నేతన్నల నైపుణ్యానికి అబ్బురపడిన అమెరికా యువతి
అమెరికాకు చెందిన చేనేత నిపుణురాలు కైరా జఫ్ప్ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించారు. అమెరికా ప్రభుత్వ పరిశోధన గ్రాంటుతో ఆసియా ఖండంలోని వివిధ దేశాల్లో చేనేత రంగం పరిస్థితులు, నైపుణ్యం వంటి వాటిపై అధ్యయనం చేస్తున్న కైరా తన భర్తతో కలిసి సోమవారం సిరిసిల్లలో పర్యటించారు.
అగ్గిపెట్టెలో ఇమిడే చీరను పరిశీలిస్తున్న కైరా
సిరిసిల్ల(విద్యానగర్), న్యూస్టుడే: అమెరికాకు చెందిన చేనేత నిపుణురాలు కైరా జఫ్ప్ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించారు. అమెరికా ప్రభుత్వ పరిశోధన గ్రాంటుతో ఆసియా ఖండంలోని వివిధ దేశాల్లో చేనేత రంగం పరిస్థితులు, నైపుణ్యం వంటి వాటిపై అధ్యయనం చేస్తున్న కైరా తన భర్తతో కలిసి సోమవారం సిరిసిల్లలో పర్యటించారు. ఇప్పటికే పలు దేశాల్లోని చేనేత పరిశ్రమపై అధ్యయనాన్ని పూర్తిచేసుకొని భారతదేశంలోని తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మిక క్షేత్రాలైన పోచంపల్లి, గద్వాల, ఇతర నేత కార్మిక క్షేత్రాలైన సిరిసిల్ల, సిద్దిపేట, జనగామ వంటి ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సిరిసిల్లలోని పలువురు చేనేత కార్మికుల మగ్గాలను, వారు నేస్తున్న వస్త్రం, వారి నైపుణ్యాన్ని తెలుసుకున్నారు. చేనేత కళ నుంచి మరమగ్గాల వైపు సిరిసిల్ల నేతన్నలు మళ్లిన క్రమంపై ఆమె వివరాలు సేకరించారు. తన వినూత్నమైన చేనేత ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన వెల్ది హరిప్రసాద్ను కలిశారు. ఆయన నేసిన అగ్గిపెట్టెలో ఇమిడే చీరను చూసి అబ్బురపడ్డారు. ఇంత అద్భుతమైన ప్రతిభా నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులను తాను చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకప్పుడు సిరిసిల్ల క్లస్టర్లో నేతన్నల ఇబ్బందులు, పరిశ్రమ సంక్షోభం, దాని నుంచి బయటపడిన విధానం, ప్రభుత్వం అందించిన సహకారం, పవర్లూం యంత్రాలను ఆధునికీకరించిన విధానం తెలుసుకున్నారు. చేనేత కార్మికుల నైపుణ్యంతో పాటు ఒక పవర్లూం క్లస్టర్గా మారిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆమె వెంట తెలంగాణ మరమగ్గాలు, జౌళి అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ అధ్యక్షుడు గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల మున్సిపల్ ఛైర్పర్సన్ జిందం కళ, చేనేత, జౌళిశాఖ ఏడీ సాగర్ తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో భారీ వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్
[ 07-05-2024]
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
నిజామాబాద్ను గుండెల్లో పెట్టుకుంటా
[ 07-05-2024]
‘‘ నేను గులాబీ జెండా ఎత్తిన నాడు.. నిజామాబాద్ నా వెంట నిలిచి జిల్లా పరిషత్తును గెలిపించింది. -
కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిరసన
[ 07-05-2024]
కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిబ్బందిపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం, రికార్డులను ఎత్తుకెళ్లిన ఘటనపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సునీతారాణి తెలిపారు. -
భాజపాశ్రేణుల్లో జోష్!
[ 07-05-2024]
రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ.7 వేల కోట్లతో పునరుద్ధరించి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం.. కేంద్ర పథకాలతో ప్రజలు పెద్దఎత్తున లబ్ధి పొందారు.. -
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల కమిషనింగ్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. -
ఇలాగైతే ఓటేసేదెలా?
[ 07-05-2024]
సినిమా థియేటర్లో సీట్ల సంఖ్యను బట్టి టిక్కెట్లు విక్రయిస్తారు. ప్రేక్షకుల్లో ఆదరణను అంచనా వేస్తూ అదే సినిమాను రెండు, మూడు థియేటర్లలోనూ ఆడిస్తారు. -
ఇదీ మా ఎజెండా
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఆయా పార్టీలు మ్యానిఫెస్టోలు ప్రకటించి ఇప్పటికే జనంలోకి తీసుకెళ్లాయి. -
భాజపాను ఇంటికి సాగనంపాలి
[ 07-05-2024]
గత ఎన్నికల్లో దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వంచించిన నరేంద్రమోదీని, మతోన్మాద ముసుగులో దేశాన్ని పరిపాలిస్తున్న భాజపాను ఇంటికి సాగనంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
ప్రచార ఖర్చులు విధిగా సమర్పించాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రచార ఖర్చుల వివరాలను విధిగా సమర్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. -
ఈవీఎం కమిషనింగ్ పూర్తి చేయాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా రామగుండం నియోజకర్గం పరిధిలో నిర్వహించే ఓటింగ్కు సంబంధించి ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, పెద్దపల్లి ఎన్నికల అధికారి ముజమ్మిల్ఖాన్ సోమవారం పరిశీలించారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
[ 07-05-2024]
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని, మే 13న పోలింగ్ సజావుగా జరిగేలా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
సంజు శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్పై దిల్లీ విజయం
-
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ