ఉమ్మడి జిల్లాకు మరో పదవి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరో పదవి దక్కింది. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకతను చాటిన నాలుగు జిల్లాల్లోని పలువురు కీలక నాయకులు ఇప్పటికే పలురకాల నామినేటెడ్ పదవులను అందుకున్నారు.
ఈసారి రవీందర్సింగ్కు దక్కిన అవకాశం
రవీందర్సింగ్
ఈనాడు, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరో పదవి దక్కింది. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకతను చాటిన నాలుగు జిల్లాల్లోని పలువురు కీలక నాయకులు ఇప్పటికే పలురకాల నామినేటెడ్ పదవులను అందుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి జిల్లాకు పదవుల పంపకంలో పెద్దపీట వేశారు. మూణ్ణెళ్ల కిందటనే టెక్టైల్స్ కార్పొరేషన్ ఛైర్మన్గా సిరిసిల్ల జిల్లాకు చెందిన గూడురి ప్రవీణ్ను నియమించారు. అంతకు కొన్ని రోజుల ముందు కరీంనగర్కు చెందిన కుర్మాచలం అనిల్కు ఫిల్మ్, టీవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా గురువారం కరీంనగర్కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, నగర మాజీ మేయర్ రవీందర్సింగ్కు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్గా నియమితులయ్యారు. కరీంనగర్లో రవీందర్సింగ్ కుమార్తె వివాహానికి వచ్చి వెళ్లిన తరువాత ఈ ఉత్తర్వులు వెలువడటంతో తెరాస శ్రేణుల్లో జోష్ కనిపించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వకపోవడంతో పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రవీందర్ మళ్లీ తెరాసలో చేరారు. అప్పటి నుంచీ మళ్లీ ముఖ్యమంత్రికి సన్నిహితంగానే ఉంటున్న రవీందర్సింగ్ కుమార్తె వివాహం రోజునే పదవి వరించడంతో ఆనందంలో మునిగిపోయారు.
సఖ్యత కుదిరేనా?
తెరాస స్థానిక నాయకులతో రవీందర్సింగ్ గత కొన్ని నెలలుగా అంటీముట్టనట్లు ఉంటున్నారు. ఎక్కువగా రాష్ట్ర రాజధానిలో ఉంటూ సీఎంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మంత్రి గంగుల కమలాకర్.. రవీందర్ సింగ్ కొన్నేళ్లుగా ఎవరికి వారనే తరహాలో వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తెరాసలోని ముఖ్య నేతలను రవీందర్సింగ్ బాహాటంగానే విమర్శించడంతో దూరం మరింతగా పెరిగింది. తిరిగి పార్టీలోకి వచ్చిన తరువాత కూడా ఆయన సొంతంగానే కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఈ విషయం పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఇక్కడ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా రవీందర్సింగ్కు నామినేటెడ్ పదవి ఇస్తూ గంగులకు.. ఆయనకు సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేశారనే అభిప్రాయం గులాబీ పార్టీ నాయకుల నోట వినిపిస్తోంది. పైగా మంత్రి గంగుల పర్యవేక్షించే పౌరసరఫరాల శాఖ అనుబంధ సంస్థకు ఛైర్మన్గా నియమించడం కూడా కేసీఆర్ వ్యూహమనేది సొంత పార్టీ నాయకుల నుంచి వినిపిస్తున్న మాట.. ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులను అధిగమించాలనే ఉద్దేశంతోనే పార్టీ అధినేత ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని వారు పేర్కొంటున్నారు. వారిద్దరు కలిసి నడిస్తే పార్టీకి మంచిదనే భావన తెరాస శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల బరిలో 99మంది
[ 30-04-2024]
ఎట్టకేలకు లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచే వారెవరో తేలింది.. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం మధ్యాహ్నంతో ముగియడంతో అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైంది.. -
నేడు జమ్మికుంటకు సీఎం.. 8న వేములవాడకు పీఎం
[ 30-04-2024]
పెరుగుతున్న ఉష్ణోగ్రతల మాదిరిగానే పార్టీలు ప్రచార వేడిని క్రమంగా పెంచుతున్నాయి. ఉత్తర తెలంగాణలో కీలకమైన జిల్లాగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్పై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి. -
సెలవు పెట్టలేదు.. విధులకు రాలేదు!
[ 30-04-2024]
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని పలువురు వైద్యులు సెలవు పెట్టకుండా, విధులకు హాజరుకాకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులుపడ్డారు. -
తగ్గుతున్న మామిడి ధర
[ 30-04-2024]
మామిడి ధరలు రోజురోజుకు తగ్గుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
కమల దళంలో మారిన సమీకరణలు
[ 30-04-2024]
పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ నేత బోర్లకుంట వెంకటేశ్నేత భాజపా గూటికి చేరారు. -
నెరవేరని వస్త్రోత్పత్తి లక్ష్యం
[ 30-04-2024]
ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి ఏకరూప దుస్తులు విద్యార్థులకు సిద్ధం చేయడం అసాధ్యమనిపిస్తోంది. -
చైతన్య ఫలితం.. శాంతియుతం
[ 30-04-2024]
ఒకప్పుడు ఎన్నికలంటేనే గ్రామాల్లో పగలు, ప్రతీకారాలు కనిపించేవి. నిత్యం గొడవలతో ఘర్షణ వాతావరణం నెలకొనేది. -
యువత.. కురిపించాలి మమత
[ 30-04-2024]
నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. -
సుర్రుమంటూ సూరీడు.. ఉసూరుమంటూ నాయకుడు
[ 30-04-2024]
‘ మెల్లగా తెల్లారిందే అలా..!’ అనుకుంటూ రాజకీయ నాయకులు ప్రచారానికి పరుగులెత్తిన కొద్దిసేపటికే భానుడు సుర్రుమంటున్నాడు.. ఉదయం ఏడింటికే భగభగ మండుతున్నాడు.. -
రిజర్వేషన్లు రద్దు చేయబోమని ప్రకటించరెందుకు?
[ 30-04-2024]
రిజర్వేషన్లు రద్దు చేయబోమని భాజపా, ఆర్ఎస్ఎస్ ఎందుకు ప్రకటించడం లేదని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్ ప్రశ్నించారు. -
ఏసీబీకి చిక్కిన హెడ్కానిస్టేబుల్
[ 30-04-2024]
జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సామల్ల మనోహర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. -
ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
[ 30-04-2024]
జిల్లాలో అందిస్తున్న ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో తెలిపారు.