రాజన్న గుడి.. అంతర్జాలంలో వెనకబడి
దేశంలో ప్రసిద్ధి పొందిన శైవక్షేత్రాల్లో వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయం ఒకటి. దక్షిణ కాశీగా పేరొందిన ఇక్కడికి రోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
వెబ్సైట్ నిర్వహణను గాలికొదిలేసిన అధికారులు
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
రాజన్న ఆలయ వెబ్సైట్
దేశంలో ప్రసిద్ధి పొందిన శైవక్షేత్రాల్లో వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయం ఒకటి. దక్షిణ కాశీగా పేరొందిన ఇక్కడికి రోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. శివరాత్రికి రాజన్న దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షల్లో భక్తులు తరలి వస్తుంటారు. అలా వచ్చే భక్తులు ముందుగానే ఇక్కడి ప్రత్యేక పూజల వివరాలు, గదులు, పర్యాటక స్థలాలు ఇలా ప్రతిదీ తెలుసుకోవాలంటే అంతర్జాలం ఒక్కటే ఆధారం. కానీ ఈ విషయంలో భక్తులకు నిరాశే ఎదురవుతోంది. ఆలయ అధికారిక వెబ్సైట్ నిర్వహణను గాలికొదిలేయడమే ఇందుకు కారణం. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇక్కడి రద్దీ, వసతులను చూసి ఇబ్బందులు పడుతున్నారు. ఆలయంలో విస్తరించిన సేవలు, వసతితోపాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక పూజలు, విరాళాలు అందించే సమాచారం వంటివి ఇక్కడికి వచ్చాకే తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచమంతా అంతర్జాలం, యాప్లు వంటి సాంకేతికను అందిపుచ్చుకునేందుకు పరుగులు తీస్తుంటే రాజన్న ఆలయ అధికారులు మాత్రం బాగా వెనకబడ్డారు.
2016 నాటి సమాచారం
పునరుద్ధరిస్తే..
ప్రముఖ క్షేత్రం కావడంతో ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉంటుంది. దూరపు ప్రాంతాల వారు అధికంగా వస్తుంటారు. ఆలయ వెబ్సైట్ని ఆధునికీకరించడంతో పాటు యాప్ను అందుబాటులోకి తీసుకురావాలి. ఆలయ ఆదాయంతో పోలిస్తే వీటి నిర్వహణ ఏ మాత్రం భారం కాదు. వెబ్సైట్లో గుడిలో రోజువారీ పూజల వివరాలతో పాటు ఇతర కార్యక్రమాల వివరాలను నవీకరించారు. గదుల ఖాళీలు, ఆన్లైన్లో ఆర్జిత సేవల టికెట్ల బుకింగ్ సదుపాయం కల్పించవచ్చు. ఇక యాప్లో వీడియోలు, చిత్రాలు ఉంచాలి. ఆలయ నిర్మాణ పనుల వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలి.
వేములవాడ వైభవం
వేములవాడ చాళుక్యుల రాజధాని, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కేంద్రంగా నిలిచినట్లు కొల్లిపర, పర్భణి శాసనాలు చెబుతున్నాయి. జైన మతం ప్రాచుర్యంలో ఉండేది. ఇక్కడి భీమేశ్వరాలయానికి ఎన్నో విశేషాలున్నాయి. ఇలా చరిత్ర విశేషాలు వెబ్సైట్లో పెడితే వేములవాడ వైభవం విశ్వవ్యాప్తం అవుతుంది. అలాగే రాజన్న గుడితోపాటు బద్దిపోచమ్మ, నాంపల్లి లక్ష్మీనర్సింహస్వామి, అగ్రహారం అంజన్న ఆలయాలతోపాటు మధ్యమానేరుకు రాజరాజేశ్వర జలాశయంగా నామకరణం చేశారు. ఇలా గతం, ప్రస్తుత సమాచారం, ఎలా వెళ్లాలో వివరిస్తే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా మహా శివరాత్రి వంటి ప్రత్యేక సందర్భాల్లో దూర ప్రాంత భక్తులు ఎలా రావాలి, ఇక్కడున్న దర్శణీయ స్థలాలు, వాటి ప్రాముఖ్యతలు తెలుసుకుని ప్రణాళికను రూపొందించుకునే అవకాశం ఉంటుంది. ఆలయ అధికారులు వీటిపై దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు.
ఆరేళ్ల నాటి సమాచారం
ఇది సమాచార సాంకేతిక యుగం. ఏది తెలుసుకోవాలన్నా అంతర్జాలమే ఆధారం. గతంలో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల పేరిట అధికారిక వెబ్సైట్లు నిర్వహించేవారు. అయితే యాప్లు వెల్లువ తర్వాత చాలా వరకు ఆయా దేవాలయం పేరిట ప్రత్యేక యాప్లు ప్రవేశపెట్టి భక్తులకు సమాచారం అందిస్తూ మరింత చేరువవుతున్నాయి. అయితే రాజన్న ఆలయానికి సంబంధించి ఇవేమీ కనిపించవు. పాత సమాచారమే కనిపిస్తుంది. 2016లో చివరిసారి వెబ్సైట్ను అప్డేట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్