logo

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని జిల్లా పాలనాధికారిణి సంగీత సత్యనారాయణ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎలిగేడు మండలం ధూళికట్ట, సుల్తానాబాద్‌ మండలం చిన్నకల్వల గ్రామాల్లో శనివారం నిర్వహించిన రైతు దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు.

Published : 04 Jun 2023 05:03 IST

ధూళికట్టలో బతుకమ్మతో పాలనాధికారిణి సంగీత

సుల్తానాబాద్‌, న్యూస్‌టుడే: రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని జిల్లా పాలనాధికారిణి సంగీత సత్యనారాయణ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎలిగేడు మండలం ధూళికట్ట, సుల్తానాబాద్‌ మండలం చిన్నకల్వల గ్రామాల్లో శనివారం నిర్వహించిన రైతు దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఎకరా వరి సాగుకు అయ్యే ఖర్చుతో మూడెకరాల్లో ఆయిల్‌పాం సాగు చేయవచ్చని, సుమారు 90 శాతం రాయితీపై విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు బోనాలు, బతుకమ్మలతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు కావేరి, ఐలయ్య, జిల్లా ఉపాధి కల్పన అధికారి తిరుపతిరావు, ఏవో ఉమాపతి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని