ఉద్యోగాల పేరిట వల
సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు కల్పించేందుకు దళారులు దందా మొదలుపెట్టారు. సింగరేణి విస్తరించిన ఉన్న ఆరు జిల్లాల్లో దళారులు నిరుద్యోగుల నుంచి భారీగా దండుకోవడానికి పైరవీలు చేస్తామంటూ నమ్మిస్తున్నారు..
* మా కుమారుడు డిగ్రీ చేసి ఖాళీగా ఉంటున్నాడు. ఎలాగైనా ఫర్వాలేదు.. ఉద్యోగం ఇప్పిస్తే చాలు.. రూ.లక్షలైనా అప్పజెప్పుతా.. పక్కాగా ఉద్యోగం కావాలి. ఆ గ్యారంటీ ఇచ్చేవారి వద్ద మాట్లాడు. పైసలు ఎక్కువైనా ఇచ్చుకుంటా.. ఓ దళారి వద్ద మాటామంతి ఇదీ..
* ఉద్యోగానికి ఎంపిక చేసేందుకు ఓ దళారికి రూ.5 లక్షల అడ్వాన్స్ కింద అప్పగించారు. పని పూర్తయిన తర్వాత మిగతా డబ్బులు చెల్లిస్తానని నిరుద్యోగి అంగీకారం కుదుర్చుకున్నాడు. ఉద్యోగం మాత్రం కావాలంటూ గ్యారంటీ తీసుకున్నాడు. ఎవరితో పనిచేయిస్తావన్నది అనవసరం. ఉద్యోగం ఇప్పించాలని చెప్పాడు.
సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు కల్పించేందుకు దళారులు దందా మొదలుపెట్టారు. సింగరేణి విస్తరించిన ఉన్న ఆరు జిల్లాల్లో దళారులు నిరుద్యోగుల నుంచి భారీగా దండుకోవడానికి పైరవీలు చేస్తామంటూ నమ్మిస్తున్నారు.. సింగరేణివ్యాప్తంగా కొంతమంది దళారులు నిరుద్యోగుల బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి మాయమాటలతో నమ్మిస్తున్నారు. ఒక్కో ఉద్యోగానికి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగం ఆశతో ఇప్పటికే కొంతమంది నిరుద్యోగులు దళారులకు అడ్వాన్స్ కింద కొంత సమర్పించుకున్నారు. సింగరేణిలో అంతర్గత 155, ఎక్స్టర్నల్ ద్వారా 117 మంది జూనియర్ అసిస్టెంట్ గ్రేడు-2 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతర్గత ఖాళీలను మే 19న, ఎక్స్టర్నల్ ఖాళీలకు జూన్ 16న నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతర్గత అభ్యర్థులు మే 25 నుంచి జూన్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి గడువు విధించింది. ఎక్స్టర్నల్ అభ్యర్థులకు జూన్ 20 నుంచి జులై 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రస్తుతం సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడు-2 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో దళారులు రంగంలోకి దిగారు. దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులను నమ్మించేందుకు తమకు పైవారితో పరిచయాలున్నాయని డబ్బులు దండుకుంటున్నారు. ముందే అడ్వాన్స్ కింద కొంతమొత్తం తీసుకుంటున్న దళారులు పరీక్షలు పూర్తయి ఉద్యోగానికి ఎంపికైన తర్వాత మిగతా మొత్తం చెల్లించాలని వారితో మాట తీసుకుంటున్నారు.
మళ్లీ అదే కథ..
సింగరేణిలో 2015లో 450 జూనియర్ అసిస్టెంట్ గ్రేడు-2 ఉద్యోగ నియామకాల సమయంలోనూ పరీక్షల్లో గందరగోళం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. పైరవీలు చేసుకున్న వారే ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రచారం జరిగింది. ఆ సమయంలోనూ పైరవీకారులు, దళారులు భారీగా త్తున నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశారు. ఆ తర్వాత మళ్లీ తాజాగా జూనియర్ అసిస్టెంట్ గ్రేడు-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలవడంతో మళ్లీ పైరవీల దందా మొదలైంది. 2015లో నిర్వహించిన ఉద్యోగ ఎంపికలో ఒకే ఇంట్లో ఇద్దరికి, ఒకే ప్రాంతానికి చెందినవారు ఎంపికయ్యారని ఆరోపణలు వచ్చాయి. మళ్లీ అదేవిధంగా ఈసారి ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలవడంతో దళారులు డబ్బులు దండుకునే పనిలో పడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న సింగరేణి సంస్థలో ఉద్యోగం దొరికితే భద్రత ఉంటుందన్న ఆశతో నిరుద్యోగులు ఎంత డబ్బులు చెల్లించడానికైనా ఆసక్తి చూపుతున్నారు. వారి బలహీనతలను ఆసరాగా చేసుకుంటున్న పైరవీకారులు సొమ్ము చేసుకుంటున్నారు.
కార్మికుల విగ్రహం
అత్యధికంగా దరఖాస్తులు
సింగరేణిలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ గ్రేడు-2 ఖాళీల కోసం నిరుద్యోగులైన అభ్యర్థులు భారీ మొత్తంలో దరఖాస్తు చేసుకున్నారు. అంతర్గత ఖాళీలతో పాటు ఎక్స్టర్నల్ ఖాళీలకు అత్యధికంగా దరఖాస్తులు చేసుకున్నారు. ఎక్స్టర్నల్ ఖాళీలు 117 ఉద్యోగాలకు 1,03,000 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అంతర్గత ఖాళీలకు అర్హులైన ఉద్యోగులు 10 వేల వరకు దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబరు 4న రాత పరీక్షలకు సింగరేణి ఏర్పాట్లు చేస్తోంది. గతంలో జేఎన్టీయూ పరీక్షల బాధ్యతను అప్పగించింది. అప్పట్లో దీనిపై వివాదం తలెత్తింది. ఈసారి సింగరేణి యాజమాన్యమే స్వయంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పారదర్శకంగా ఎంపిక - బలరాం, సింగరేణి సంచాలకులు
సింగరేణి ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది. దళారులకు డబ్బులిచ్చి మోసపోవద్దు. దళారులు వచ్చి అడిగితే సమాచారం ఇవ్వండి. వారిపై క్రిమినల్ కేసులు పెట్టిస్తాం. దళారులు మాటలు నమ్మి ఎవరూ డబ్బులు నష్టపోవద్దు. జూనియర్ అసిస్టెంట్ గ్రేడు-2 ఉద్యోగాల ఎంపికపై ఎలాంటి అపోహలకు తావులేదు. ప్రతిభకే అవకాశం ఉంటుంది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తాం. పైరవీకారులు చెప్పే మాయమాటలను నమ్మవద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుగడ్డపై కేసీఆర్
[ 10-05-2024]
భారాస అధినేత కేసీఆర్ రోడ్ షో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.. కరీంనగర్ తెలంగాణ చౌక్ ప్రాంతం కార్యకర్తలు, నాయకులతో కిక్కిరిసిపోగా కేసీఆర్ తన ప్రసంగంతో వారిలో ఉత్తేజం నింపారు.. -
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 69.5 శాతమే!
[ 10-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కును విధిగా వినియోగించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా 7,880 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
‘రిజర్వేషన్ల రద్దు ప్రచారం ఓ కుట్ర’
[ 10-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం పెద్ద కుట్ర అని భాజపా ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ అన్నారు. -
మతోన్మాద ప్రభుత్వాన్ని గద్దె దించాలి : సీపీఐ
[ 10-05-2024]
మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న భాజపా ప్రభుత్వాన్ని గద్దెదించి లౌకికవాదాన్ని కాపాడే దిశగా ప్రజలు ముందుకు రావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. -
కుల వృత్తులను కాపాడటంలో కాంగ్రెస్దే పైచేయి
[ 10-05-2024]
కులవృత్తులను కాపాడటంలో దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్దే పైచేయి అని ఆ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు పేర్కొన్నారు. -
వలసజీవి సంక్షేమానికి బాటలేయండి
[ 10-05-2024]
గల్ఫ్ ఏజెంటు మోసం చేశాడని ఇటీవల జగిత్యాలలో వందలాది మంది యువకులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. -
గీత దాటితే.. కటకటాలే!
[ 10-05-2024]
ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తోంది. దీంతో పాటు పోలింగ్కు ఆటంకం కలిగించే చర్యలను తీవ్రంగా పరిగణిస్తుంది. -
కరీంనగర్ జిల్లాలో రూ.16.92 లక్షల పట్టివేత
[ 10-05-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా గురువారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో మొత్తం రూ.16,92,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. -
అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యం : మంత్రి శ్రీధర్బాబు
[ 10-05-2024]
అన్నివర్గాల సంక్షేమ కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
రైతు భరోసా నిలిపివేయించింది ఆ పార్టీలే
[ 10-05-2024]
భాజపా, భారాసలకు రైతులపై చిత్తశుద్ధి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇస్తుంటే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపించారని ప్రభుత్వ విప్ -
ప్రశాంత ఎన్నికలకు పటిష్ఠ నిఘా
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
-
మేనత్తను అవమానిస్తే ఆనందిస్తారా?: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై డీకే అరుణ ఫైర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జైలుకు పోతానన్న భయంతో జగన్ లండన్కు: సీఎం రమేశ్