నీచ రాజకీయాలకు తెరలేపింది తెరాస, భాజపాలే
నీచ రాజకీయాలకు తెరలేపింది తెరాస, భాజపాలేనని మాజీ ఎంపీ వి.హన్మంతరావు విమర్శించారు. హుజూరాబాద్కు చేరుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్గౌడ్ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. అంబేడ్కర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో హన్మంతరావు
మాజీ ఎంపీ వి.హన్మంతరావు విమర్శ
హుజూరాబాద్లో మాట్లాడుతున్న హన్మంతరావు
హుజూరాబాద్ పట్టణం, హుజూరాబాద్ గ్రామీణం, న్యూస్టుడే: నీచ రాజకీయాలకు తెరలేపింది తెరాస, భాజపాలేనని మాజీ ఎంపీ వి.హన్మంతరావు విమర్శించారు. హుజూరాబాద్కు చేరుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్గౌడ్ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. అంబేడ్కర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో హన్మంతరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూములను ఆక్రమించుకొని గిరిజనులు, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కుమార్ మాట్లాడే విధానం సరిగా లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో అప్పటి ప్రధాని రాజీవ్గాంధీ యువత కోసం సాఫ్ట్ట్వేర్ రంగాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారన్నారు. నేడు మోదీ పాలనలో ప్రజలు కష్టపడుతున్నారన్నారు. పెద్దనోట్ల రద్దుతో ఎవరికి లబ్ధి చేకూరిందో చెప్పాలన్నారు. జాతీయ జెండా రూపకర్తను ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్లు మర్చిపోయారని ధ్వజమెత్తారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చేందుకు కుట్ర పన్నుతుందన్నారు. రాష్ట్రంలో మాఫీయాకు కేసీఆర్ ప్రభుత్వం వత్తాసు పలుకుతుందన్నారు. పొన్నం ప్రభాకర్గౌడ్ మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేరాల్చని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్రావు ఇంటి ఎదుట ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర కాదని సీఎం కేసీఆర్ ప్రయోజిత యాత్ర అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలున్న విషయం వాస్తవమేనని, వాటిని మేమే పరిష్కరించుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, నాయకులు బల్మూర్ వెంకట్ నర్సింగ్రావు, పత్తి క్రిష్ణారెడ్డి, గూడూరి స్వామిరెడ్డి, సొల్లు బాబు, గూడెపు సారంగాపాణి, రాజమల్లయ్య, కొల్లూరి కిరణ్కుమార్, సాహెబ్హుస్సేన్, పాదయాత్రలో ఎమ్మెల్యే సీతక్క, అంజన్కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ