మహా శివరాత్రి జాతరకు భారీ భద్రత
మహా శివరాత్రి జాతరకు భారీ భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగే మహా శివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై పోలీసు, ఆలయ అధికారులతో కలిసి సోమవారం ఎస్పీ పరిశీలించారు.
ఏర్పాట్లపై పోలీసు అధికారులకు సూచనలు చేస్తున్న ఎస్పీ అఖిల్ మహాజన్, చిత్రంలో డీఎస్పీ నాగేంద్రచారి, ఈవో కృష్ణ ప్రసాద్
వేములవాడ, న్యూస్టుడే: మహా శివరాత్రి జాతరకు భారీ భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగే మహా శివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై పోలీసు, ఆలయ అధికారులతో కలిసి సోమవారం ఎస్పీ పరిశీలించారు. ఆలయ పరిసరాల్లోని దర్శన ప్రదేశాలు, ధర్మగుండం, శివార్చన వేదిక, వీఐపీ, జనరల్ పార్కింగ్ ప్రదేశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహా శివరాత్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా భద్రత చర్యలు చేపడతామని చెప్పారు. జాతర సందర్భంగా వేములవాడ పట్టణం, దేవాలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసి 24 గంటలూ నిఘా పెట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వాహనాలతో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వాహనాల పార్కింగ్ స్థలాలను గుర్తించి వాటిని క్రమ పద్ధతిలో నిలపడానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. భక్తుల క్యూలైన్లకు సంబంధించిన, పార్కింగ్ ప్రదేశాలకు వెళ్లే దారుల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, డీఎస్పీ నాగేంద్రచారి, పట్టణ సీఐ వెంకటేష్, ఈఈ రాజేష్, ఆలయ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుగడ్డపై కేసీఆర్
[ 10-05-2024]
భారాస అధినేత కేసీఆర్ రోడ్ షో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.. కరీంనగర్ తెలంగాణ చౌక్ ప్రాంతం కార్యకర్తలు, నాయకులతో కిక్కిరిసిపోగా కేసీఆర్ తన ప్రసంగంతో వారిలో ఉత్తేజం నింపారు.. -
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 69.5 శాతమే!
[ 10-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కును విధిగా వినియోగించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా 7,880 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
‘రిజర్వేషన్ల రద్దు ప్రచారం ఓ కుట్ర’
[ 10-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం పెద్ద కుట్ర అని భాజపా ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ అన్నారు. -
మతోన్మాద ప్రభుత్వాన్ని గద్దె దించాలి : సీపీఐ
[ 10-05-2024]
మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న భాజపా ప్రభుత్వాన్ని గద్దెదించి లౌకికవాదాన్ని కాపాడే దిశగా ప్రజలు ముందుకు రావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. -
కుల వృత్తులను కాపాడటంలో కాంగ్రెస్దే పైచేయి
[ 10-05-2024]
కులవృత్తులను కాపాడటంలో దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్దే పైచేయి అని ఆ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు పేర్కొన్నారు. -
వలసజీవి సంక్షేమానికి బాటలేయండి
[ 10-05-2024]
గల్ఫ్ ఏజెంటు మోసం చేశాడని ఇటీవల జగిత్యాలలో వందలాది మంది యువకులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. -
గీత దాటితే.. కటకటాలే!
[ 10-05-2024]
ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తోంది. దీంతో పాటు పోలింగ్కు ఆటంకం కలిగించే చర్యలను తీవ్రంగా పరిగణిస్తుంది. -
కరీంనగర్ జిల్లాలో రూ.16.92 లక్షల పట్టివేత
[ 10-05-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా గురువారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో మొత్తం రూ.16,92,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. -
అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యం : మంత్రి శ్రీధర్బాబు
[ 10-05-2024]
అన్నివర్గాల సంక్షేమ కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
రైతు భరోసా నిలిపివేయించింది ఆ పార్టీలే
[ 10-05-2024]
భాజపా, భారాసలకు రైతులపై చిత్తశుద్ధి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇస్తుంటే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపించారని ప్రభుత్వ విప్ -
ప్రశాంత ఎన్నికలకు పటిష్ఠ నిఘా
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
-
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్