల్లో కార్యాలయాలు నిర్మించారు. నిబంధనల ప్రకారం జరిగాయా? లేదా ఇంకేమైనా మార్పులు జరిగాయా? అన్న వివషయమై రైల్వే ఉన్నతాధికారులు త్వరలో ఈ కార్యాలయాల్లోని రికార్డులను ఆకస్మికంగా తనిఖీలు చేయనున్నట్లు సమాచారం అందడంతో అధికారుల గుండెల్లో దడ మొదలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM