జాతీయ స్థాయిలో జిల్లా ఘనత
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ- 2023 ప్రోగ్రాం కింద నవంబర్ నెలలో ఇచ్చిన పారామీటర్ల ఆధారంగా జాతీయస్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లా నాలుగు స్టార్ ర్యాంకింగ్ కేటగిరీలో మొదటిస్థానం కైవసం చేసుకున్నందుకు కలెక్టరేట్లో వేడుకలు నిర్వహించారు.
అధికారులు, ప్రజాప్రతినిధుల వేడుకలు
కేకు కోస్తున్న జడ్పీ ఛైర్పర్సన్ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల(విద్యానగర్), న్యూస్టుడే: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ- 2023 ప్రోగ్రాం కింద నవంబర్ నెలలో ఇచ్చిన పారామీటర్ల ఆధారంగా జాతీయస్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లా నాలుగు స్టార్ ర్యాంకింగ్ కేటగిరీలో మొదటిస్థానం కైవసం చేసుకున్నందుకు కలెక్టరేట్లో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జడ్పీ ఛైర్పర్సన్ న్యాలకొండ అరుణ హాజరై కోకు కోశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశస్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లా 4 స్టార్ ర్యాంకింగ్ కేటగిరీలో మొదటిస్థానం కైవసం చేసుకోవడం జిల్లాకు గర్వకారణమన్నారు. రాష్ట్ర ఏర్పాటు తరవాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పల్లె ప్రగతి, హరితహారం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, తండాలను గ్రామ పంచాయతీలు చేసి, రాష్ట్రంలోని ప్రతి గ్రామం పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండటం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, జడ్పీ సీఈవో గౌతమ్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, అదనపు డీఆర్డీవో మదన్మోహన్, ఎంపీడీవోలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ పవర్లూం, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గూడూరి ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ న్యాలకొండ అరుణ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, తెరాస జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.
యంత్రాంగానికి కేటీఆర్ అభినందనలు
మంత్రి కేటీఆర్ జిల్లా అధికారులకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మీ నిరంతర మార్గదర్శనం, ప్రజా ప్రతినిధులు, అధికారుల కృషి ఫలితమేనని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రతిగా ట్వీట్ చేశారు. ప్రతి మండలంలో వేడుకలు చేసుకోవాలని సూచించారు. ఇదే స్ఫూర్తితో పని చేస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2023లో అగ్రభాగాన నిలపాలని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుగడ్డపై కేసీఆర్
[ 10-05-2024]
భారాస అధినేత కేసీఆర్ రోడ్ షో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.. కరీంనగర్ తెలంగాణ చౌక్ ప్రాంతం కార్యకర్తలు, నాయకులతో కిక్కిరిసిపోగా కేసీఆర్ తన ప్రసంగంతో వారిలో ఉత్తేజం నింపారు.. -
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 69.5 శాతమే!
[ 10-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కును విధిగా వినియోగించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా 7,880 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
‘రిజర్వేషన్ల రద్దు ప్రచారం ఓ కుట్ర’
[ 10-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం పెద్ద కుట్ర అని భాజపా ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ అన్నారు. -
మతోన్మాద ప్రభుత్వాన్ని గద్దె దించాలి : సీపీఐ
[ 10-05-2024]
మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న భాజపా ప్రభుత్వాన్ని గద్దెదించి లౌకికవాదాన్ని కాపాడే దిశగా ప్రజలు ముందుకు రావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. -
కుల వృత్తులను కాపాడటంలో కాంగ్రెస్దే పైచేయి
[ 10-05-2024]
కులవృత్తులను కాపాడటంలో దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్దే పైచేయి అని ఆ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు పేర్కొన్నారు. -
వలసజీవి సంక్షేమానికి బాటలేయండి
[ 10-05-2024]
గల్ఫ్ ఏజెంటు మోసం చేశాడని ఇటీవల జగిత్యాలలో వందలాది మంది యువకులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. -
గీత దాటితే.. కటకటాలే!
[ 10-05-2024]
ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తోంది. దీంతో పాటు పోలింగ్కు ఆటంకం కలిగించే చర్యలను తీవ్రంగా పరిగణిస్తుంది. -
కరీంనగర్ జిల్లాలో రూ.16.92 లక్షల పట్టివేత
[ 10-05-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా గురువారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో మొత్తం రూ.16,92,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. -
అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యం : మంత్రి శ్రీధర్బాబు
[ 10-05-2024]
అన్నివర్గాల సంక్షేమ కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
రైతు భరోసా నిలిపివేయించింది ఆ పార్టీలే
[ 10-05-2024]
భాజపా, భారాసలకు రైతులపై చిత్తశుద్ధి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇస్తుంటే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపించారని ప్రభుత్వ విప్ -
ప్రశాంత ఎన్నికలకు పటిష్ఠ నిఘా
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది.