రంజాన్ ఏర్పాట్లపై సమీక్ష
రంజాన్ పండగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఏర్పాట్లపై వివిధశాఖల అధికారులు ముస్లిం మత పెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
సమావేశంలో కలెక్టర్ యాస్మిన్బాషా, ఎస్పీ భాస్కర్
జగిత్యాల, న్యూస్టుడే: రంజాన్ పండగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఏర్పాట్లపై వివిధశాఖల అధికారులు ముస్లిం మత పెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో పండగ జరుపుకోవాలని ప్రభుత్వ ఆదేశం మేరకు రంజాన్ మాసంలో చేయాల్సిన ఏర్పాట్లపై ఇదివరకే వివిధ శాఖల అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. ఉపవాస దీక్షల సమయంలో మసీదుల వద్ద పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని తాగునీరు అందుబాటులో ఉంచాలని విద్యుత్తు ఇబ్బందులు లేకుండా చూడాలని వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా ఎస్పీ ఎ.భాస్కర్ మాట్లాడుతూ పరస్పరం మతాలను గౌరవించుకుంటూ పండగను నిర్వహించుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని ఎలాంటి సంఘటనలు జరిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రార్థనా సమయాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని మసీదుల వద్ద పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు ఆర్.డి.మాధురి, టి.వినోద్కుమార్, జగిత్యాల, మెట్పల్లి డీఎస్పీలు ఆర్.ప్రకాశ్, వి.రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆస్తిపన్ను వసూలు చేయాలి : కలెక్టర్
జగిత్యాల పట్టణంలో వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా అన్నారు. గురువారం ఆస్తిపన్నుపై పురపాలక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రూ.12.40 కోట్ల ఆస్తి బకాయిలుండగా ఇప్పటి వరకు రూ.6.52 కోట్లు వసూలు అయ్యాయని మిగతా బకాయిలు ఈనెల 31లోపు వసూలు చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు గత సంవత్సరం కంటే 6 శాతం అదనంగా పన్ను బకాయిలు వసూలు చేస్తేనే 15వ ఆర్థిక సంఘం, అమృత్, స్వచ్ఛ సర్వేక్షణ్ నిధులకు అర్హత ఉంటుందని ఇప్పటి వరకు 52 శాతం పన్నులు వసూలు జరిగిందన్నారు. ఇన్ఛార్జి పురపాలక ఛైర్మన్ గోలి శ్రీనివాస్, అదనపు కలెక్టర్ మంద మకరందు, కమిషనర్ నరేష్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్