సమస్యలకు మోక్షం కల్పించరూ!
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలను ఏకరవు పెట్టారు.
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి దృష్టిపెట్టాలి
వినతులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ తదితరులు
సిరిసిల్ల (విద్యానగర్), న్యూస్టుడే: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. కింది స్థాయి అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తమ సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని వేడుకొన్నారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 28 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. రెవెన్యూకు సంబంధించి 14, సిరిసిల్ల మున్సిపాలిటీ-4, డీఎంహెచ్ఓ, డీపీవో, డీఆర్డీవోలకు సంబంధించి రెండేసి చొప్పున, సబ్ రిజిస్ట్రార్, విద్యాశాఖ, ఎల్లారెడ్డిపేట ఎంపీడీవో, తంగళ్లపల్లి ఎంపీడీవోలకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున మొత్తం 28 ఫిర్యాదులు వచ్చాయి.
న్యాయం చేయాలి
- మంజుల, ఆర్అండ్ఆర్ కాలనీ
మా గ్రామం రుద్రవరం. మధ్యమానేరులో ముంపునకు గురైంది. నేను ప్రభుత్వ పునరావాస ప్యాకేజీకి అర్హురాలిని. రుద్రవరం గ్రామానికి చెందిన గాలిపెల్లి స్వామి అనే వ్యక్తి నీకు పట్టా రాదు, నేను పైరవీ చేసి పట్టా ఇప్పిస్తానని నా వద్ద రూ.40 వేలు తీసుకున్నాడు. నాకు శాభాష్పల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో సర్వే నంబర్ 451లో 339 ప్లాట్ నంబర్ పట్టా వచ్చింది. అయినప్పటికీ గాలిపెల్లి స్వామి నాకు శ్మశానవాటికలో పట్టా వచ్చిందని మోసం చేశాడు. తాను పైరవీ చేయడం వల్లే వచ్చిందని, రూ.16 లక్షలు ఇచ్చి ప్లాట్ తీసుకుంటానని బెదిరించాడు. రూ.లక్ష నా ఖాతాకు పంపి, మిగతా డబ్బులు తరవాత ఇస్తానన్నాడు. నాతో తెల్ల కాగితంపై సంతకం చేయించుకొని ప్లాట్ను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అతనిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలి.
రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై..
- ఎగుర్ల బీరయ్య, కందికట్కూర్, ఇల్లంతకుంట మండలం
నాకు కందికట్కూర్ శివారులో సర్వే నంబరు 150లో 12 గుంటలు, సర్వే నంబర్ 435లో 7 గుంటల భూమి, సర్వే నంబర్ 275లో 2 గుంటల భూమి ఉంది. నేను 55 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నా. నేను నిరక్షరాస్యుడనని ఎగుర్ల లింగమ్మ, ఎగుర్ల రాజమల్లవ్వ, ఎగుర్ల మీనయ్యలు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై వారి పేర్లపై మార్చుకున్నారు. ప్రశ్నిస్తే నాపై దాడి చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. నా న్యాయం చేయాలి.
ఇంటి పన్ను ఎక్కువ విధించారు
- వేముల పోశెట్టి, సిరిసిల్ల
మున్సిపల్ పరిధిలో ఉంటాను. మాకు ఇంటి పన్ను ఎక్కువగా విధించారు. మాకు దుకాణం లేకపోయినా ఉన్నట్లుగా పరిగణంచి ఎక్కువ పన్ను వేశారు. ప్రశ్నిస్తే తప్పనిసరిగా కట్టాలని చెబుతున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.
తీగలకుంట చెరువు పరిధి మార్చాలి
- పిట్టల లాస్య, సర్పంచి, రాధ, జ్యోతి, పద్మ, రేవతి కొత్తపేట గ్రామస్థులు
చందుర్తి మండలంలోని కొత్తపేటకు, జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలానికి మధ్య ఉన్న తీగలకుంట చెరువు ప్రస్తుతం జగిత్యాల జిల్లా నీటిపారుదలశాఖ పరిధిలో ఉంది. దీంతో కొత్తపేట గ్రామస్థులకు చెరువులో సాగు నీటి హక్కులు లేవు. ప్రభుత్వం స్పందించి తీగలకుంట చెరువును రాజన్న సిరిసిల్ల జిల్లా నీటిపారుదలశాఖ పరిధిలోకి మార్చాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM