ఆధ్యాత్మిక శోభ
ఉమ్మడి జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఒక పక్క శ్రీరామ నవమి వసంతోత్సవాలు మొదలుకాగా.. మరో పక్క శుక్రవారం నుంచి రంజాన్ మాస ఉపవాస దీక్షలు ఆరంభమవుతున్నాయి.
మొదలైన శ్రీరామ నవమి వసంతోత్సవాలు
నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ఆరంభం
న్యూస్టుడే, కరీంనగర్ సాంస్కృతికం
ఉమ్మడి జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఒక పక్క శ్రీరామ నవమి వసంతోత్సవాలు మొదలుకాగా.. మరో పక్క శుక్రవారం నుంచి రంజాన్ మాస ఉపవాస దీక్షలు ఆరంభమవుతున్నాయి. ఏ ఆలయం చూసినా.. ఏ మసీదు చూసినా భక్తజనంతో నిండిపోనున్నాయి. మార్కెట్లో వ్యాపార, వాణిజ్య సంస్థలు కళకళలాడనున్నాయి.
ముస్లింలు అత్యంత పవిత్ర మాసంగా రంజాన్ను చూస్తారు. ఈ నెలంతా ఉపవాసాలు పాటించడం ప్రతి ఒకరి విధిగా భావిస్తారు. ఈ ఉపవాస దీక్షలు వారిలో దైవభీతి నెలకొల్పి సత్కార్యాలు ఆచరించేలా.. చెడు కార్యాలకు దూరంగా ఉండేలా చేస్తాయి. గురువారం రాత్రి నెలవంక దర్శనంతో సైరన్ మోగడంతోనే మరుసటి రోజు శుక్రవారం నుంచి ఉపవాస దీక్షలు చేపడుతున్నారు. దైవానికి కృతజ్ఞత తెలియజేసేందుకు ఈ ఉపవాస దీక్షలు కఠినంగా చేస్తారు. ఇస్లాం సౌధానికి ఉండే అయిదు మూల స్తంభాల్లో రంజాన్ ఉపవాస వ్రతం ఒకటి. పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిన మాసం కావడంతో ఆధ్యాత్మిక సౌఖ్యానికి సంబంధించిన దివ్య బోధనలు వినడం.. చదవడం.. ఆచరించడం చేస్తారు. ఈ మాసంలో సాధారణ, తరావీహ్ ప్రత్యేక నమాజ్లు చేయాల్సి ఉంటుంది.
మసీదుల్లో పారిశుద్ధ్య పనులు..
రంజాన్ మాసం సందర్భంగా మసీదుల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. నిరంతరం నీటి సరఫరాతోపాటు కరెంటుకు అంతరాయం లేకుండా చూడాలని, మసీదు, ఈద్గా స్థలాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మున్సిపల్, పంచాయతీ అధికారులు ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 650 మసీదులు ఉన్నాయి. కరీంనగర్ నగరంతోపాటు శివారులోనే దాదాపు 80 ఉన్నాయి. వేసవికాలం కావడంతో తాగునీటి సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకున్నారు. రంజాన్ సందర్భంగా ఇప్పటికే హలీమ్ స్టాళ్లు వెలిశాయి. కరీంనగర్లో పండ్ల మార్కెట్ కళకళలాడుతుంది.
నవరాత్రోత్సవాలు
శ్రీరామ నవమి నవరాత్రోత్సవాలనే వసంతోత్సవాలుగా ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రామాలయాలు, హనుమాన్ దేవాలయాతోపాటు వైష్ణవ, శివాలయాల్లో కూడ శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు శ్రీసీతారామచంద్ర స్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తి గీతాల ఆలాపన, భజనలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మానవాళికి మార్గదర్శనం చూపే మాసం
దివ్య ఖురాన్ అవతరించిన మాసంగా రంజాన్ను చూస్తాం. ఖురాన్ సర్వ మానవాళికి మార్గదర్శనం చూపించే గ్రంథం. నెల రోజుల ఉపవాస దీక్షలు సన్మార్గంలో జీవించే విధానాన్ని అలవర్చుకునేలా చేస్తాయి. పేదలపై సానుభూతి చూపించడమే కాకుండా, అందరూ పండగ సమానంగా చేసుకోవాలనే ఫిత్రా దానాలు చేస్తారు. ఇది మానవుడిలో పరివర్తన తీసుకొచ్చే మాసం.
మహమ్మద్ ఖైరొద్దీన్, అధ్యక్షుడు, జమాతే ఇస్లామీ హింద్, కరీంనగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?